బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 12:
సినిమాలకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం పది, పన్నెండు ప్రయివేట్ గీతాలు గ్రామ్ఫోన్కి పాడింది. సినిమాలకి నిదానంగా ప్లేబాక్ విధానం వస్తోంది. [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం(1939)]]లో నాగయ్య, కాంచనమాల పాడిన పాటలు ముందే రికార్డు చేసి, ప్లేబాక్ పద్ధతిలో చిత్రీకరించారు. ప్లేబాక్ కాకపోయినా, కృష్ణ అనే అబ్బాయికి సాబూ పాడాడు. ఒకరికి ఇంకొకరు పాడడం ఇలా మొదలైనా, ఈ పాట ముందుగా రికార్డు చెయ్యలేదు. వేరొకరిచేత ముందుగా పాడించి, రికార్డు చేసి ప్లేబాక్ చేసి చిత్రీకరించినది- [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్లీ పెళ్లి]]లో హీరో వై.వి.రావుకి ఆ చిత్రం సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు పాడారు. ఆ లెక్కలో ఓగిరాల మొదటి నేపథ్య గాయకుడు.
రాజరత్నం [[తమిళం]]లో కూడా నటించి, పాటలు పాడింది. '[[మోహిని]]' అనే చిత్రంలో నాయిక మాధురికి ప్లేబాక్ పాడిందామె. [[జెమిని]] వారి [[జీవన్ముక్తి]] (1942)లో రాజరత్నం నటించి, పాడింది. ఆమె, సూరిబాబు కలిసి పాడిన 'జోడుకొంటారా బాబూ, జోడుకొంటారా' పాట అప్పట్లో ప్రజల నోట వినిపించేది. ఘంటసాల బలరామయ్య తీసిన [[ముగ్గురు మరాఠీలు]] (1946) రాజరత్నం చిన్నపాత్ర ధరించి రెండు పాటలు పాడింది. అయితే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించలేదు; ఎక్కువ నేపథ్య గీతాలూ పాడలేదు. మంచి కంఠంతో, హాయిగా పాటలు పాడేది గనక, పాటలున్న పాత్రలుంటే ఆమె చేత నటింపజేసి పాడించేవారు. ఆమె పాడిన పాటలన్నీ పాపులర్ అయినాయి.
|