యాదగిరిగుట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మీడియా ఫైల్స్ ఎక్కించాను
పంక్తి 1:
'''యాదగిరిగుట్ట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[యాదాద్రి - భువనగిరి జిల్లా]]కు చెందిన ఒక మండల కేంద్రం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=యాదాద్రి||district=[[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]]
|skyline = Yadagiri guTTa.jpg
|skyline_caption =
|skyline_caption = యాదాద్రి (యాదగిరిగుట్ట) దేవాలయం
| latd = 17
| latm = 35
Line 11 ⟶ 12:
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline04.png|state_name=తెలంగాణ|mandal_hq=యాదగిరిగుట్ట|villages=16|area_total=|population_total=54491|population_male=27247|population_female=27244|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.79|literacy_male=74.16|literacy_female=49.52|pincode = 508115}}
[[దస్త్రం:Yadagiriguttavillage.JPG|thumb|యాదగిరిగుట్ట గ్రామం]]
 
ఇది [[హైదరాబాదు]] నుండి [[వరంగల్|వరంగల్లు]] వెళ్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉంది.ప్రముఖ పుణ్యక్షేత్రం [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|లక్ష్మీనరసింహ]] స్వామి దేవస్థానం యాదగిరిగుట్టలోనే ఉంది.
 
==గణాంక వివరాలు==
[[దస్త్రం:Yadagirigutta temple main Gopuram.jpg|thumb|శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రధాన ఆలయ గోపురం. యాదగిరిగుట్ట]]
 
మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 54,491 - పురుషులు 27,247 - స్త్రీలు 27,244
 
Line 25 ⟶ 26:
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం [[యాదాద్రి భువనగిరి జిల్లా]]లో ప్రముఖమైన దివ్య క్షేత్రం: యాదాద్రికి సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరగా స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి "ఏంకావాలో కోరుకో" మంటే యాదర్షి స్వామి వారికి "శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరాడు. ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి కొండపై అలా కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగా, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరుమీద ప్రసిధ్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడా నివారణ, వగైరా కోరికలతో కొన్నాళ్ళపాటు ఇక్కడ వుండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారుట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పడు మృదంగ ధ్వనులువినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.
యాదగిరి గుట్టకు ప్రవేశ ద్వారము
[[దస్త్రం:Yadagiri guTTa.jpg|thumb|శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్ట]]
 
మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం .. ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రములో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయములు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.
 
Line 31 ⟶ 32:
 
==రవాణా సౌకర్యం==
 
[[రాయగిరి]] రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు [[హైద్రాబాదు]], [[వరంగల్]], నల్గొండల నుండి చాలా బస్సులు ఉన్నాయి.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము (ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.లకు మొదటి బస్సు ఉంది.
 
=== రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో ===
 
భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపోలో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.
 
==సకలజనుల సమ్మె==
 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
 
"https://te.wikipedia.org/wiki/యాదగిరిగుట్ట" నుండి వెలికితీశారు