అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
Nrgullapalli (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 25:
అనంతపురం చరిత్ర [[విజయనగర సామ్రాజ్యం]] ఆరంభంతో మొదలైంది. ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలము ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయల లోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణముగా బుక్కరాయసముద్రము అను పట్టణము ఏర్పడినది.
== జిల్లా చరిత్ర ==
మొట్టమొదటగా ఈ ప్రదేశాన్ని [[అశోకుడు]] పాలించాడని తెలుస్తుంది. క్రీ.పూ.258 ప్రాంతంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు తెలుస్తుంది. అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని [[మడకశిర]] తాలూకాలోని [[రత్నగిరి]] నుండి పాలించారు. ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనం లోకి తెచ్చుకున్నారు. ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు. బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్రకూటులకు వీరు సామంతులు. [[గుత్తి]] వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తోంది. పదవ శతాబ్దంలో నొలంబులను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు. [[అమరసింహుడు]] వీరిలో ముఖ్యుడు. ఆపై [[తంజావూరు]] నుండి చోళులు వచ్చి వీళ్ళని జయించారు. పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం నడుమ పశ్చిమ చాళుక్యులు నైజాములోని [[కళ్యాణి]] నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆపై హోయ్సళులు యాదవులు మొదలగు వారు అరువాతి శతాబ్ద కాలంలో ఈ జిల్లాను పాలించారు. తర్వాత [[ఢిల్లీ]] నుండి పరిపాలన చేస్తున్నా ఖిల్జీ వంశస్థుడు [[అల్లావుద్దీన్ ఖిల్జీ]] దక్షిణ దేశంపై దండయాత్ర చేసాడు. అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి హోసలులను, యాదవులను తరిమివేసాడు. 1310లో నైజాము రాజ్యంలో ఉన్న ఓరుగల్లులోని ద్వారసముద్రమును కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపరుద్రుడ్ని ఖైదీగా చేసి పట్టుకుపోయారు. ప్రతాపరుద్రుని ధనాగారమునకు కాపలాగా ఉన్న [[హరిహరరాయలు]], బుక్కరాయలు లను కూడా బంధించి తీసుకుపోగా సుల్తాను వారిని కొంత సైన్యమిచ్చి తిరిగి కర్నాటక రాజ్యమునకు పంపివేసాడు. అలా తిరిగి వచ్చిన హరిహరబుక్కరాయలిరువురు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1258 నుండి పదహారో శతాబ్దం వరకూ విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది. 1677 నుండి ఇది మొగలుల పాలనలోకి వెళ్లింది. 1723 లో అసఫ్ జాహి వంశస్తులు దీనిని తమ పాలనలోనికి తెచ్చుకున్నారు. 1799 లో జరిగిన మైసూర్ యుద్ధంలో నిజాం నవాబు దీనిని తన స్వాదీనం లోనికి తెచ్చుకున్నాడు. క్రీ.శ. 1800 సంవత్సరంలో వచ్చిన
[[Andhravijnanasarvasvamupart2.pdf/10]] అను గ్రందములోని 4 వ పుటలో అనంతపురము చరిత్ర ఈ విధముగా నున్నది.
</ref> అనంతపురము -
|