శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం): కూర్పుల మధ్య తేడాలు

మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 44:
==దేవాలయ నిర్మాణ విశేషాలు==
17 వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు [[శ్రీరామదాసు]]గా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17 వ శతాబ్దం రెండవ భాగంలో [[కంచర్ల గోపన్న]] [[భద్రాచలం]] తహశీల్దార్ గా ఉన్నపుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండ లోని ఒక చెరసాలలో ఈయనను బంధించారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన [[శ్రీరాముడు]] చెరసాల నుండి విడిపించేందుకు [[గోల్కొండ]] సంస్థానాదీశుడైన [[సుల్తాన్]] కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక [[సంకీర్తన]]లను రచించాడు. అప్పటి నుండి గోపన్నను [[రామదాసు]] అని పిలుస్తుండేవారు. భద్రాచలం మరియు [[విజయనగరం]] ప్రాంతాలకు [[రామాయణం]]తో దగ్గర సంబంధమున్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో [[రాముడు]], [[సీత]] మరియు [[లక్ష్మణుడు]] కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడింది. [[గోదావరి నది]] ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం మరియు మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రిరాముడు అయినాడు. ఈ [[భద్రగిరి]]పై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్ కు కూడా ఈ [[ఆలయం]]<nowiki/>తో దగ్గర సంబంధమున్నది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నపుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయినాయి అని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. పవిత్రమైన [[గోదావరి నది]] ఈ కొండను చుట్టుకొని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరుపర్వతం మరియు మేనక లకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్ర పర్వతం. ఈ భద్రుడి (చిన్నకొండ) వలనే ఈ చిన్నకొండను భద్రగిరి అని ఇక్కడ ఏర్పడిన ఊరికి [[భద్రాచలం]] అని పేరు వచ్చింది.
 
[[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] 7 వ నిజాం ఈ ఆలయానికి సంవత్సరానికి రూ .82,000 విరాళంగా ఇచ్చింది.<ref>https://archive.siasat.com/news/nizam-hyderabad-mir-osman-ali-khan-was-perfect-secular-ruler-812716/</ref>
 
 
==దేవాలయ ప్రత్యేకతలు==