సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== జాతీయ నేతగా ==
[[Https://en.wikipedia.org/wiki/Barrister|బారిష్టరు]] పట్టా పుచ్చుకొని [[ఇంగ్లాండు]] నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జరుగుతున్న [[భారత జాతీయోద్యమం]] ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. [[1928]]లో [[బార్డోలీ]]లో [[బ్రిటీష్ ఇండియా]] ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి [[సర్దార్]] అనే పేరు వచ్చింది.
[[Image:Gandhi, Patel and Maulana Azad Sept 1940.jpg|thumb|1940, బాంబే, ఏ.ఐ.సి.సి. మీటింగులో గాంధీ, మౌలానా ఆజాద్ లతో పటేల్.]]
గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల [[విరాళాలు]] సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. [[గుజరాత్‌]]లో [[మద్యపానం]], [[అస్పృశ్యత]], కులవిచక్షణలకు వ్యతిరేకంగా పనిచేసారు.
పంక్తి 56:
== మరణం ==
[[1950]] [[డిసెంబరు 15]] న వల్లబ్ భాయి పటేల్ కన్నుమూశాడు. [[ముంబాయి]]లో పెద్ద ఎత్తున ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా ప్రజలు, స్వాతంత్ర్య సమర యోధులు, దేశ విదేశీ రాజకీయ నాయకులు, నివాళులర్పించారు. అతను ప్రస్తుతం మన మధ్య లేకున్ననూ అతని ఘనకార్యాలు, చేపట్టిన చర్యలు ఏ నాటికీ మరువలేనివి.
 
== ఎకత్వ చిహ్నము ==
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్టోబర్ 31న ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఎకత్వ చిహ్నము) అని పిలుస్తున్నారు.గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది.
 
ఈ విగ్రహన్ని, భారత ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మొదీ గారు, 31 అక్టొబరు 2018 న అత్యంత ఘనం గా ఆవిష్కరించారు. <ref>{{Cite news|title=https://www.bbc.com/telugu/india-46030782|date=31-Oct-2018}}</ref>
 
== బిరుదులు ==
[[1991]]లో [[భారత ప్రభుత్వం]] వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి [[భారత రత్న]] బిరుదును మరణానంతరం ప్రకటించించింది.