రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: కథ సంగ్రాహం
→‎కథ: కథ సంగ్రాహం
పంక్తి 23:
 
ఓ రోజు, మల్లమ్మ తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ పాడే పాటను విన్న దొరసాని మల్లమ్మను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం నుండి తన మనవరాలిని కాపాడుకున్న సాంబయ్య దొరసానికి దొరకకుండా ఊరు వదిలి పారిపోవడానికి నిశ్చయించుకొని రైల్వేస్టేషనుకి వెళ్తాడు. మల్లమ్మ రైలు ఎక్కలేదని గ్రహించి తనని వెతుక్కుంటూ వెళ్ళగా, ఓ మూల కూర్చొని ఏడుస్తున్న మల్లమ్మను నిలదీస్తాడు. తమ ఊరిని, అందులోవున్న రాజన్నను వదిలి రాలేనని చెబుతుంది మల్లమ్మ. అప్పుడు మల్లమ్మ రాజన్న కూతురేనని చెబుతాడు సాంబయ్య. ఇంతలో వీరిద్దరి ఆచూకి తెలుసుకున్న దొరసాని సాంబయ్యను హతమార్చి, మల్లమ్మను గుడిసెలో బంధించి దానికి నిప్పు పెట్టిస్తుంది. రాజన్న సమాధిని కూల్చివేస్తుంది. తమ ఊరిలోని సంగీత మాష్టారు కులకర్ణి ([[నాజర్ (నటుడు)|నాజర్]]) సాయంతో మల్లమ్మ తప్పించుకుంటుంది. గుడిసెతో పాటు మల్లమ్మ కూడా కాలిపోయిందనుకొని దొరసాని వెళ్ళిపోతుంది.
 
మరుసటిరోజున, దొరసానికి దొరకకుండా ఊరు వదిలి వెళ్ళిపొమ్మని గ్రామస్థులు తమ దగ్గరున్న ధనమిచ్చి మల్లమ్మను సాగనంపుతారు. వెళ్ళే సమయంలో తన తల్లిదండ్రుల సమాధి నుండి మట్టిని తీసుకొని బయలుదేరుతుంది మల్లమ్మ. దొరసాని నుండి తమ ఊరిని విడిపించగల అధికారం భారత ప్రధాని [[జవహర్‌లాల్ నెహ్రూ]] కి మాత్రమే ఉందని ఒకసారి కులకర్ణి చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని ఢిల్లీకి బయలుదేరుతుంది మల్లమ్మ. దారిలో ఓ దొంగ మల్లమ్మ దగ్గరున్న డబ్బుని కాజేయడంతో కాలినడకనే ఢిల్లీకి పయనమవుతుంది. దారిలో అనేక ఇబ్బందులు ఎదురుకొని చివరకు ఢిల్లీ చేరుతుంది. అక్కడ ఓ తెలుగు దంపతులు మల్లమ్మను చేరదీస్తారు. నెహ్రు ప్రతి నెల ఒకటోతారీఖున ప్రజలను కలుస్తారని తెలుసుకొని, వారింట్లోనే ఉండి పని చేసుకుంటూ ఒకటోతారీఖు రాగానే నెహ్రుని కలవడానికి వెళ్తుంది మల్లమ్మ. కానీ జనం మధ్య తొక్కిసలాటలో కలవలేకపోతుంది. తరువాత మల్లమ్మను గమనించిన నెహ్రు సన్నిహితుడు శ్యామశాస్త్రి ([[విజయకుమార్ (నటుడు)|విజయకుమార్]]) నెహ్రు పుట్టినరోజున జరిగే పాటల పోటిలో మల్లమ్మ చేత పాడించే ఏర్పాటు చేస్తాడు.
 
==నటినటులు==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు