టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| party =కాంగ్రెసు
| religion = [[హిందూ]]
| spouse = [[మణెమ్మ]]
| date =
| year =
పంక్తి 20:
'''టంగుటూరి అంజయ్య''' ([[ఆగష్టు 16]], [[1919]] - [[అక్టోబరు 19]], [[1986]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]. ఈయన [[1980]] అక్టోబరు నుండి [[1982]] ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
 
ఆంజయ్య 1919, [[ఆగష్టు 16]] న [[హైదరాబాదు]] లో జన్మించాడు. అంజయ్య తండ్రి పాపిరెడ్డిది [[మెదక్ జిల్లా]], [[భానూర్]] గ్రామం. అయితే వారి కుటుంబం [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]]<nowiki/> లో స్థిరపడింది. ఆంజయ్య [[సుల్తాన్ బజార్]] ఉన్నత పాఠశాలలో [[మెట్రిక్యులేషన్]] వరకూ చదువుకున్నాడు. [[హైదరాబాదు ఆల్విన్]] పరిశ్రమలో ''ఆరణాల కూలీ''గా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు<ref name=anj3>[http://www.hindu.com/2006/08/14/stories/2006081417680500.htm లుంబినీ పార్కు వద్ద అంజయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భముగా హిందూ పత్రికలో వ్యాసం]</ref>.
[[కాంగ్రెసు పార్టీ]] కి చెందిన అంజయ్య [[మెదక్]] జిల్లా [[రామాయంపేట]] నియోజకవర్గము నుండి రాష్ట్ర [[శాసన సభ]] కు ఎన్నికైనాడు.
 
==ముఖ్యమంత్రిగా==
1980 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో [[ఇందిరా గాంధీ]] మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను [[ముఖ్యమంత్రి]]<nowiki/> గా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా ''జంబో మంత్రివర్గమని'' పిలిచేవారు<ref name=anj1>Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty పేజీ.41</ref>. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడితేగాఒత్తిడి తేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు<ref name=anj2>Plotting, Squatting, Public Purpose, and Politics: Land Market Development, Low Income Housing and Public intervention in India - Robert-Jan Baken పేజీ.41</ref>. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయినందున, ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.
 
అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో [[పంచాయితీ రాజ్]] సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.<ref>The Indian Journal of Political Science By Indian political science association Vol. 35, no. 4 (Oct.-Dec. 1974) పేజీ.542 [http://books.google.com/books?id=xg4tAAAAIAAJ&q=t.+anjaiah&dq=t.+anjaiah&pgis=1]</ref>
 
1984 పార్లమెంటు ఎన్నికలలో [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం]] నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా [[రాజీవ్ గాంధీ]] మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి [[టంగుటూరి మణెమ్మ]] కూడా [[సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం]] నుండి పార్లమెంటుకు ఎన్నికైనది. [[సెప్టెంబరు 9]] [[2018]] న మణెమ్మ హైదరాబాదు లో చనిపోయారు.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు