పెద్దమనుషులు (1954 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పరిచయ పాఠ్యం మార్పు ట్యాగు: 2017 source edit |
→కథ: విస్తరణ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 23:
== కథ ==
ఆదికేశవపురం అనే ఊరికి ఛైర్మన్ అయిన ధర్మారావు, కాంట్రాక్టరు నాగోజీ, ప్రముఖ వ్యాపారియైన చింతపులుసు శేషావతారం, దేవాలయ పూజారి సిద్ధాంతి ఊర్లో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతుంటారు. కానీ ఎవరికీ తెలియకుండా ప్రజాధనం దోపిడీ చేస్తుంటారు. ధర్మారావు తమ్ముడు శంకరం. చెల్లెలు సుందరమ్మ విధవరాలు. ధర్మారావు పుట్టిల్లు చేరిన సుందరమ్మ ఆస్తిని కాజేయడంతో పాటు తమ్ముడి ఆస్తిని కూడా కాజేయడానికి శంకరానికి పిచ్చి అని ప్రచారం చేస్తుంటాడు. శంకరం నిజానికి పిచ్చివాడు కాకపోయినా అలా నటిస్తూ అన్న మోసాలన్నీ గమనిస్తూ ఉంటాడు. వీరితో పాటు నిజాయితీపరుడైన రామదాసు ప్రజాసేవ అనే పేరుతో ఒక పత్రిక నడుపుతూ ఉంటాడు. దాంతో పాటు అనాథ పిల్లలకోసం ఒక శరణాలయం కూడా నిర్వహిస్తుంటాడు.
రామదాసుకు అంధురాలైన ఒక కుమార్తె ఉంటుంది. ధర్మారావు కుమారుడు ప్రభాకరం పట్నంలో వైద్యవిద్యనభ్యసిస్తూ ఉంటాడు. ప్రభాకరానికి రామదాసు కూతురు అంటే అభిమానం. ఆమెను పట్నంలో వైద్యం చేయిస్తే చూపు వస్తుందని తెలుసుకుంటాడు. దాని ఖర్చు కోసం రామదాసు ధర్మారావు దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటాడు. వితంతువైన ధర్మారావు చెల్లెల్ని అతని కారు డ్రైవరు ప్రేమిస్తున్నాడని తెలుసుకుని అతన్ని తుపాకీతో కాలుస్తాడు ధర్మారావు. ధర్మారావు తనకు చేసిన సహాయాన్ని తలుచుకుని అతని అసలు స్వరూపం తెలియక ఆ నేరాన్ని తన మీద వేసుకుని జైలుకి వెళతాడు.
==పాత్రలు-పాత్రధారులు==
|