అద్దంకి గురించి ఈ పేజీ లో అన్ని వివరాలు చక్కగా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక కేటుగాడు కూడా ఉన్నాడు.
వీడు మహా నగరం లో మాయగాడు, ఈ కేటు గాడు పేరు కోటి (కోటేశ్వర రావు మనం), పేరు లో కోటి ఉందని కోట్లు సంపాదించాలని పథకం వేసాడు. తన స్నేహితులను, తెలిసినవాళ్ళను ఇరుగుపొరుగు వారిని డబ్బు ఆశ చూపించి, ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి అందరిదగ్గర డబ్బు వసూల్ చేసి తాను చేస్తున్న షేర్ మార్కెటింగ్ వ్యాపారం లో పెట్టుబడులు పెట్టాడు. మొదట్లో అందరికి చెప్పినట్లు గానే డబ్బు బాగానే ఇచ్చాడు ఆలా కొన్నినెలలు గడిచేసరికి అందరూ కోటి ని బాగా నమ్మారు, పెట్ట్టుబడి పెట్టినవారి సంఖ్య బాగా పెరిగింది, కోటి ప్రధానం గా మదతరగతి, చిన్న వ్యాపారస్తులను, చిరు ఉద్యోగులను లక్ష్యం గా పెట్టుకున్నాడు, తాను అనుకున్న పథకం ప్రకారం ఒకరోజు అకస్మాత్తుగా ఉన్నడబ్బు తో అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఇదంతా ఎక్కడ జరిగింది అంటే హైద్రాబాద్ కూకట్పల్లి హోసింగ్ బోర్డు లో , ఇదంతా జరిగి ఒక సవంత్సరం దాటిపోయింది, బాధితులు పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పారిపోయిన వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు, పట్టుకుని పారిపోయిన డబ్బు 50 కోట్ల పైనే ఉంటుంది అని పోలీసుల అంచనా. ఇంతజరిగిన ఈ విషయం చాల మంది కి తెలియదు మోసపోయిన వాళ్ళకి తప్ప. అందుకే ఈ విషయం అద్దంకి, అద్దంకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి తెలియాలని ఇక్కడ రాస్తున్న. కోటి వివరాలు మీకు గాని తెలిస్తే దయచేసి కూకట్పల్లి పోలీసులకి తెలియచేయండి, ఈ విధంగా ఇంకెవరు మోసపోకుండా రక్షించండి, ఇలాంటి వాళ్ళు జనం లో ఉండకూడదు. కోటి కి ఖచ్చితం గా శిక్ష పడాలి. కోటి వివరాలు క్రింద ఉన్న యూట్యూబ్ లింక్ లో ఉన్నాయి చుడండి.