పరిటాల శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Added infobox ట్యాగు: 2017 source edit |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 14:
పరిటాల శ్రీరాములు 1935, ఏప్రిల్ 2 న అనంతపురం జిల్లా, వెంకటాపురం గ్రామంలో జన్మించాడు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న గ్రామమిది. తండ్రి పరిటాల ముత్యాలప్ప ఆ గ్రామంలోకెల్లా పెద్ద భూస్వామి. స్వగ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కలిపి ఆయనకు 150 ఎకరాలకిపైగా భూమి ఉండేది. ఈయన భూస్వామి అయినా పెద్ద దర్పాలకు పోకుండా సాధారణ జీవితం గడిపేవాడు. రామాయణ, మహాభారతాలను నిత్యం పారాయణం చేసేవాడు. ముత్యాలప్ప మొదటి భార్యకు సంతానం లేదు. రెండవ భార్య ఒక కుమార్తెను కని చనిపోయింది. ఈమె పేరు అశ్వత్థమ్మ. మూడవ భార్య చినవెంకటమ్మ. ఈమెకు ఆరుగురు సంతానం. పెద్ద కుమారుడు శ్రీరాములు, రెండో కొడుకు పి. ఎం. నారాయణ, మూడోది గజ్జెలప్ప, నాలుగో వాడు సుబ్బయ్య, అయిదోవాడు చిననారాయణ, ఆఖరున కుమార్తె నారాయణమ్మ. శ్రీరామ నవమి రోజు పుట్టిన తమ పెద్దకొడుకుకి శ్రీరాములు అని పేరు పెట్టుకున్నారా దంపతులు.
శ్రీరాములు చదువుకుంటూనే వ్యవసాయం చేసేవాడు. విద్యార్థి దశ నుంచీ సాహిత్యం మీద, రాజకీయాల ముఖ్యంగా వాటిలోని ప్రగతిశీల భావజాలం మీద ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాచీన సాహిత్యంలోనూ ఆసక్తి ఉండేది. పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శ్రీరాములు ఎస్. ఎస్. ఎల్. సి తో స్వీయ నిర్ణయంతో చదువు ముగించాడు. తమ్ముడు పి. ఎం. నారాయణ బి. ఎ. ఆనర్స్ దాకా చదివాడు. మిగతావారంతా చిన్న చిన్న చదువులతో సరిపెట్టుకున్నారు. చదువు ముగియడంతోనే ఆయనకు వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1952లో పదిహేడేళ్ళ వయసులో శీరిపి కొట్టాల గ్రామానికి చెందిన నారాయణమ్మ తో ఆయనకు వివాహం అయింది.
== మూలాలు ==
|