తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
[[File:Gollalamamidada temple gopuram Eastgodavari.JPG|thumb|రామాలయం, గొల్లల మామిడాడ]]
[[File:Draksharama.jpg|thumb|ద్రాక్షారామం]]
=== చాళుక్యులు చోళులు ===
బాదామి చాళుక్యులకు చెందిన రెండవ పులకేశి మరియు ఆయన సోదరుడు విష్ణువర్ధనుడు పిష్టాపురాన్ని 7వ శతాబ్దంలో అధిపత్యం వహించాడు. కుబ్జ విష్ణు వర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య సామ్రాజ్యం మొదట పిష్టాపురాన్ని తరువాత వేంగి మరియు రాజమండ్రి వరకు పాలించాడు. అనేక రాజులు పాలించిన కారణంగా వారి వంశస్థుల పాలనా చరిత్ర వివాదాస్పదమౌతుంది. మొదటి చాళుక్య చక్రవర్తి బీమా దాక్షారామంలో శివాలయం ఆలయనిర్మాణం చేసాడు. 1973లో ఈ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ధనార్వుని పెదకల్లు(కర్నూలు జిల్లా) జాతచోడ భీమ చంపి వేంగిని ఆక్రమించుకున్నాడు. ధనార్వుడి ఇద్దరు కుమారులైన మొదటి శక్తివర్మ మరియు విమలవర్మ పారిపోయి మొదటి రాజరాజచోళుని సభలో ప్రవేశించి ఆయనను ఆశ్రయించాడు. రారాజ చోళుడు ధనార్వుని కుమారుల తరఫున వేంగి మీద దండెత్తి జాతచోడ భీమను చంపాడు. కల్యాణికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన సత్యరాయునికి వేంగి ప్రాంతం మీద చాళుక్యుల ఆధిపత్యం నచ్చలేదు. ఆ కారణంగా కారణంగా చోళులు మరియు చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 175 ఎ డిలో ఏడవ విజయాఅదిత్యుడి మరణం తరువాత తూర్పు చాళుక్యసామ్రాజ్యం ముగింపుకు వచ్చింది.
 
ఏడవ విజయాదిత్యుడి శత్రువైన మొదటి కులోత్తుంగచోళుడు (రాజేంద్రచాళుక్యుడు) చోళుల తరఫున యుద్ధంచేసి చాళుక్య చోళుల సామ్రాజ్య స్థాపన చేసాడు. వేంగి రాజ్యం వెంట ఈ జిల్లా వారి సామ్రాజ్యంలో ఒక భాగం అయింది. జిల్లాలో అధిక భాగం చోళుల సామంతరాజైన వెలనాటి చోడుల ఆధిక్యతకు వశమైంది. చోళసామ్రాజ్యపు ప్రముఖ పాలకులు మొదటి గోయంకా, మొదటి రాజేంద్రచోడా, రెండవ గోయంకా మరియు రెండవ రాజేంద్రచోడ.
 
ఈ ప్రదేశాన్ని పడమటి చాళుక్యుడైన ఏడవ విక్రమచోడుడు ఆక్రమించుకుని కొంతకాలం ఆధిక్యత సాధించాడు. అయినా ఇది తిరిగి వెలనాటి చోడ మరియు చాళుక్యుల వశమైంది. తరువాత వెలనాటి చోడులు తిరుగుబాటుదారులైన కోణాకు చెందిన హైహయులు మరియు కాకతీయులకు చెందిన రెండవ గోయంకా మరియు రుద్రాలచేత అణచబడి వశపరచుకున్నారు.
 
=== కాకతీయులు ఢిల్లీ సుల్తానులు ===
ఈ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలు 13వ శతాబ్ధపు శిలాశాసనంతో కలిసి ఈ ప్ర్రాంత చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. కాకతీయ చక్రవర్తి '''రెండవ ప్రోలా''' పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి చాళుక్యచోళులకు ప్రతిధ్వంది అయ్యాడు. ఆయన కుమారుడు రుద్రా రెండవ చాళుక్యచోళుని నుండి గోదావరి డేల్టాను బహుమతిగా పొందాడు. గోదావరి డెల్టా మీద రుద్రా ఆధిపత్యాన్ని వెలనాడు చోడాలు ఎదిరించారు. చాళుక్య చోళ వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోడా ఆయన మంత్రి దేవన ప్రగ్గడ సైన్యాధ్యక్షతలో రుద్రా మీదకు దండయాత్రకు పంపించాడు. రుద్రా ఆయన కనిష్ఠ సోదరుడు మహాదేవా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత రాజ్యపాలన చేపట్టాడు. ఆయన కుమారుడు గణపతి కాకతీయ సింసానానికి తరువాత రాజయ్యాడు. గణపతి [[నెల్లూరు]] చోడుల సహాయంతో ఉత్తరంలోని కళింగ సైన్యాలను, మధురై పాండ్యులను మరియు చోళులను ఓడించాడు. గణపతి కామము ఆయన కుమార్తె రుద్రమదేవి కాలం అంతా గోదావరి ప్రదేశమంతా కాకతీయుల ఆధిపత్యం కొనసాగింది. 1295లో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323లో ఆయన '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' చేతిలో ఓడిపోయిన తరువాత ఈ జిల్లా ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యానికి చేరింది. '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' దక్షిణభారతదేశాన్ని అయిదు సంస్థానాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించింది.