ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
 
[[బొమ్మ:dwarakatirumala venkateswaraswami.jpg|left|150px|thumb|ద్వారకా తిరుమల స్వామివారి మూలవిరాట్టులు]]
'''ద్వారకా తిరుమల''' ([[ఆంగ్లం]] Dwaraka Tirumala) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండలము మరియు [[ఏలూరు]] నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా|పుణ్య క్షేత్రము]]. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా [[భీమడోలు]], వయా [[తడికలపూడి]], వయా [[దెందులూరు]] - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.
 
ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన [[వేంకటేశ్వర స్వామి]]ని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల '''చిన్నతిరుపతి'''గా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.
 
"పెద్దతిరుపతి" ([[తిరుమల|తిరుమల తిరుపతి]])లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
[[బొమ్మ:Chinnatirupathi 9.JPG|thumb|125px|left|మొదటిమెట్టు వద్ద పాదుకామండపంలో శ్రీవారి పాదాలు]].
[[బొమ్మ:IChinnatirupathi 8.JPG|thumb|300px|right|ప్రధాన గోపురం]].
 
== పేరు వెనుక చరిత్ర ==
ద్వారకా తిరుమలకి చిన్న తిరుపతి అన్న మారు పేరు వ్యవహారంలో వుంది. ద్వారకుడు అనే బ్రాహ్మణుడు జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవాడు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని భావిస్తారు. ఐతే చెట్లుకొట్టి కట్టెలు అమ్ముకోవడం-దారుకము వృత్తిగా కలవారు , దారువులు(చెట్లు) ఎక్కువగా వుండడంతో, మెట్ట ప్రాంతానికి ద్వారం వంటిది కావడం వంటి కారణాలతో ద్వారకా తిరుమల అయిందని మరొక వాదం వుంది.<ref name="కానూరి బదరీనాథ్">{{cite journal|last1=బదరీనాథ్|first1=కానూరి|title=నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు|journal=సుపథ సాంస్కృతిక పత్రిక|date=ఫిబ్రవరి 2012|volume=12|issue=2|page=35}}</ref> [[తిరుమల]]ను పెద్ద తిరుపతిగా వ్యవహరిస్తూ ఆ క్రమంలోనే దీనిని చిన్న తిరుపతిగా వ్యవహరిస్తూంటారు.
 
==ప్రధానాలయం==
[[File:Annamayya statue.jpg|left|thumb|ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలోని మండపంలో [[అన్నమయ్య]] విగ్రహం]]
Line 109 ⟶ 104:
[[Image:Chinnatirupathi 5.JPG|left|thumb|100px|గర్భాలయానికి ఎదురుగా ద్వారక మహర్షి విగ్రహం]]
[[బొమ్మ:Garuda Dwarakatirumala.JPG|thumb|100px|right|ద్వారకాతిరుమల కొండ క్రింద [[గరుడుడు|గరుడ]] విగ్రహం]].
 
స్థల పురాణము ప్రకారము ఈ క్షేత్రము రాముని తండ్రి [[దశరథ మహారాజు]] కాలము నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. [[విశిష్టాద్వైతం|విశిష్టాద్వైత]] బోధకులైన శ్రీ [[రామానుజాచార్యులు]] ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ [[పురుషార్థాలు|పురుషార్ధములు]] సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
 
ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము. ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామి [[విగ్రహము]] క్రిందనున్న ఎర్రచీమలను కదుల్చును. ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యానోత్సవములు వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు. ఇందుకు కారణం- స్వయంభూమూర్తి [[వైశాఖమాసము|వైశాఖమాసం]]<nowiki/>లో దర్శనమిచ్చారనీ, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు.
 
గుడి ప్రవేశంలో కళ్యాణ మంటపం ఉంది. మంటపం దాటి మెట్లు ఎక్కే ప్రాంభంభంలో (తొలిపమెట్టు వద్ద) పాదుకా మండపంలో స్వామి పాదాలున్నాయి. శ్రీపాదాలకు నమస్కరించి భక్తులు పైకెక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు ప్రక్కలా [[దశావతారములు|దశావతారముల]] విగ్రహములు ప్రతిష్ఠింపబడినవి. మెట్లకు తూర్పునైపున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం ఉన్నాయి. పడమటివైపు పద్మావతి సదనం, దేవాలయం కార్యాలయం, నిత్యకళ్యాణ మండపం ఉన్నాయి.
 
[[బొమ్మ:temple-dwarka-tirumala.jpg|thumb|300px|right|ద్వారకా తిరుమల ప్రధానాలయం - http://www.aptourism.in/ నుండి తీసికొన్న చిత్రం]]
ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది [[ఆళ్వారులు|ఆళ్వారుల]] ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉంది. ప్రధాన మందిరంలో [[ఆంజనేయస్వామి]], [[గరుత్మంతుడు|గరుడస్వామి]]ల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి.
 
[[గర్భగుడి]]<nowiki/>లో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.
[[File:South gopuram of Dwaraka Tirumala temple.jpg|thumb|right|ప్రధాన ఆలయపు గాలి గోపురం.]]
 
ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం
ఐదు అంతస్తులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారము చుట్టూ పన్నెండుగురు [[ఆళ్వారులు|ఆళ్వారుల]] విగ్రహములు ప్రతిష్ఠింపబడ్డాయి.
 
పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.
 
;పుష్కరిణి
గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీనిని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరమని, కుమార తీర్ధమనీ అంటారు. ఇక్కడ చక్ర తీర్ధము, రామ తీర్ధము అనే రెండు స్నానఘట్టాలున్నాయి. ఇక్కడి రాళ్ళపై సుదర్శన (చక్రం) ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 199లో పుష్కరిణి మధ్య మడపం నిర్మించారు. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు [[తెప్పోత్సవం]] జరుపుతారు.
గ్రామం లోపల విలాస మండపం, క్షీరాబ్ది మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు వేరువేరు చోట్ల ఉన్నాయి. పర్వదినాలలో తిరువీధుల సేవ జరిగినపుడు ఆయా మండపాలలో స్వామిని "వేంచేపు" చేసి, [[అర్చన]], ఆరగింపు, [[ప్రసాదం|ప్రసాద]] వినియోగం జరుపుతారు.
[[File:Dwaraka-maharshi.jpg|thumb|ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ద్వారకా మహర్షి విగ్రహం]]
 
===ఆలయంలో సమస్యలు, లోపాలు===
* నూతనముగా నిర్మించిన కేశఖండనశాల భవనము ఆలయమునకు దూరముగా ఉండటము మరియు రోడ్డుకు అవతలివైపు ఏర్పాటు చేయుటవలన చాలా ప్రమాదకరము.
*తగినన్ని సైన్ బోర్డులు ముఖ్య ప్రదేశములలో ఏర్పాటుచేయకపోవటము.పాదచారులకు footpath వెంబడి sheds వేయకపోవటం (ఎండలో,వానలో చాలాఇబ్బంది).
*సరైన cheppal stand, cloak room లేకపోవటము.
 
==అర్చన, కైంకర్యం, ఉత్సవాలు==
 
* '''నిత్య కార్యక్రమాలు''' - సుప్రభాతం, తీర్ధపు బిందె, ప్రాతఃకాలార్చన, బాలభోగము, గోష్ఠి, ప్రత్యేక దర్శనము (06:00 నుండి 13:00), అర్జిత పూజలు, వేద పారాయణము, మహా నివేదన (12:00), విరామం (13:00 నుండి 15:00 వరకు దర్శనం ఉండదు), ప్రభుత్వోత్సవము, సర్వ దర్శనము (15:00 నుండి 17:00 వరకు), పంచాంగ శ్రవణము, ప్రత్యేక దర్శనము (17:00 నుండి 21:00 వరకు), సాయంకాలార్చన, సేవాకాలము, పవళింపు సేవ, ఏకాంతసేవ తీర్మానము (21:00)
* '''విశేష ఉత్సవాలు''' - ప్రతినెల [[ఏకాదశి]], [[పౌర్ణమి]], [[అమావాస్య]] తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో- రాత్రి 7:30కి విశేష ఉత్సవం - ప్రత్యేకమైన మూల మండపంలో స్వామివారి వేంచేపు, అర్చన, ప్రసాద వినియోగం
Line 149 ⟶ 133:
* '''గిరి ప్రదక్షిణము''' - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి [[దొరసానిపాడు]]లో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
* మాఘ మాసం '''రధ సప్తమి''', ఫాల్గుణ మాసం '''డోలా పౌర్ణమి''' దినాలలో విశేషముగా తిరువీధి సేవలు జరుగును.
 
==ఇతర ఆలయాలు==
'''భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఆలయం''' : [[కొండ]]<nowiki/>పైన ప్రధానాలయానికి నాయువ్య దిశలో కొద్దిదూరంలోనే కొండమల్లేశ్వరస్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబా మల్లేశ్వరస్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి [[క్షేత్ర పాలకుడు]]. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు. ఈ దేవాలయంలో గణపతి, భ్రమరాంబ, మల్లేశ్వరస్వామి కొలువుతీరు ఉన్నారు. నవగ్రహ మందిరం కూడా ఉంది. ఆలయం తూర్పున "శివోద్యానం" అనే పూలతోట ఉంది. సమీపంలోనే టూరిజమ్ డిపార్ట్‌మెంటు వాఱి "పున్నమి" అతిథి గృహం ఉంది. ఇటీవలి కాలంలో కొడపైభాగాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
 
[[Image:Chinnatirupathi 10.JPG|right|thumb|150px|కుంకుళ్ళమ్మవారి గుడి వద్దనున్న ఒక బోర్డు]]
'''కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి) ఆలయం''' : కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోల నుండి ద్వారకా తిరుమల మార్గంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి [[గ్రామదేవత]]. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
 
'''వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు''' : ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో సుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు.
 
కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. [[పుష్కరిణి]] మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. [[ఉగాది]] మండపం ఎదురుగా రామాలయం ఉమ్మది.
 
==చూదదగిన ప్రదేశాలు==
* భ్రమారంబా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. [[పుష్కరిణి]] మార్గంలో నందనవనం అనే తోటను, ప్రధానాలయం వెనుక నారాయణ వనం అనే తోటను పెంచుతున్నారు.
* [[భీమడోలు]]వద్ద స్వామివారి నమూనా [[ఆలయం]] ఉంది.
 
;
 
==గ్రామ గణాంకాలు==
;జనాభా (2001) - మొత్తం 4,391 - పురుషుల సంఖ్య 2,251 - స్త్రీల సంఖ్య 2,140 - గృహాల సంఖ్య 1,114
Line 171 ⟶ 148:
==వసతి విశేషాలు==
* పద్మావతి అతిథి గృహం, అండాళ్ అతిథి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టి.టి.డి. అతిథి గృహం వంటి వసతి గృహాలు దేవస్థానంచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలున్నాయి.
 
==ప్రయాణ సౌకర్యాలు==
* ద్వారకా తిరుమలనుండి తూర్పు యడవల్లి సీతారామచంద్ర దేవస్థానానికి, లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది.
* ఈ క్షేత్రం విజయవాడ - రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిదినం అనే [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] బస్సులున్నాయి.
 
==సంప్రదింపుల వివరాలు==
* సంప్రదించడానికి వెబ్ సైటు www.dwarakatirumala.org మరియు ఇ-మెయిల్ eo_dwarakatirumala@yahoo.co.in
* పోస్టల్ చిరునామా: ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, పిన్- 534 426, ఫోన్: (08829) 271427, 271469, 271436
 
==దత్తత ఆలయాలు==
[[బొమ్మ:APvillage Sanivarappeta 1.JPG|right|thumb|శనివారపు పేట ఆలయం గోపురం]]
 
* '''శ్రీ కోదండరామస్వామి దేవాలయం''', [[నాగులూరు]], [[రెడ్డిగూడెం]] మండలం, [[కృష్ణా జిల్లా]] : ఈ గ్రామాన్ని మైలవరం జమీందారులు నూరానేని వంశీయులు నిర్మించారు.
*''' శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం''', [[శనివారపు పేట]], [[ఏలూరు]] సమీపంలో, [[నూజివీడు]] దారిలో - నూజివీడు జమీందారులచే నిర్మింపబడింది. ఈ ఆలయం గాలిగోపురం చాలా పెద్దది, చక్కని శిల్పాలతో అలరారుతున్నది.
Line 190 ⟶ 163:
* '''శ్రీరామ మరియు శ్రీ వెంకటెశ్వర స్వామి వారి దేవాలయము''', భట్ల మగుటూరు, పెనుమండ్ర మండలం
* '''శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం''', [[ఐ.ఎస్.జగన్నాధపురం]]
 
==కార్యక్రమాలు, పధకాలు, సంస్థలు==
[[Image:Chinnatirupathi 6.JPG|right|200px|వాహనాలు నిలిపే స్థలంలో ఒక బోర్డు]]
Line 198 ⟶ 170:
* '''శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలు''' - భీమడోలు, కామవరపుకోట
* '''నిత్య అన్నదాన ట్రస్ట్''' - భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం కోసం
 
==చిత్ర మాలిక==
<center><gallery perrow="3">
Line 208 ⟶ 179:
Image:Chinnatirupathi 2.JPG|కుంకుళ్ళమ్మవారి దేవాలయం గోపురం
</gallery></center>
 
==మండలంలో వ్యవసాయం, నీటి వనరులు==
ఈ మండలంలో [[వ్యవసాయం]] ప్రధానంగా మెరక వ్యవసాయం. చెరువులు, భూగర్భ జలాలు ముఖ్యమైన నీటి వనరులు. [[పుగాకు]], [[మామిడి]], [[నిమ్మ]], [[పామాయిల్]], [[సపోటా]], [[ప్రొద్దు తిరుగుడు]], [[అపరాలు]], [[జీడిమామిడి]] వంటి తోటలు అధికంగా ఉన్నాయి. చెరువుల క్రింద కొంత వరి వ్యవసాయం జరుగుతున్నది.
 
==మండలంలో ఆర్ధిక వ్యవస్థ==
ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. వ్యవసాయాధారిత వ్యాపారము, పరిశ్రమలు పరిమితంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సెరామిక్ పరిశ్రమలకు పనికొచ్చే బంకమన్ను లభిస్తుంది. అందువలన ద్వారకా తిరుమల పరిసరాలలో పెంకులు, రిఫ్రాక్టరీ ఇటుకలు, సెరామిక్ టైల్స్ పరిశ్రమలు ఉన్నాయి. వరి పండే ప్రాంతాలలో బియ్యం మిల్లులున్నాయి.
 
==మండలంలో విద్య, వైద్య సదుపాయాలు==
శ్రీ వెంకటేశ్వర వికలాంగులకు సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఉంది. VIRRD మొదటి దశలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ఉంది.
 
==ప్రముఖులు==
* [[బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు]], ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు మరియు ఉపన్యాసకులు.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4391.<ref name="censusindia.gov.in"/> ఇందులో పురుషుల సంఖ్య 2251, మహిళల సంఖ్య 2140, గ్రామంలో నివాస గృహాలు 1114 ఉన్నాయి.
 
==విశేషాలు==
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
* దేవస్థానం వారు ప్రచురించిన సమాచార పత్రం నుండి ఈ వ్యాసంలోని చాలా విషయాలు సేకరించబడ్డాయి.
 
==బయటి లింకులు==
* [http://www.dwarakatirumala.org/ ద్వారకా తిరుమల దేవస్థానము వెబ్‌ సైటు]
Line 234 ⟶ 198:
{{పశ్చిమ గోదావరి విషయాలు}}
{{విష్ణు దేవాలయాలు}}
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు