కందుకూరి వేంకటసత్య బ్రహ్మాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
కృష్ణానది పరివాహక ప్రాంతంలో దుర్గమ్మ వడిలో విశ్వబ్రాహ్మణ పండిత కుటుంబంలో కందుకూరి వేంకట గోవిందేశ్వర శర్మ, కందుకూరి వేంకట నరసమ్మలకు జన్మించాడు. విజయవాడలో జన్మించి, ప్రాతఃమిక విద్యను అక్కడే పూర్తి చేసుకున్న సత్య బ్రహ్మచార్య బహుభాషా కోవిదుడిగా పిన్న వయసులోనే కీర్తి గడించడం విశేషం. ప్రాథమిక విద్యానంతరం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పద సన్నిధిలో తిరుమల ధర్మగిరి వేదం పాఠశాలలో శైవాగమ విద్యను 8 సంవత్సరాలపాటు గురుకుల పద్దతిలో అభ్యసించి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ద్వారా ఆగమశాస్త్రములో స్నాతకోత్తర పట్టభద్రులు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో శిల్పశాస్త్ర అనువాద పథకంలో ఆగమశాస్త్ర పండితుడిగా ఉద్యోగం సంపాదించి కాశ్యప శిల్పశాస్త్ర గ్రంథాన్ని తెలుగులో అనువదించారు. కర్ణాటక శిల్పకళా అకాడమీవారి కర్ణాటక సంప్రదాయ శిల్పగురుకుల కేంద్రంలో బి.ఎఫ్.ఎ, ఎమ్.ఎఫ్.ఎ. కోర్సుల సిలబస్ కమిటీ, బోర్డు అఫ్ స్టడీస్ సభ్యుడిగా, ఆగమశాస్త్ర పండితుడిగా విషయనిపుణుడిగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలప్రభ మాసపత్రిక సహాయ సంపాదకులుగా పనిచేస్తున్నారు.
 
[[వర్గం: తెలుగు ప్రముఖులు]]
[[వర్గం: విజయవాడ ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు అనువాదకులు]]