బండి గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బంగోరె''' అనే పేరుతో ప్రసిద్ధుడైన '''బండి గోపాలరెడ్డి''' (1938-1982) గొప్ప [[సాహిత్యం|సాహిత్య]] పరిశోధకుడు, విమర్శకుడు. [[శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా]]లో సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన బంగోరె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.కాం ఆనర్స్ వరకూ చదువుకున్నా ఆసక్తి, కృషి మాత్రం సాహిత్యం, పరిశోధన రంగాల్లోనే సాగింది. కొద్దికాలం పాటు వివిధ వృత్తులు చేపట్టినా ప్రధానంగా పాత్రికేయునిగా, పరిశోధకునిగా జీవించాడు. నెల్లూరు స్థానిక చరిత్రతో ప్రారంభమైన కృషి విస్తరిస్తూ వేమన, సి.పి.బ్రౌన్‌, గురజాడ వంటి పలువురి సాహిత్యం, జీవితాలపై లోతైన పరిశోధనలతో తెలుగు సాహిత్య పరిశోధన రంగంలో సంచలనం సృష్టించాడు. ఆ క్రమంలో బ్రౌన్ సాహిత్య కృషిపైన, వేమనపై, వేమన గురించి 20వ శతాబ్ది తొలినాళ్ళలో సాహిత్య కృషికి ప్రోత్సహించిన సి.ఆర్.రెడ్డి, సాగించిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటివారి గురించి, గురజాడ జీవితం, సాహిత్యాల గురించి, వీరేశలింగం గురించి, అజ్ఞాత చరిత్రకారులు, జర్నలిస్టుల గురించి - ఇలా ఎన్నెన్నో అంశాల గురించి పరిశోధనలు, ప్రచురణలు చేశారు. గురజాడ అప్పారావు [[కన్యాశుల్కం (మొదటి కూర్పు)|కన్యాశుల్కం మొదటి కూర్పు]], బ్రౌన్ ప్రచురించిన తాతాచార్ల కథలు, సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు, వ్యాసాలు, డాక్టర్ జె.మంగమ్మ బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా వంటివెన్నో వెలికితీసి, పరిష్కరించి, నోట్స్ రాసి పలు హోదాల్లో ప్రచురించాడు. స్వయంగా సి.పి.బ్రౌన్ జర్నలిజం చరిత్ర, సి.పి.బ్రౌన్ సాహిత్య స్వీయచరిత్ర, బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు, మాలపల్లి నవలపై ప్రభుత్వ నిషేధాలు వంటి పలు అంశాలపై గ్రంథాలు రాశారు. బంగోరె పరిశోధనల్లో వెలికివచ్చిన అంశాల్లో గురజాడ అప్పారావు జన్మదినం, బ్రిటీష్ ప్రభుత్వంపై తిరగబడ్డ నెల్లూరు అజ్ఞాత స్వాతంత్ర్య యోధుడు వంటివి ఉన్నాయి. జమీన్ రైతు పత్రిక సహాయ సంపాదకునిగా 1964 నుంచి 1971 వరకు, ఆపైన ఏడాది పాటు మద్రాసు (నేటి చెన్నై)లో అమెరికన్ రిపోర్టరులో పాత్రికేయునిగా, 1975 నుంచి 1979 వరకూ తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు రీసెర్చి అధికారిగా, 1980 నుంచి ఏడాది పాటు ప్రభుత్వం వేమనపై ఏర్పరిచన పరిశోధన ప్రాజెక్టులో, ఆపైన 1982 వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి గురించి ఏర్పరిచిన ప్రాజెక్టులో పనిచేశాడు. 1975 - 1982 మధ్యకాలంలో పలు అకడమిక్ రీసెర్చి ప్రాజెక్టుల్లో పనిచేస్తూ, తన పరిశోధన సంతృప్తికరంగా ముగియకుండానే వాటి కాలం చెల్లిపోతూ, అస్థిరమైన పరిస్థితుల్లో జీవించడం, పరిశోధన ప్రాజెక్టుల్లో పరిస్థితులు వంటికారణాలతో జీవితేచ్ఛ కోల్పోయాడు. ఎవరికీ చెప్పకుండా నెల్లూరు విడిచిపెట్టి ఢిల్లీ, హరిద్వార్, హృషీకేశ్ వంటి ప్రాంతాలు తిరిగి, అశాంతితో 1982 అక్టోబర్ 31న 44 సంవత్సరాల ప్రాయంలో భాక్రానంగల్ ప్రాజెక్టుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బంగోరె చేసిన పరిశోధన కృషి ఎంతో ఉన్నా రాసుకున్న నోట్సులోంచి విస్తరించి చేయాల్సిన పరిశోధనలు, పరిష్కరించి చేయాల్సిన ప్రచురణలు మరణానంతరం మిగిలిపోయే ఉన్నాయి.
 
==జీవితం==
==జీవిత సంగ్రహం==
=== విద్యాభ్యాసం, తొలినాళ్ళు (1938-1964) ===
బంగోరె జననం 1938 అక్టోబర్ 12.. మరణం 1982 అక్టోబర్ 31. నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతరం [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో యం కాం ఆనర్స్ చదివాడు. 1960లో కొద్దికాలం స్రవంతి పత్రికలో, తర్వాత మరి కొన్ని నెలలు ఆంధ్రజ్యోతి దినపత్రిక, విజయవాడలో ఉద్యోగం చేసి, కడప కో ఆపరేటివ్ బ్యాక్ లో సెక్రటరీగా పని చేసాడు. 1964లో నెల్లూరు [[జమీన్ రైతు]] వార పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. జమీన్ రైతు పత్రికలో వారం వారం "కూనిరాగాలు" శీర్హిక నిర్వహించి నెల్లూరు జిల్లా ప్రజాబాహుళ్యంలో విశేషమైన కిర్తి పొందాడు. ఈ శీర్షికను "లోకలిస్ట్ " కలంపేరుతో నిర్వహించాడు. ఈ పత్రికలో బంగోరె, బండి గోపాలరెడ్డి పేర్లతో కూడా వ్యాసాలు రాసేవాడు. స్థానిక చరిత్ర పైన పరిశోధించి వందల వ్యాసాలు రాసాడు. నెల్లూరు వీధుల చరిత్ర, పాతకాలం సత్రాలు, పాథశాలలు, మిషనరీ సంస్థల చరిత్ర ఇట్లా అనేక విషయాలమీద రాసాడు. పుస్తకాలమీద, సినిమాల మీద, నెల్లూరు గోప్పవారిమీద రాసాడు. నేలనూతల శ్రీకృష్ణమూర్తి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం కూడా ఇతని రచనా వ్యాసంగానికి ప్రోత్శాహం కలిగించింది. స్థానిక చరిత్ర రచనకు ఒంగోలు వెంకటరంగయ్య గారి "కొందరు నెల్లూరు గొప్పవారు" వ్యాసాలు దారి చూపాయి.
బంగోరె జననం 1938 అక్టోబర్ 12.. మరణం 1982 అక్టోబర్ 31. నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతరం [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో యం కాం ఆనర్స్ చదివాడు. 1960లో కొద్దికాలం స్రవంతి పత్రికలో, తర్వాత మరి కొన్ని నెలలు ఆంధ్రజ్యోతి దినపత్రిక, విజయవాడలో ఉద్యోగం చేసి, కడప కో ఆపరేటివ్ బ్యాక్ లో సెక్రటరీగా పని చేసాడు.
=== జమీన్ రైతు ఉద్యోగం, పరిశోధనలు (1964-1971) ===
బంగోరె జననం 1938 అక్టోబర్ 12.. మరణం 1982 అక్టోబర్ 31. నెల్లూరు వి. ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతరం [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో యం కాం ఆనర్స్ చదివాడు. 1960లో కొద్దికాలం స్రవంతి పత్రికలో, తర్వాత మరి కొన్ని నెలలు ఆంధ్రజ్యోతి దినపత్రిక, విజయవాడలో ఉద్యోగం చేసి, కడప కో ఆపరేటివ్ బ్యాక్ లో సెక్రటరీగా పని చేసాడు. 1964లో నెల్లూరు [[జమీన్ రైతు]] వార పత్రికలో సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. జమీన్ రైతు పత్రికలో వారం వారం "కూనిరాగాలు" శీర్హిక నిర్వహించి నెల్లూరు జిల్లా ప్రజాబాహుళ్యంలో విశేషమైన కిర్తి పొందాడు. ఈ శీర్షికను "లోకలిస్ట్ " కలంపేరుతో నిర్వహించాడు. ఈ పత్రికలో బంగోరె, బండి గోపాలరెడ్డి పేర్లతో కూడా వ్యాసాలు రాసేవాడు. స్థానిక చరిత్ర పైన పరిశోధించి వందల వ్యాసాలు రాసాడు. నెల్లూరు వీధుల చరిత్ర, పాతకాలం సత్రాలు, పాథశాలలు, మిషనరీ సంస్థల చరిత్ర ఇట్లా అనేక విషయాలమీద రాసాడు. పుస్తకాలమీద, సినిమాల మీద, నెల్లూరు గోప్పవారిమీద రాసాడు. నేలనూతల శ్రీకృష్ణమూర్తి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం కూడా ఇతని రచనా వ్యాసంగానికి ప్రోత్శాహం కలిగించింది. స్థానిక చరిత్ర రచనకు ఒంగోలు వెంకటరంగయ్య గారి "కొందరు నెల్లూరు గొప్పవారు" వ్యాసాలు దారి చూపాయి.
 
1967 ప్రాంతంలో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయానికి కార్యదర్శి అయ్యాడు. ఈ సమాజం ప్రతి సంవత్సరం కవిపండితుల జయంతులు జరుపుతుంది. ఆవిధంగా ఎందరో ప్రసిద్ధవ్యక్తుల పరిచయం, స్నేహం లభించింది. కావలి కళాశాల అద్యాపకులు కే.వి. ఆర్ స్నేహం తనపయి గొప్ప ప్రభావం కలిగించింది. 1969 మార్చి నెలలో [[గురజాడ అప్పారావు]] గారి మొదటి కన్యాశుల్కం ప్రతి సంపాదించి, దానికి నోట్సు రాసి, ఆరుద్ర ఉపోద్ఘాతంతో ప్రచురించాడు. ఈ పుస్తకం పరిశోధకుడుగా ఆయనకు అజరామరమయిన కీర్తి తెచ్చిపెట్టింది.ఇందులో గురజాడవారి జన్మదినాన్ని నిర్దుష్టంగా నిరూపించాడు.
Line 10 ⟶ 13:
శ్రీ నేలనూతల శ్రీకృష్ణమూర్తి 1962-64 కాలంలో విక్రమ సింహపురి మండల సర్వస్వం గ్రంథాన్ని సంపాదకులుగా వెలువరించడానికి కృషిచేస్తున్నారు. ఇందులో బంగోరె స్థానిక చరిత్ర మీద అనేక వ్యాసాలు రాయడమే కాక, ఈ గ్రంధ సహాయ సంపాదకుడుగా పనిచేసాడు. "Speeches and essays of C.R. Reddy" చిన్న పుస్తకాన్ని తయారుచేసాడు, నెల్లూరు వర్ధమాన సమాజం దీన్నీ ప్రచురించింది.1970)
 
=== అమెరికన్ రిపోర్టరులో ఉద్యోగం, నెల్లూరు తిరిగిరాక (1971-1975) ===
1971చివర వరకు జమీన్ రైతు లో పనిచేసి, మద్రాసులో USISలో బి.యస్.ఆర్. కృష్ణ సంపాదకత్వంలో వెలువడుతున్న American Reporter పత్రిక లో పనిచేశాడు. ఆ ఉద్యోగం ఒక ఏడాది మించి సాగలేదు.ఈ సమయంలోనే మద్రాసు GOMLలో పరిశోధించి "సి.పి. బ్రౌన్ జర్నలిజం చరిత్ర 1831-1857" పుస్తకాన్ని రాసి Nellore Historical Society పక్షాన అచ్చువేశాడు.1974లో మద్రాసు నుంచి వెనక్కి వచ్చి, నెల్లూరు వారపత్రిక యూత్ కాంగ్రెస్ లో సంపాదకుడుగా చేరి ఒక యాడాది పని చేసాడు. ఈ సమయంలోనే డాక్టర్ జే.మంగమ్మ పుస్తకం " బుక్ ప్రింటింగ్ ఇన్ ఇండియా" ను ప్రచురించాడు.
 
=== శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సి.పి.బ్రౌన్ ప్రాజెక్టు అధికారిగా (1975-1979) ===
బండి గోపాలరెడ్డి 1975 లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో తెలుగుశాఖలో C.P.Brown Project లో రీసెర్చ్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు.
 
ఈ కృషిలో భాగంగానే "బ్రౌన్ జాబులు, ఆధునికాంధ్ర సాహిత్య శకలాలు " పుస్తకం వెలుగు చూచింది(1977 ఫిబ్రవరి). దీనికి ప్రొఫెసర్ జి.యన్. రెడ్డి ప్రధాన సంపాదకుడుగా, బంగోరె సంపాదకుడుగా వ్యవహరించారు వీరిద్దరు కలిసి " Literary auto biography of C.P.Brown" ను యస్.వి. విశ్వవిద్యాలయం పక్షాన 1978లో తెచ్చారు. 1977లో ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే 'ఆంద్ర గీర్వాణ ఛందము"ను వెలువరించాడు.ఈ పరిశోధన లోంచే "బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు: కడప జాబుల సంకలనం" కూడా తయారుచేసి, అచ్చువేసాడు. మద్రాసు ఆర్కైవ్స్ లో పరిశోధించి, "మాలపల్లి నవలఫై ప్రభుత్వనిషేధాలు"పుస్తకం తెచ్చాడు(1979). ఇది తన సొంత ప్రచురణ. ఈ ప్రాజెక్ట్ కాల పరిమితి ముగియడంతో నెల్లూరు వచ్చేసాడు.

=== వేమన ప్రాజెక్టు, సి.ఆర్.రెడ్డి పరిశోధన ప్రాజెక్టు (1980-1982) ==
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తనకోసం వేమన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ పిలిపించింది. 24-April 1980 లో ఈ కొత్త ఉద్యోగంలో చేరాడు. అప్పటికే బంగోరెలో చాలా అసంతృప్తి, తలపెట్టిన పరిశోధనలు అర్థాంతరంగా ముగిసిపోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుటుంబానికి దూరంగా ఉండడం వంటి అనేక అంశాలు అతనిమీద ప్రభావం చూపి ఉండవచ్చు. ప్రభుత్వశాఖల్లో ఉండే పరాధీనత, బాసిజం ఏవీ అతని ప్రవృత్తికి సరిపడేవి కావు. ఏమయినా తనకున్న పరిమిత అవకాశాల్లో వేమన గురించిన సమస్త విషయాలను సేకరించి ఒక సమగ్ర భండాగారాన్ని భవిష్యత్ పరిశోధకులకోసం ఎర్పాటు చెయ్యాలని పూనుకొన్నాడు. సుడిగాలి పర్యటనలు చేసి బోలెడంత భోగట్టా రాశి పోసాడు. కోర్ట్ స్టే లతో 1981లో ఆ పదవిలో కొన్నాళ్ళు సాగినా , ప్రాజెక్ట్ ముగిసిపోయింది. ఈ నిస్సహాయ పరిస్తితుల్లో ఆంధ్ర విశ్వ విద్యాలయంలో కట్టమంచి రామలింగారెడ్డి మీద ఒక పరిశోధనకు బంగోరె నియమించబడ్డాడు. 1982 అక్టోబర్ లో ఆ ఉద్యోగము ముగిసింది.

=== నెల్లూరు విడిచి వెళ్ళడం, మరణం (1982) ===
అలసిపోయి, నిరాశతో నెల్లూరు చేరాడు.అతనిలో ఘనీభవించిన అసంతృప్తి, జీవితేచ్చ కోల్పోవడం వంటి వైక్లబ్యాలను సన్నిహిత మిత్రులు కూడా గమనించలేదు. ఎవ్వరికీ చెప్పకుండా నెల్లూరు విడిచి, ఢిల్లీ, హరిద్వార్, హ్రిషికేశ్ తదితర ప్రదేశాలు ఒక గమ్యంలేకుండా తిరిగి, చివరకు, భాక్రానంగల్ డాం మీదినుంచి దూకి ప్రాణాలు విడిచిపెట్టాడు. అతని జీవితంలోను, మరణంలోను అన్ని విషాద విస్మయాలే.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/బండి_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు