టేకుమళ్ళ అచ్యుతరావు: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''టేకుమళ్ళ అచ్యుతరావు''' ([[ఏప్రిల్ 18]], [[1880]] - [[ఫిబ్రవరి 12]], [[1947]]) ప్రముఖ విమర్శకులు మరియు పండితులు.<ref>[http://www.vepachedu.org/manasanskriti/tekumallaa.html టేకుమళ్ళ గురించి వేపచేదు వెబ్ సైటులో.]</ref>
 
వీరు [[విశాఖపట్టణం జిల్లా]]లోని [[పోతనవలస]] గ్రామంలో రామయ్య మరియు వెంకమ్మ దంపతులకు [[విక్రమ]] నామ సంవత్సరం [[చైత్ర శుద్ధ నవమి]] రోజున జన్మించారు. వీరు ఎఫ్.ఎ.ను [[పర్లాకిమిడి]] లోను మరియు బి.ఎ.ను [[విజయనగరం]]లోను పూర్తిచేశారు. [[బి.ఎ]]. పరీక్షలో [[ఆంగ్లం]]లో ప్రథముడిగా నెగ్గి [[మెక్డోడాల్డ్]]మెక్డోనాల్డ్ మెడల్ సాధించారు. తర్వాత [[రాజమండ్రి]]లోని ప్రభుత్వ శిక్షణ కళాశాలలోచేరి ఎల్.టి. పరీక్షలో ఉత్తీర్ణులై అక్కడనే ఉపాధ్యాయులుగా పనిచేశారు. వీరు పాఠశాలల అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ పదవిని అలంకరించి క్రమంగా ఉపాధ్యాయ ట్రయినింగ్ కళాశాల హెడ్ మాస్టరు పదవిని పొంది 1934లో పదవీ విరమణ చేసేవరకు ఆ పదవిలోనే ఉన్నారు. వీరు [[కలకత్తా]] విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పూర్తిచేశారు. వీరు 1900లో భమిడిపాటి ద్వారకా విశాలాక్షిని పరిణయమాడారు.
 
వీరు రచించిన "విజయనగర ఆంధ్ర వాజ్మయ చరిత్ర", కవి జీవిత విశేషాలను, కవికృత కావ్యాల విమర్శలను సమానంగా పర్యాలోకించిన సారస్వ గ్రంథంగా పేరుపొందినది. [[పింగళి సూరన]] రచించిన గ్రంథాల గురించి వీరు [[ఆంగ్లం]]లో విపులమైన విమర్శను రచించి దానికి "పింగళి సూరనార్యుని జీవితం, కృతులు" అను ఆంగ్ల నామంతో 1941లో ప్రచురించారు.<ref>[http://www.archive.org/details/pingalisuranarya035059mbp పింగళి సూరనార్య, ఇంటర్నెట్ ఆర్కీవులో లభ్యం.]</ref> దీనిని పిఠాపురం మహారాజా సూర్యారావు బహదూరు వారికి అంకితమిచ్చారు. వీరు "ఆంధ్ర పదములు - పాటలు" మరియు "ఆంధ్ర నాటకాలు - రంగ స్థలాలు" అనే గ్రంథాల్ని కూడా రచించారు.