గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[పంచాయతీ|పంచాయతీ రాజ్]] లో గ్రామ స్థాయి పరిపాలనా వ్యవస్థ '''గ్రామ పంచాయతీ''' <ref>[http://www.apard.gov.in/grampanchayat-handbook.pdf గ్రామ పంచాయతి కరదీపిక]</ref><ref>[http://www.apard.gov.in/finalgramapanchayat.pdf గ్రామ పంచాయతి సమాచార దర్శిని]</ref>.పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభాగమే గ్రామ పంచాయితీ. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. ఇది మూడంచెల వ్యవస్థలో మొదటి అంచె. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా 300 మందికి తగ్గకుండా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. స్థానిక స్వపరిపాలన విధానములో ఇదే మొదటి మెట్టు. తర్వాతి మండల పరిషత్, తర్వాతి జిల్లా పరిషత్, పట్టణ స్వపరిపాలన సంస్థలు, పురపాలక సంఘాలు. ▼
'''గ్రామ పంచాయితీ''' గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. దీనినే స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థని, భారతదేశంలో పంచాయతీ రాజ్ అని అంటారు.
== గ్రామ పంచాయితీ చరిత్ర ==
'''గ్రామసభ :''' గ్రామసభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు. ప్రతి పంచాయతీలో గ్రామసభ ఉంటుంది. గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు. ఏటా ఏప్రిల్ 14న, అక్టోబర్ 3న తప్పకుండా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జనవరి 2, జూలై 4న కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. రెండు పర్యాయాలు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు. ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10 శాతం మంది ప్రజలు కోరితే గ్రామసభ సమావేశం నిర్వహించాలి. గ్రామసభకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. ఎన్నికైన వారి పదవీకాలం 5 సంవత్సరాలు. ▼
▲<blockquote>ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబరు 1న, ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా, మహబూబ్ నగర్ జిల్లా, షాద్నగర్ లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ గా ఏర్పడింది. </blockquote>[[File:Muppavaram community hall.jpg|<blockquote>గ్రామ పంచాయతీ సముదాయ భవనం</blockquote>|right|thumb]]<blockquote>[[పంచాయతీ|పంచాయతీ రాజ్]] లో గ్రామ స్థాయి పరిపాలనా వ్యవస్థ '''గ్రామ పంచాయతీ''' <ref>[http://www.apard.gov.in/grampanchayat-handbook.pdf గ్రామ పంచాయతి కరదీపిక]</ref><ref>[http://www.apard.gov.in/finalgramapanchayat.pdf గ్రామ పంచాయతి సమాచార దర్శిని]</ref>.పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభాగమే గ్రామ పంచాయితీ. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. ఇది మూడంచెల వ్యవస్థలో మొదటి అంచె. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా 300 మందికి తగ్గకుండా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. స్థానిక స్వపరిపాలన విధానములో ఇదే మొదటి మెట్టు. తర్వాతి మండల పరిషత్, తర్వాతి జిల్లా పరిషత్, పట్టణ స్వపరిపాలన సంస్థలు, పురపాలక సంఘాలు.</blockquote><blockquote>గ్రామపంచాయతీ నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. 1. గ్రామసభ 2. వార్డు సభ్యులు 3. కోఆప్టెడ్ సభ్యులు 4. శాశ్వత ఆహ్వానితులు 5. సర్పంచ్, ఉప సర్పంచ్ 6. పంచాయతీ కార్యనిర్వహణాధికారి/[[గ్రామ కార్యదర్శి]] 7. [[గ్రామ రెవిన్యూ అధికారి]].</blockquote>
== '''గ్రామ సభ''' ==▼
▲
== '''కోఆప్టెడ్ సభ్యులు
<blockquote>గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు.</blockquote> == '''శాశ్వత ఆహ్వానితులు
<blockquote>మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు.</blockquote> == '''గ్రామ సర్పంచ్''' ==
'''<u>అధికారాలు:</u>''' ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ, గ్రామ పంచాయతి సమావేశాలకు అధ్యక్షత, గ్రామ పంచాయతి నిర్ణయాల అమలు, గ్రామ కార్యనిర్వహణాధికారి/ కార్యదర్శి పని పర్యవేక్షణ, గ్రామాభివృద్ధి అధికారి నుండి కావలసిన సమాచారం సేకరణ, సభ్యుల అనర్హతను, ఖాళీలను [[జిల్లా పరిషత్]] అధికారులకు తెలియచేయుట
== '''గ్రామ ఉప సర్పంచ్''' ==
== '''గ్రామ పంచాయితీ కార్యదర్శి''' ==▼
▲* '''అవిశ్వాస తీర్మానం:''' ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యుల్లో 2/3 వంతు తక్కువ కాకుండా ఆమోదిస్తే ఉపసర్పంచ్ను తొలగి స్తారు. సస్పెండ్ అయిన సభ్యులకు కూడా ఈ సమయంలో ఓటు హక్కు ఉంటుంది.
<blockquote> గ్రామాలే దేశానికి పట్టు కొమ్మలు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా గ్రామంలోని ప్రజల కోసమే రూపొందించబడుతుంది. అయితే గ్రామాభివృద్ధి కోసం రూపొందించిన వ్యూహాలు, పథకాలు ప్రజల దగ్గరకు చేరేందుకు, గ్రామీణ స్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షించేందుకు ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండటం అవసరం.</blockquote><blockquote>గ్రామపంచాయితీ అధిపతిగా, ప్రజలకు బాధ్యునిగా సర్పంచి ఉండినా, ప్రభుత్వ పథకాలు, ఉత్తర్వులు, ఇతర సంబంధిత సమాచారం అందక ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడేవారు. గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో గ్రామ పంచాయితీల పరిపాలనా విధానాల్ని పరిగణనలోకి తీసుకుని ప్రతి గ్రామ పంచాయితీకి ఒక కార్యదర్శి పోస్టును సృష్టించి తేదీ 1.1.2002 నుంచి అమలులోకి తెచ్చింది. (జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్ -2) తేదీ. 9.12.2001)</blockquote>'''<u>పంచాయితీ కార్యదర్శి విధులు - బాధ్యతలు:</u>'''<blockquote>సెక్షను 31 ప్రకారం సర్పంచ్ యొక్క ఆదేశంతోగానీ, లేదా అతడి సూచనతోగానీ కార్యదర్శి, గ్రామపంచాయితీ సమావేశాలను హాజరు పరుస్తూ ఉండాలి. నెలకొక సమావేశం జరిగేటట్లు చూసుకోవాలి. గత సమావేశం జరిగిన నాటి నుంచి తొంబై రోజుల గడువులో సమావేశం ఏర్పాటు చేసేందుకు సర్పంచి ఆమోదం తెలియజేయని పక్షంలో కార్యదర్శి తనంతటతాను మీటింగు ఏర్పాటు చేసుకోవచ్చు.</blockquote>
* గ్రామ పంచాయితీ మీటింగులకు సాధారణంగా కార్యదర్శి హాజరై, చర్చలలో పాల్గొనవచ్చును. కానీ అందులో ఓటు చేయటానికీ, తీర్మానం ప్రవేశపెట్టడానికీ అధికారం లేదు.
* సెక్షను 32 ప్రకారము గ్రామ పంచాయితీ, వాటి కమిటీల తీర్మానాలు అమలుచేయడం కార్యదర్శి బాధ్యత. ఒకవేళ కార్యదర్శి దృష్టిలో ఏదైనా తీర్మానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా పంచాయితీరాజ్ చట్ట పరిధిని దాటి ఉన్నా లేదా ప్రజాభద్రతకు, జీవితానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉన్నా అలాంటి విషయాన్ని కమిషనరుకు తగు ఆదేశాల కోసం లేదా తీర్మానం రద్దు కోసం నివేదిక పంపించాల్సి ఉంటుంది. (సెక్షన్ 246)
* పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీకి చెందిన అందరు అధికారులూ, సిబ్బందిపై నియంత్రణ కలిగి ఉంటాడు.
* సెక్షన్ 268 (2) (15) మరియు జి.ఒ 72, తేదీ 29.2.2000 ప్రకారం పన్నులు, లైసెన్సులు మరియు అనుమతుల విషయంలో సంబంధించిన వ్యక్తుల నుంచి ఏదైనా సమాచారం రాబట్టే అధికారం ఉంది. అవసరమైనప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908 సూచించిన విధంగా సాక్షులను హాజరుపరచి, పరీక్షించే అధికారం కూడా ఉంది. సరైన కారణం లేకుండా ఎవరైనా సెక్షన్లు అతిక్రమిస్తే రూ.100 వరకూ జరిమానా విధించవచ్చు. సమన్లు అందుకున్న తరువాత ఏదైనా కారణంచేత హాజరుకాలేకపోతే కనీసం రెండు లేక మూడు రోజుల ముందుగా కార్యదర్శికి, అధికారికి తెలియజేయాలి.
* నిధులు దుర్వినియోగమైతే సర్పంచితో పాటు కార్యనిర్వహణాధికారి (కార్యదర్శి) కూడా బాధ్యుడు అవుతాడు. (జి.ఒ 53, తేదీ : 4.2.1999)
'''<u>పంచాయితీ కార్యదర్శి ఉద్యోగ విధులు:</u>''' <blockquote>జి.ఓ.ఎం.ఎస్ నెం.4 పంచాయితీ గ్రామ శాఖ (మండల) శాఖ తేదీ : 7.1.2002 ద్వారా పంచాయితీ కార్యదర్శుల కర్తవ్యాలకు సంబంధించిన నియమాలు జారీ చేయబడ్డాయి.పై ఆదేశాల ప్రకారం పంచాయితీ కార్యదర్శి గ్రామపంచాయితీ పరిధిలోనే నివసించాలి. గ్రామపంచాయితీ అధీనంలో పనిచేయాలి. కార్యదర్శి ఇంకా ఈ కింద విధులను, బాధ్యతలను నిర్వర్తించాలి.</blockquote>'''1. గ్రామపంచాయితీ పరిపాలనా విధులు:''' <blockquote>గ్రామ సర్పంచ్ ఆదేశాల మేరకు పంచాయితీని సమావేశ పరచాలి.</blockquote>
* గ్రామపంచాయితీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.
* గ్రామ పంచాయితీ మరియు కమిటీల తీర్మానాలను అమలుచేయాలి.
* ప్రభుత్వ మరియు పంచాయితీ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలి. గ్రామ చావడిలను నిర్వహించాలి.
* ప్రభుత్వ భూములను, భవనాలను ఇతర ఆస్థులు అన్యాక్రాంతం అయినప్పుడు లేదా ఇతరులు దుర్వినియోగం చేసినప్పుడు పైఅధికారులకు తెలియజేయాలి.
* గ్రామపంచాయితీకి అవసరమైన రిజిస్టర్లు నిర్వహించాలి. మరియు పంచాయితీ పన్నులను సక్రమంగా నూటికి నూరుపాళ్లు వసూలు చేయాలి.
2. '''సాధారణ పరిపాలనా పరమైన విధులు:'''<blockquote>ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి. మరియు గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి.</blockquote>
* 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి.
* వివాహ ధృవీకరణ పత్రం, నివాసం, ఆస్థి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్ (పహాణీ) జారీ చేయాలి.
* కుల ధృవీకరణ, ఆదాయం, సాల్వెన్సీ సర్టిపికెట్లు ఇచ్చేసమయంలో ప్రాథమిక రిపోర్టు సమర్పించాలి.
* ఏదైనా సర్టిఫికెట్టుకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి.
* గ్రామంలో పారిశుధ్యాన్ని నిర్వహించాలి. రోజూ విధులు తనిఖీ చేసి, కనుగొన్న లోపాలను సిబ్బందితో సరిచేయించాలి.
* గ్రామపంచాయితీ తన కర్తవ్యాలను నిర్వహించడంలో పూర్తి సహకారమందించాలి.
* అగ్ని ప్రమాదాలు, వరదలు, తుపానులు, ఇతర ప్రమాదాలలో ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలి.
* ఎపి ట్రాన్స్కో గ్రామస్థాయిలో నిర్వహించే కార్యకలాపాలకు సహకరించాలి.
* అధీకృత ప్రకటన ద్వారా కనీసవేతన చట్టం 1948 ప్రకారం గ్రామపంచాయితీ సెక్రెటరీ ఇన్స్పెక్టరు హోదాలో కనీసవేతనాల అమలుకు చర్యలు తీసుకోవాలి.
* జనన మరణాల రిజిష్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి. దీనికోసం రెండు రిజిష్టర్లు మెడికల్ డిపార్టుమెంట్ నుంచి పొంది, నెలవారీ నివేదికలు డి.ఎం.హెచ్.ఓ.కు పంపాలి.
* సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
* లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ మరియు వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.
'''గ్రామ పంచాయతీ సమావేశం-కోరం:''' సర్పంచ్ కనీసం నెలకొకసారి అయినా పంచాయతీ సమావేశం నిర్వహించాలి. అవసరం అనుకుంటే ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు. 90 రోజుల లోపు తిరిగి సమావేశం నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. సర్పంచ్ 90 రోజుల లోపు తిరిగి సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోతే పంచాయతీ కార్యదర్శే స్వయంగా సమావేశం ఏర్పాటు చేయొచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల కోరం 1/3వ వంతుగా నిర్ణయించారు. అయితే కోరం లేకున్నా సమావేశం నిర్వహించవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఇద్దరూ హాజరు కాకపోతే ఒక సభ్యుడిని సభకు అధ్యక్షుడిగా నియమించవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో కింది సభ్యులు పాల్గొంటారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు, మండల పరిషత్ కోఆప్టెడ్ సభ్యుడు.
Line 28 ⟶ 63:
గ్రామ పంచాయతీ ఎన్నికలలో [[రాజకీయ పార్టీ]] అభ్యర్థులు వుండరు. [[రాష్ట్ర ఎన్నికల కమీషన్]] ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏక గ్రీవ ఎన్నికలను ప్రోత్సహించటానికి, ప్రభుత్వం పంచాయతీకి నగదు బహుమానం ఇస్తుంది.
== గ్రామ పాలన ==
తెలంగాణలో పటేల్, పట్వారీ ఆంద్రప్రదేశ్లో కరణం,మునసబు వవ్యస్థలను 1985 లో తీసేసి గ్రామపాలనాధికారుల్ని (వి.ఏ.వో ) ప్రవేశపెట్టారు. పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి వీ.ఆర్.వోలు ఉండడానికి అనుమతి ఇచ్చారు. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారు. రాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్కు ఒక కార్యదర్శి ఉండాలి. ప్రతి పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ఒక కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్న పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. మన రాష్ట్రంలో 1127 రెవిన్యూ మండలాలు, 1094 మండలపరిషత్తులు, 21943 గ్రామపంచాయితీలు, 28124 రెవిన్యూ గ్రామాలు, 26614 నివాసితగ్రామాలు, 1510 నివాసులులేనిగ్రామాలు ఉన్నాయి.
===నేరుగా నిధులు===
పంచాయతీలకు తమ గ్రామ పరిధిలో చేపట్టదలచిన అభివృద్ధి పనులకు గాను తాము రూపొందించిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు కానున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గ్రామాల్లో ఆయా పాలకవర్గాలు ప్రతిపాదించిన పనులకు గాను నేరుగా పంచాయతీల ఖాతాలకే లక్షల్లో నిధులు చేరనున్నాయి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ కమిటీలు, శాసన సభ్యులు స్థాయి ప్రజాప్రతినిధి రూపొందించిన పనుల ప్రణాళిక కాదని పాలకవర్గాల అభీష్టం మేరకు నిధులు మంజూరు కానున్నాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ. 5.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉపాధి హామీ నిధులు పంచాయతీ ఖాతాలకు చేరతాయి. మొత్తం రాష్ట్రంలోని 21 వేల పంచాయతీలకు ఈ మొత్తం అందించనున్నారు. గ్రామ పాలకవర్గం అభీష్ఠం మేరకు లింకు రోడ్డు, పక్కా డ్రెయిన్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించుకోవచ్చు.12వ ఆర్థిక సంఘం నిధులు మినహా ప్రభుత్వం నుంచి పంచాయతీలకు మరే ఇతర గ్రాంట్లు అందలేదు. ఈ నిధులను కేవలం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య పనులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన వల్ల చాలా గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం నిలిచిపోయింది. గతంలో మార్కెటింగ్ నిధులతో రహదారులు నిర్మించినా గడచిన 8 ఏళ్లుగా ఆ పనులకు ప్రభుత్వం అంగీకారంలేదు. మరోపక్క స్థానిక నిధులతో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్తు సామగ్రి తదితర అవసరాలు మాత్రం తీరుతున్నాయి. ఈ దశలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులను నేరుగా పంచాయతీలకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. (ఈనాడు 20.2.2010)
▲==గ్రామ సభ==
▲==పంచాయతీ సభ్యులు==
==గ్రామ రెవిన్యూ అధికారి ==▼
పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి గ్రామ రెవిన్యూ అధికారి (వీఆర్వో) విధానం అమలులోకి వచ్చింది. వీరు [[తహసీల్దారు]] (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.▼
▲==గ్రామ కార్యదర్శి ==
▲పంచాయతీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి గ్రామ రెవిన్యూ అధికారి (వీఆర్వో) విధానం అమలులోకి వచ్చింది. వీరు [[తహసీల్దారు]] (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.
==గ్రామ పంచాయతి విధులు ==
# గ్రామంలో రోడ్లు, వంతెనలు, పంచాయతీ భవనాలు నిర్మించడం లేక బాగుచేయడం
|