అత్తగారు కొత్తకోడలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
ఈ చిత్రానికి కథ- పినిశెట్టి, కథా సంవిధానం- మాటలు ఆచార్య ఆత్రేయ, ఎడిటింగ్- జగదీష్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ- కె.యస్.ప్రసాద్, కళ- సూరన్న, నృత్యం- తంగప్ప, స్టంట్స్- రాఘవులు, సంగీతం- జి.కె.వెంకటేష్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎ.సంజీవి, నిర్మాత- బాబూరావు.
==నటీనటులు==
ఇంకా ఈ చిత్రంలో రాజ్‌బాబు తండ్రి ఎక్స్‌మిలటరీ సుబేదారు నరసింహంగా రావికొండలరావు, అతని నౌకరు చెంగయ్యగా ఆనందమోసన్ నటించారు.
 
==కథ==
సూరమ్మ (సూర్యకాంతం) ఒక వూరిలోని ఆస్తిపరురాలు. వడ్డీవ్యాపారం చేస్తూ పేదవాళ్ళను పీడిస్తూ ఉంటుంది. సవతి కొడుకు సత్యం (సత్యనారాయణ), కోడలు పుష్పకుమారిని ఆరళ్ళుపెడుతూ ఉంటుంది. కట్నం డబ్బు 10వేలు ఇవ్వకుండా కూతురు ధనలక్ష్మి(రమాప్రభ)ను అత్తగారింటికి పంపక, తనవద్దే వుంచుకుంటుంది. ఆమె మాట ప్రకారం ధనలక్ష్మి అందరి విషయాలు, తల్లికి చాడీలు చెబుతుంటుంది. ఆమె ఇద్దరు కొడుకులు మధు(హరనాథ్), గోపి(కృష్ణ) తల్లిని ఎదిరించలేక అవస్థలు పడుతుంటారు. మధు, పట్నంలో లక్షాధికారి నాగభూషణం కూతురు లత (జయంతి) ప్రేమించుకుంటారు. ఆ ప్రేమకు పెళ్ళికి తండ్రి అంగీకరించక పోవటంతో, స్నేహితురాలు రాధ (విజయనిర్మల), ఆమె తండ్రి కోటయ్య సాయంతో రిజిస్టర్ మ్యారేజి చేసుకుంటారు. భార్యతో పల్లెటూరు వచ్చిన మధు, అంతకుముందే తల్లి, మేనమామ నాగన్న (సాక్షి రంగారావు) కుట్రవలన దొంగతనం నేరంమీద సత్యం దంపతులు ఇల్లువదిలి వెళ్ళారని తెలుసుకుంటాడు. మధు కోరినా, సత్యం తిరిగి ఇంటికి రాక, పొలం వద్దనే పాకలో వుంటాడు. మధు పొలం పనులు చేయటం, లతకు ఆస్తిరాదని తెలిసిన రాధమ్మ ఆమెను అనేక ఆరళ్ళు పెట్టడంతో గర్భవతి ఐన, లతకు అబార్షన్ అవుతుంది. దాంతో మధు, లత తిరిగి పట్నం వెళ్ళిపోతారు. రాధ, గోపితో కలిసి, ఆస్తికల దైవ భక్తురాలిగా నాటకం ఆడి, సూరమ్మ చేత ఒప్పించి, గోపిని పెళ్ళాడి, కోడలుగా ఆ ఇంటికి వచ్చి, ధనలక్ష్మిని, ఆమె భర్త గిరిబాబు (రాజ్‌బాబు)తో పంపించి వేసి, ఆమె మరణించిందని, ఉత్తరం చూపి, దాని ద్వారా అత్తగారిని భయపెట్టి, లతను ఆమె పెట్టిన కష్టాలుపెట్టి ఇంటెడు చాకిరీ చేయిస్తుంది. నాగన్న అత్తగారిని మోసంచేసి ఆస్తి రాయించుకొని, అమ్మబోగా అన్నదమ్ములు ముగ్గురూ కలిసి దాన్ని అడ్డుకోవటం, సూరమ్మకు జ్ఞానోదయం కలిగి కోడళ్ళను ఆదరించటంతో చిత్రం ముగుస్తుంది.