రాజనందిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==కథ==
తిరుమల నాయకుడు (రాజనాల), రామరాజు (గుమ్మడి), ఇరుగుపొరుగు రాజ్యాల ప్రభువులు, రామరాజు కుమారుడు జగచంద్రుడు (ఎన్.టి.రామారావు) తిరుమల నాయకుని కుమార్తె శ్రీదేవి (గిరిజ) ఆమె తల్లి మరణించగా, సదానందస్వామి (కె.వి.ఎస్.శర్మ) కుమార్తె విమల (జి.వరలక్ష్మి) పసిప్రాయంనుంచి శ్రీదేవిని కోటలో పెంచి పెద్దచేస్తుంది. తిరుమల నాయకుని రాజ్యంలో, భూపతి (మహంకాళి వెంకయ్య) అదే దోపిడి దొంగ, మహారాజు ప్రాపకంతో విరివిగా దోపిడీలు సాగిస్తూ మహారాజుకు కొంత సమర్పిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. రామరాజు రాజ్యంలోప్రజలు ఈ దోపిడీలవల్ల పలు బాధలుపడడం చూసిన యువరాజు, తండ్రి అనుమతితో రెండు రాజ్యాల మధ్య స్నేహం కుదురుస్తానని బయలుదేరతాడు. దేవీ ఆలయంలో అతన్ని చూసి యువరాణి ముచ్చటపడి, కోటలోకి ఆహ్వానిస్తుంది. ఒక వీధి నృత్యం చేస్తున్న భూపతి కుమార్తె రమణి (అంజలిదేవీ) జయచంద్రుని చూసి ప్రేమించి, అతన్ని పొందాలని తన బావ కిరీటి (ఆర్.నాగేశ్వరరావు) దండుతో కలిసి, జయచంద్రుడు వెళ్ళిన సొరంగ మార్గం ద్వారా కోటలో ప్రవేశించి, తిరుమల నాయకుని బంధించి, గాయపడిన జయచంద్రుని తన మందిరంలో చేరుస్తుంది. అతనికి తన ప్రేమను తెలియచేస్తుంది. కాని, జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరించడు. తిరుమల నాయకుని విడిపించాలని, సదానందస్వామి తన శిష్యుడు గజపతి (రేలంగి)సాయంతో పథకం వేసి కోటలో ప్రవేశించినా, భూపతి వారినెదుర్కొని మహారాజును వధిస్తాడు. దాంతో పగబట్టిన విమల భూపతిని ప్రేమించినట్లు నటించి, ఓ నృత్యంలో అతన్ని అంతంచేస్తుంది. విమల ద్వారా కారణం గ్రహించిన రమణి, ఆమెను క్షమించి, బందీగావున్న శ్రీదేవిని విడిపించి ఆమెకు రాజ్యాన్ని అప్పగిస్తుంది. రమణి త్యాగబుద్ధి మెచ్చిన జయచంద్రుడు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. ఇది సహించలేని శ్రీదేవి, రమణిని, చంపబోయి, విమలను హత్యచేస్తుంది. రమణితో కలిసి తమ రాజ్యానికి వెళ్ళిన జయచంద్రుని తల్లి ఆదరిస్తుంది. కోపంతో శ్రీదేవి, రమణి, విమలను చంపి జయచంద్రుని పారిపోయి వచ్చిందని లేఖను పంపిస్తుంది. దాంతో మహారాజు కోపంతో రమణిని వెళ్ళగొడతాడు. జయచంద్రుడు ఆమెకోసం వెళ్ళటం, రమణిని చేజిక్కించుకున్న కిరీటితో పోరాడగా, ఆ పోరులో కిరీటి అంతంఅవుతాడు. రమణిని చంపాలని ప్రయత్నించిన శ్రీదేవి ఓ కొండ రాయి క్రిందపడి మరణిస్తుంది. నిజం తెలిసిన మహారాజు తన బలగంతో వచ్చి, రమణిని క్షమాపణకోరి, ఆమెను రాజనందినిగా ఆశీర్వదించి, తన కుమారునితో వివాహ నిశ్చయం చేయటంతో చిత్రం సుఖాంతమవుతుంది.
 
సాటి రాజుల మైత్రిని పాటించక, అహంకారంతో, వ్యవహరించి, దోపిడీదారులతో చేతులు కలిపితే కలిగే పర్యవసానం, మంచి ఆలోచన, వివేకం లేని యువరాణి, మంచి బుద్ధికల యువతి రమణి, నిజాయితీ, నిస్వార్థబుద్ధికల యువరాజు వీరిమధ్య సాగిన ఈ అర్ధవంతమైన కథను దర్శకులు వేదాంతం రాఘవయ్య చక్కని సన్నివేశాలతో తీర్చిదిద్దారు. గురువు సదానందులవారు మహారాజును రక్షించ యత్నించటం, వెంటనే భూపతి దారుణంగా మహారాజును వధించటం. దానికి ప్రతీకారంగా విమలమ్మ నృత్యంతో భూపతిని ఆకర్షించి, ఆ నృత్యంలోనే అతన్ని చంపటం రాకుమారిని చంపుతానని రమణి, ఆమెకు సింహాసనమప్పగించటం. చిత్రం చివర రమణి మీద, విమలమ్మ హత్యానేరం ఆరోపించబడగా యువరాజు దానిని ఖండించటం, యువరాజును బంధించమని మహారాజు ఆజ్ఞకు ప్రతిగా మహారాణి అతన్ని వదలమని ఆజ్ఞ. ఇక చివర కిరీటికి, జయచంద్రునికి మధ్య యుద్ధం పలురకాలుగా ఆకట్టుకునేలా, స్టంట్ డైరెక్టర్ సాయంతో చిత్రీకరించటం, తన వంచనకు యువరాణి, కొండ పడి తానే మరణించటం. పాటల చిత్రీకరణలోనూ ఓ ప్రత్యేకత చూపారు. చిన్న సితారను చేత్తో మీటుతూ అంజలిదేవి, తన మందిరంలో ఎన్.టి.ఆర్.నుద్దేశించి పాడే గీతం ‘‘కథ నాకు తెలుసోయి అందాల నెల బాలుడా’(గానం- పి.సుశీల) మరో గీతం వీరిరువురిపైనా తోటలో చక్కని పూల సెట్టింగ్స్, ఆకసంలో వెనె్నల చంద్రుడు తోడుగా సాగటం హాయినిస్తుంది. అందాలు చిందు సీమలో ఉందాములే హాయిగా (ఎ.ఎం.రాజా, జిక్కి) అలరించేలా సాగాయి.
హీరో జయచంద్రునిగా ఎన్.టి.రామారావు, తన యుక్తమైన నటనతో, చక్కని చిరునవ్వులతో, చివర వీరోచిత పోరాటంలో తొలుత సైనికులతో పోరాటంలో తనదైనశైలితో మెప్పించారు.
రమణిగా అంజలిదేవి దుడుకుతనం, చురుకు తండ్రివద్ద గారాబం, బావ కిరీటిని అదిలించటం, ప్రేమించిన యువరాజు సిద్ధాంతాలపట్ల మక్కువతో తన దారిని మార్చుకోవటం, యువరాణి శ్రీదేవిగా గిరిజ ఎంతో విద్యావంతురాలు, పరాక్రమవంతురాలని పేరుపొందినా, రమణి పట్ల ఈర్ష్య, కోపంతో తననుతాను నిగ్రహించుకోలేకపోవటం పాత్రోచితంగా నటించింది. విమలమ్మగా జి.వరలక్ష్మి నటన ప్రత్యేకంగా నిలవటం ఈ చిత్రంలో విశేషాంశం. ఆర్.నాగేశ్వరరావు ఆ పాత్రకుతగ్గ విలనీని సునాయాసంగా ప్రదర్శించారు. భూపతిగా మహంకాళి వెంకయ్యకు ఇదొక వెరైటీ పాత్ర. దాన్ని వారు పరిపూర్ణంగా ఆవిష్కరించటం మెచ్చదగిన అంశం.
మల్లాది రామకృష్ణశాస్ర్తీ రచనతో, టి.వి.రాజు సంగీతంలో అలరించిన ఈ చిత్ర గీతాలు, మరికొన్ని గిరిజపై చిత్రీకరించిన గీతం ‘నీమీద మనసాయేరా’ (పి.సుశీల) జి.వరలక్ష్మిపై గీతం ‘రంగేళి రౌతంటే నీవేరా’ (పి.సుశీల బృందం) కె.వి.ఎస్.శర్మ బృందంపై శివస్తుతి ‘హరహర పురహరశంభో’ (ఎం.ఎస్.రామారావు బృందం) రేలంగి బృందంపై ‘శ్రీగిరి లింగశివ గురులింగ’, ‘సిక్కేవులేరా సక్కని రాజా’(జిక్కి, వేదాంతం రాఘవయ్య ఆర్.నాగేశ్వరరావు మాటలు ‘తస్సర రవల’వంటివి పలకటం విశేషం) అంజలిదేవి, ఎన్.టి.ఆర్‌ను కవ్విస్తు పాడే మరో గీతం ‘కొమ్మ మీద కోయిలుంది రాసిన ఓడా’(జిక్కి) చక్కిలిగింతల చల్లని గాలి, సంపెంగ గుబాయింపులతో హాయిగా సాగుతుంది.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/రాజనందిని" నుండి వెలికితీశారు