పూర్వకాలంలో ఎప్పుడో ఒక నాడు [[జ్యేష్ఠా దేవి]] (పెద్దమ్మ), [[లక్ష్మీ దేవి]] (చిన్నమ్మ) “నేను బాగుంటానంటే నేను బాగుంటాను” అని రివాజుగా తగువాడుకున్నారుట. తగువాడుకుని, మరెక్కడా ఊళ్ళే లేనట్టు, తునిలో సెట్టి గారింటికి తగువు తీర్చమని వచ్చేరుట. సెట్టి గారి గొంతుకలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఎటు తీర్పు చెప్పినా చిక్కే! ఆలోచించి, “అమ్మా, చిన్నమ్మా! నువ్వు ఇలా లోపలికి వస్తూంటే బాగున్నావు. చూడు జ్యేష్ఠమ్మా! నువ్వు అలా బయటకి వెళుతూంటే బాగున్నావు” అని తీర్పు చెప్పేడుట. తెలుగు భాషలో '''తుని తగువు తీర్చినట్లు''' లేదా '''తుంతగువులు తీరవుగాని''' అన్న జాతీయానికి వెనకనున్న గాథ ఇది. ఇలా కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడే చాకచక్యం తుని వర్తకులకే ఉందని చెబుతారు.
తుని, [[పాయకరావుపేట]]ల మధ్య ఉన్న [[తాండవ నది]]కి ఎడమ ఒడ్డున పాయకరావుపేట ఉంది. తుని తూర్పు గోదావరి జిల్లా లోను, పాయకరావుపేట విశాఖపట్నం జిల్లా లోను ఉన్నాయి.