దేశపతి శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==బాల్యం, కుటుంబం==
కీర్తిశేషులు స్వర్గీయ దేశపతి బాలసరస్వతి, గోపాలకృష్ణ శర్మ గార్ల తనయుడు శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు. వృత్తి రీత్యా [[ఉపాద్యాయుడుఉపాధ్యాయుడు]], ప్రవృత్తి రీత్యా ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన కవి గాయకుడు, మరియు వక్త దేశపతి శ్రీనివాస శర్మ. పేదరికంలో పుట్టి, స్వయం ప్రకాశవంతుడై. నటుడిగా, వక్తగా, వాగ్గేయకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి, తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ప్రత్యేక కళారూపాలతో జనవాహినులను ఉడికించి, ఉరికించి మైమరించిన దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రముఖపాత్ర నిర్వహించారు.<ref>[http://54.243.62.7/literature/article-136260 కళామతల్లి మెచ్చిన బాసు : దేశపతి శ్రీనివాసు]</ref>
 
==జీవిత విశెషాలు==
ఆయన [[తెలంగాణ]] రాష్ట్రం [[గజ్వేలు]] దగ్గర [[మునిగడప]] గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి [[ఉపాధ్యాయుడు]], మంచి కవి. గోపాలకృష్ణ గారు మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు.ఆయనకు [[తెలుగు]] [[సంస్కృతం]], [[ఇంగ్లీషు]], [[ఉర్దూ]] భాషల్లో [[నైపుణ్యం]] ఉంది. వారి తాతగారు (మాతామహులు) గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు 'పుష్పబాణ విలాసం'' అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ రామేశ్వర శర్మగారు వారు నవ్యకళాసమితి అనే ఒక నాటక సమితిని యేర్పాటు చేసి, నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం శ్రీనివాస్ పై పడింది.
"https://te.wikipedia.org/wiki/దేశపతి_శ్రీనివాస్" నుండి వెలికితీశారు