తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

rv
Blanked the page
ట్యాగులు: తుడిచివేత blanking
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=తూర్పు గోదావరి|
|skyline=Yeleru Dam at Yeleswaram EastGodavari.jpg
|base_map=India - Andhra Pradesh - East Godavari.svg
|state_name=ఆంధ్ర ప్రదేశ్
|region=కోస్తా
|hq=కాకినాడ
|latd = 16.93 | longd = 82.22
|area_total=10807
|population_total=5151549
|population_male=2569419
|population_female=2582130
|population_urban=
|population_rural=
|population_density=451
|population_as_of = 2011
|literacy=65.49(2001)
|literacy_male=69.97
|literacy_female=61
}}
 
[[తూర్పు గోదావరి జిల్లా|'''తూర్పు గోదావరి''' జిల్లా]] [[భారత దేశము|భారత దేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రానికి ఈశాన్యాన 16° 30' మరియు 18° 20' ఉత్తర అక్షాంశాల మధ్య, 81° 30' మరియు 82° 36' తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. [[కాకినాడ]],[[రాజమండ్రి]] దీని ముఖ్యపట్టణాలు. కాకినాడ రాష్ట్ర రాజధాని [[అమరావతి]]కు 246కి.మీల దూరంలో ఉంది.
 
== జిల్లా చరిత్ర ==
{{main |తూర్పు గోదావరి జిల్లా చరిత్ర}}
[[File:Pandavula Metta caves 09.JPG|thumb|పాండవుల మెట్ట గుహలు, పెద్దాపురం]]
[[File:Early morning in Godavari 02.jpg|thumb|పాపికొండలు]]
[[File:Antarvedi temple on the banks of Godavari in Andhra pradesh.jpg|thumb|అంతర్వేది]]
[[File:Inscriptions at Sarpavaram temple.JPG|thumb|సర్పవరం శాసనాలు]]
[[File:Gollalamamidada temple gopuram Eastgodavari.JPG|thumb|రామాలయం, గొల్లల మామిడాడ]]
[[File:Draksharama.jpg|thumb|ద్రాక్షారామం]]
=== హిందూరాజ్యాలు ===
తూర్పుగోదావరి జిల్లాను ప్రారంభ చరిత్రను అనుసరించి మిగిలిన [[దక్కన్ పీఠభూమి]]లాగా మౌర్యులు మరియు నందుల చేత పాలించబడింది. మౌర్యసామ్రాజ్య పతనము తరువాత మూడవ శతాబ్దం ప్రముఖ కవి మరియు రాజు అయిన హలచక్రవర్తి వరకు ఈ ప్రదేశం శాతవాహనుల చేత పాలించబడింది. త్రవ్వకాలలో లభించిన నాణ్యాలు ఆధారంగా గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్టీ-పుత్ర పులుమాయి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి పాలించినట్లు నిరూపితమైంది. 350 ఎ.డిలో పిష్టాపుర మరియు అవాముఖ కాలంలో ఈ ప్రదేశం మీద సముద్రగుప్తుడు దండెత్తినట్లు ఆధారాలు ఉన్నాయి. సముద్రగుప్తుని దండయాత్ర తరువాత ఇక్కడ 375-500 వరకు మద్రసామ్రాజ్యం పాలనసాగింది. వీరిలో మొదటి పాలకుడు '''మహారాజా శక్తివర్మ'''.
 
ఈ జిల్లా తరువాత 5వ శతాబ్దంలో ''' విక్రమ వర్మ కాలంలో ''' విష్ణుకుండినుల హస్థగతం అయింది. విష్ణుకుండినుల సామ్రాజ్యం విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా వరకు విస్తరించింది. వశిష్ఠకుల పాలకులను '''ఇంద్రభట్టారకుడు''' ఓడించి విష్ణుకుండినుల సామ్రాజ్యం స్థాపించాడు. అయినా త్వరితంగా కళింగ సైన్యాల చేత ఓడింపబడ్డాడు. ఇంద్రభట్టారకుడు తరువాత మూడవ మాధవర్మ మరియు మంచన్న భట్టారక పాలన కొనసాగింది. వీరు తమ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలని ప్రయత్నించారు. ఈ వంశపు కడపటి చక్రవర్తి మూడవ మాధవర్మ.
 
తూర్పుగోదావరి జిల్లాలో అనేకమంది రాజవంశీయులు జమిందారులు ఉన్నారు. రాజపుత్రులు అయిన సూర్యవంశ రాజుల వారసులు ఈ జిల్లాలో 12వ శతాబ్దంలో ఇక్కడకు వలస వచ్చారు. ప్రముఖ జమిందారులు పెద్దాపురం, తుని, రామచంద్రపురం వాళ్ళు. ఇక్కడ జగపతులు అని బిరుద నామంతో పిలువబడుతున్న వత్సవై రాజులు కూడా ఉన్నారు.
 
=== చాళుక్యులు చోళులు ===
బాదామి చాళుక్యులకు చెందిన రెండవ పులకేశి మరియు ఆయన సోదరుడు విష్ణువర్ధనుడు పిష్టాపురాన్ని 7వ శతాబ్దంలో అధిపత్యం వహించాడు. కుబ్జ విష్ణు వర్ధనుడు స్థాపించిన తూర్పు చాళుక్య సామ్రాజ్యం మొదట పిష్టాపురాన్ని తరువాత వేంగి మరియు రాజమండ్రి వరకు పాలించాడు. అనేక రాజులు పాలించిన కారణంగా వారి వంశస్థుల పాలనా చరిత్ర వివాదాస్పదమౌతుంది. మొదటి చాళుక్య చక్రవర్తి బీమా దాక్షారామంలో శివాలయం ఆలయనిర్మాణం చేసాడు. 1973లో ఈ సామ్రాజ్యపు చక్రవర్తి అయిన ధనార్వుని పెదకల్లు(కర్నూలు జిల్లా) జాతచోడ భీమ చంపి వేంగిని ఆక్రమించుకున్నాడు. ధనార్వుడి ఇద్దరు కుమారులైన మొదటి శక్తివర్మ మరియు విమలవర్మ పారిపోయి మొదటి రాజరాజచోళుని సభలో ప్రవేశించి ఆయనను ఆశ్రయించాడు. రారాజ చోళుడు ధనార్వుని కుమారుల తరఫున వేంగి మీద దండెత్తి జాతచోడ భీమను చంపాడు. కల్యాణికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన సత్యరాయునికి వేంగి ప్రాంతం మీద చాళుక్యుల ఆధిపత్యం నచ్చలేదు. ఆ కారణంగా కారణంగా చోళులు మరియు చాళుక్యుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 175 ఎ డిలో ఏడవ విజయాఅదిత్యుడి మరణం తరువాత తూర్పు చాళుక్యసామ్రాజ్యం ముగింపుకు వచ్చింది.
 
ఏడవ విజయాదిత్యుడి శత్రువైన మొదటి కులోత్తుంగచోళుడు (రాజేంద్రచాళుక్యుడు) చోళుల తరఫున యుద్ధంచేసి చాళుక్య చోళుల సామ్రాజ్య స్థాపన చేసాడు. వేంగి రాజ్యం వెంట ఈ జిల్లా వారి సామ్రాజ్యంలో ఒక భాగం అయింది. జిల్లాలో అధిక భాగం చోళుల సామంతరాజైన వెలనాటి చోడుల ఆధిక్యతకు వశమైంది. చోళసామ్రాజ్యపు ప్రముఖ పాలకులు మొదటి గోయంకా, మొదటి రాజేంద్రచోడా, రెండవ గోయంకా మరియు రెండవ రాజేంద్రచోడ.
 
ఈ ప్రదేశాన్ని పడమటి చాళుక్యుడైన ఏడవ విక్రమచోడుడు ఆక్రమించుకుని కొంతకాలం ఆధిక్యత సాధించాడు. అయినా ఇది తిరిగి వెలనాటి చోడ మరియు చాళుక్యుల వశమైంది. తరువాత వెలనాటి చోడులు తిరుగుబాటుదారులైన కోణాకు చెందిన హైహయులు మరియు కాకతీయులకు చెందిన రెండవ గోయంకా మరియు రుద్రాలచేత అణచబడి వశపరచుకున్నారు.
 
=== కాకతీయులు ఢిల్లీ సుల్తానులు ===
ఈ ప్రాంతంలో లభించిన శిలాశాసనాలు 13వ శతాబ్ధపు శిలాశాసనంతో కలిసి ఈ ప్ర్రాంత చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. కాకతీయ చక్రవర్తి '''రెండవ ప్రోలా''' పశ్చిమ చాళుక్యుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి చాళుక్యచోళులకు ప్రతిధ్వంది అయ్యాడు. ఆయన కుమారుడు రుద్రా రెండవ చాళుక్యచోళుని నుండి గోదావరి డేల్టాను బహుమతిగా పొందాడు. గోదావరి డెల్టా మీద రుద్రా ఆధిపత్యాన్ని వెలనాడు చోడాలు ఎదిరించారు. చాళుక్య చోళ వెలనాటి రాజైన రెండవ రాజేంద్ర చోడా ఆయన మంత్రి దేవన ప్రగ్గడ సైన్యాధ్యక్షతలో రుద్రా మీదకు దండయాత్రకు పంపించాడు. రుద్రా ఆయన కనిష్ఠ సోదరుడు మహాదేవా దేవగిరి యాదవులతో జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత రాజ్యపాలన చేపట్టాడు. ఆయన కుమారుడు గణపతి కాకతీయ సింసానానికి తరువాత రాజయ్యాడు. గణపతి [[నెల్లూరు]] చోడుల సహాయంతో ఉత్తరంలోని కళింగ సైన్యాలను, మధురై పాండ్యులను మరియు చోళులను ఓడించాడు. గణపతి కామము ఆయన కుమార్తె రుద్రమదేవి కాలం అంతా గోదావరి ప్రదేశమంతా కాకతీయుల ఆధిపత్యం కొనసాగింది. 1295లో ప్రతాప రుద్రుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించినప్పటికీ ఢిల్లీ సుల్తానులతో అనేక పోరాటాలను ఎదుర్కొన్నాడు. 1323లో ఆయన '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' చేతిలో ఓడిపోయిన తరువాత ఈ జిల్లా ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యానికి చేరింది. '''ముహ్హమద్-బీన్-తుగ్లక్''' దక్షిణభారతదేశాన్ని అయిదు సంస్థానాలుగా విభజించి వాటికి గవర్నర్లను నియమించింది.
 
=== ముసునూరి నాయకర్లు, రెడ్లు మరియు ఇతర హిందూరాజులు ===
ఢిల్లీ సుల్తానులు ప్రాంతీయ ప్రముఖులైన ప్రొలయా మున్సూరి నాయకుల తెగల నిరంతర తిరుగుబాటును ఎదుర్కొన్నారు. అద్దంకి రెడ్లు, పిఠాపురం కొప్పుల తెలగాలు మరియు రాచకొండ రేచర్ల వెలములు ఆయనకు సహకరించారు. [[వరంగల్లు]] స్వాతంత్ర్యం సాధించిన సందర్భంలో తెలుగు వారు 50 సంవత్సరాల అనంతరం తెలుగు భూమికి లభించిన స్వాతంత్ర్యానికి ఆనందించారు. మునుసూరి కపయ నాయకా తన బంధువులు అయిన అన్వొత నాయకా మరియు ముమ్మడి నాయకా (కోరుకొండ)లను గోదావరీ ప్రదేశానికి గవర్నర్లుగా నియమించాడు. ముమ్మడి నాయకా కపయ నాయకా మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. 1388 వరకు ముమ్మడి నాయకా జీవించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు తరువాత 40 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించి కొండవీటి రెడ్లచేత అణిచివేయబడ్డారు. తరువాత కళింగరాజైన ఐదవ నరసింహదేవ ఈ ప్రదేశాన్ని జయించి పాలించాడు అయినా రాజమడ్రికి చెందిన అనవొత రెడ్డిచేత అది తిరిగిస్వాధీనపచుకోబడింది. ఆయన తరువాత అదే సామ్రాజ్యానికి చెందిన అనవేమరెడ్డి మరియు కుమరగిరి ఈ ప్రాంతాన్ని పాలించారు.
 
కుమరగిరి రాచకొండకు చెందిన రాచెర్లులు మరియు కళింగ రాజులతో అనేక యుద్ధాలు చేసాడు. ఆయన తన కుమారుడైన అనవోత వెంట సైన్యాధ్యక్షుడు కాటయ వేముని తూర్పు ప్రాంతాలను జయించడానికి పంపాడు. ఫలితంగా ఉత్తరంగా పలు ప్రాంతాలు సింహాచలం వరకు సామ్రాజ్యంలో చేరాయి. కొత్తగా లభించిన ప్రాంతం రెడ్డిరాజుల రాజ్యంలో చేరింది. అలాగే ఈ విభాగం ప్రత్యేకంగా తూర్పురాజ్యంగా పిలువబడింది. రాజకుమారుడు అనవోత రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన 1395 వరకు పాలించిన తరువాత చిన్న వయసులోనే మరణించాడు. తరువాత సైన్యాధ్యక్షుడు మరియు బావమరిది అయిన కాటయ వేమునికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాజమహేంద్రవరం లభించింది. కాటయ వేమను కొండవీటి సింహాసనం నుండి పెదకోమటి వేమ బలవంతంగా త్రోసి వేసిన తరువాత కాటయవేమ రాజమహేంద్రవరానికి వెళ్ళాడు.
పెదకోమటి వేమ కాటయ వేమను ఓడించబడిన తరువాత కాటయవేమకు ఎరువా సైన్యాధ్యక్షుడు అన్నదేవ చోడునితో యుద్ధం ఏర్పడింది. ఆయన రాజమహేంద్రవరం లోని చాలాభాగం ఆక్రమించుకోబడింది. ఎలాగైతేనే అతడు కాటయవేమతో తరమబడ్డాడు. కాటయవేమ అన్నదేవచోడునితో చేసిన ఒక యుద్ధంలో మరణించాడు. ఆయన మరణించిన తరువాత అల్లాడరెడ్డి కాతయవేమ కుమారుడిని రాజమహేంద్రవరం పాలకుడిగా చేసి తాను రాజప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. అల్లాడరెడ్డి 1423 లో తనకు మరణం సంభవించే వరకు ఈ ప్రాంతాన్ని పాలించాడు. 1443లో విజయనరం పాలకుడైన రెండవ దేవరాయ రాజు వీరభద్రుని ఓడించి ఈ రాజ్యాన్ని పాలించాడు.
 
కొండవీడులో పెదకోమటి వేమ తరువాత రాచవేమ సింహాసనాధిష్టుడయ్యాడు. ఆయన పాలన చాలా క్రూరంగా ఉండేది. ఒడిషా నుండి గజపతులు మరియు విజయనగర రాయలు దండెత్తినప్పుడు ఆయనకు ప్రజల నుండి కొంత సహాయం లభిస్తుండేది. కపిలేశ్వర గజపతి రెడ్డిరాజులను అణచివేసి రాజమహేంద్రవరాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు.
 
1470 కపిలేశ్వర గజపతి మరణించిన తరువాత ఆయన కుమారులైన హాంవీర మరియు పురుషోత్తమా మధ్య రాజ్యం కొరకు యుద్ధం చేసారు. బహ్మనీల సహాయంతో హంవీర రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు అయినా ఆయన ఎక్కువ కాలం నిలువ లేదు. పురుషోత్తమ హంవీరను త్రోసి రాజమహేంద్రవరం మిగిలిన ప్రదేశాలను తిరిగి జయించాడు. కాని మూడవ మహమ్మద్ షా ఆధ్వర్యంలో సైన్యాలు రాజమహేంద్రవరానికి వచ్చాయి. ఈ యుద్ధం చివరకు శాంతి ఒప్పందంతో ముగిసింది. మూడవ మహమ్మద్ షా మరణించిన తరువాత పురుషోత్తమ గజపతి గోదావరీ మరియు కృష్ణా పరీవాహక ప్రాంతమంతా దక్షిణంగా కొండవీటి వరకు బహ్మనీ సైన్యాలబ్ను పారద్రోలాడు. పురుషోత్తమా తరువాత ఆయన కుమారుడు ప్రతాపరుద్రా పాలనా పగ్గాలు చేపట్టాడు. విజయనగర సామ్రాజ్యాధినేతకృష్ణదేవరాయలు ఈ రాజ్యాన్ని లోబరుచుకుని తన సామంతరాజ్యం చేసుకున్నాడు. అయినా వారిరువురి నడుమ జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతాపరుద్రుని కుమార్తెను కృష్ణదేవరాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. అందుకు బదులుగా తాను జయించిన భూభాగాన్ని తిరిగి ఇచ్చాడు.
[[File:Tuni town view from Railway station.jpg|thumb|తుని]]
=== తరువాతి ముస్లిమ్ రాజులు ===
[[గోల్కొండ]] పాలకుడు '''కుతుబ్ షాహి''' రాజ్యంలో ఏర్పడిన అననుకూల పరిస్థితులను తనకూలంగా మలచుకుని '''సుల్తాన్ కులీ కుతుబ్ షాహి''' కోస్తా ప్రాంతం మీద దండయాత్రచేసి రాజమండ్రి మరియు దాని పరిసర రాజ్యాలను కైవశం చేసుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాహి హత్యచేయడిన తరువాత అతడి కుమారుడైన '''జమ్షిద్ కుతుబ్ షాహ్''' తరువాత ఆయన మనుమడు '''సుభాన్‌కుతుబ్‌షాహ్'''సింహాసనం అధిష్టించాడు. అతడి పాలనా కాలంలో ఇబ్రహీం షితాబ్‌ఖాన్ మరియు విద్యాధర్ల నుండి సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అబ్దుల్ హాసన్ తానాషా ఈ ప్రదేశానికి చివరి పాలకుడు అయ్యాడు. ఆయన 1672-1687 మధ్య పాలన సాగించాడు. ఈ కాలంలోనే ముఘల్ చక్రవర్తి [[ఔరంగజేబు]] దక్షిణ భారతదేశం అతడి ఆధిపత్యంలోకి చేరింది. 1687 గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు జయించి స్వాధీనం చేసుకున్నాడు. అలాగే గోదావరి జిల్లా కూడా అతడి ఆధీనంలోకి వచ్చింది. అతడి సమ్రాజ్యంలోని 22 విభాగాలలో గోదావరి కూడా ఒకటి అయింది. ఔరంగజేబు ఈ సంస్థానాలను పాలించడానికి వైశ్రాయిని నియమించాడు. గోల్కొండ వైస్రాయ్ '''నిజామ్-ఉల్-ముల్క్''' ఈ ప్రదేశాన్ని ఫౌజ్‌దార్లు అనబడే సైనికాధికారుల నిర్వహణలో పాలించాడు. ముఘల్ చక్రవర్తి '''ఫర్రుక్‌సియార్''' దక్కన్ విభాగాన్ని పాలించడానికి నిజామ్- ఉల్ - ముల్క్ గా '''అసఫ్‌జాహ్‌'''ను నియమించాడు. '''ముహామ్మద్ షాహ్''' సమయంలో అసఫ్‌షాహ్ స్థానంలో '''హుస్సేన్ అలి ఖాన్ ''' ఖాన్ నియమించబడ్డాడు. 1724లో అసఫ్‌జాహ్ దక్కన్ మీద దాడి చేసి '''ముబరిజ్‌ఖాన్'''ను ఓడించి చంపి దక్కన్ ప్రాంతాన్ని [[హైదరాబాద్]] నిజాముగా చేసి పాలించాడు. ఈ యుద్ధం షకర్‌ఖేరా అని పిలువబడింది.
 
1748లో '''నిజామ్ ఉల్ ముల్క్''' మరణానంతరం ఆయన కుమారుడు నాసిర్‌జంగ్ మరియు మనుమడు ముజాఫర్‌జంగ్ మధ్య సింహాసనం కొరకు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ చెరి ఒక వైపు చేరారు. ఫ్రెంచ్ జనరల్ '''బుస్సీ ''' సహాయంతో '''సలాబత్ జంగ్''' ప్రవేశించి ఈ వివాదాలకు ముగింపు పలికాడు. ఎలాగైతేనే జనరల్ బుస్సీ దక్షిణదేశానికి లల్లీతో ఒక ఆదేశం పంపాడు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రెంచ్ భారతదేశంపఇ ఆధిక్యత సాధించాడు. అయన పోయిన కొద్ది కాలంలోనే విజయనగర రాజు పసుపతి ఆనందగజపతి రాజా ఆంగ్లేయులకు '''నార్తెన్ సిర్కార్స్''' (ప్రస్తుత ఆమ్ఢ్రప్రదేశ్ మరియు ఒడిషా) ను ఆక్రమించుకొనమని ఆహ్వానం పంపాడు. ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల మధ్య చెలరేగిన ఈ కలహాలు చివరకు ఫ్రెంచ్ '''నార్తెన్ సిర్కార్స్''' ఆధిపత్యం వదులుకొనడంతో ముగిసాయి. చివరిగా ఫ్రెంచ్ ఆధిపత్యం వదులుకుంటూ తమ దక్కన్ ఆధిక్యానికి గుత్రుగా [[యానాం]]ను మాత్రమే తమ స్వాధీనంలో మిగుల్చుకొన్నది. ఫ్రెంచి వారు 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకూ యానాన్ని తమ ఆధీనంలో ఉంది.
 
సలాబాత్ జంగ్ అతడి సోదరుడైన '''నిజామ్ అలి ఖాన్''' చేత తొలగించబడ్డాడు. తరువాత నిజామ్ అలి ఖాన్ రాజమండ్రి మరియు చికాకోల్(ప్రస్తుతం శ్రీకాఆకుళం) లను హాసన్ అలి ఖాన్‌కు లిజ్‌కు ఇచ్చాడు. 1765 ఆగస్టులో ముఘల్ చక్రవర్తి '''షాహ్ అలామ్''' తో చర్చలు జరిపి ఫలితంగా నార్తన్ సిర్కార్స్‌ మీద ఆధిపత్యాన్ని ''' బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ '''' కొరకు సాధించాడు. అయినా 1766 మార్చి వరకు ఇది రహస్యంగా ఉంచబడింది. కొండపల్లి కోటను ఆక్రమించిన బ్రిటిష్ ప్రభుత్వం అవసర సమయాలలో సైన్యాలను నడిపించడానికి '''జనరల్ సిల్లౌడ్ '''ను మచిలీపట్నానికి పంపింది. నిజామ్ కూడా చురుకుగా యుద్ధప్రయత్నాలను చేపట్టింది. కాని 1766 నవంబరు 12 న జరిగిన ఒప్పందం కారణంగా యుద్ధం ఆగిపోయింది. ఫలితంగా ఆక్రమిత నార్తెన్ సిర్కార్ తిరిగి నిజామ్ ఆధీనంలోకి వచ్చింది.
 
ఈ జిల్లా బ్రిటిష్ అధీనంలోకి వచ్చే ముందు జమిందారుల ప్రాముఖ్యత అధికంగా ఉండేది. జమీందారులైన రంప, తోటపల్లి, జమ్మిచావడి, జద్దంగి, పెద్దాపురం, పిఠాపురం, కోట మరియు రామచంద్రపురం మొదలైనవిీ ప్రదేశంలో ప్రధానమైనవి.
[[File:Rail-Road bridge Godavari.JPG|thumb|గోదావరి రైలు వంతెన]]
 
=== బ్రిటిష్ పాలకులు ===
1778 మార్చి ఒకటిన జరిగిన రెండవ ఒప్పందంలో నిజామ్ ప్రభుత్వం షాహ్ ఆలమ్ చేత ఇవ్వబడిన అధికారాన్ని తెలుసుకుంది. బదులుగా సంవత్సారానికి 50,000లను తీసుకోవడానికి స్నేహపూరిత ఒప్పందం జరిగింది. 1823 నాటికి నార్తెన్ సిర్కార్ మీద అధికారం నిజామ్ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి మారింది. నార్తెన్ సిర్కార్ మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక భాగం అయింది. అందులో తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి ఒక ప్రత్యేక కలసి విభాగం అయింది.
 
=== 1947 భారతదేశ స్వాతంత్రం అనంతరం - ప్రస్తుతం ===
1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా అవతరించింది. 1953లో ఉత్తర జిల్లాలు గోదావరి జిల్లాలతో చేర్చి ఆంధ్ర ప్రదేశ్ పేరుతో కొత్త రాష్ట్రంగా అవతరించింది. 1954లో యానాం నుండి ఫ్రెంచి వారు నిష్క్రమిస్తూ దానిని ప్రత్యేకంగా [[పుదుచ్చేరి|పాండిచేరి]] రాష్ట్రంలోని ఒక భాగంగా ఉండాలని ఒప్పందం చేసుకున్నారు.
 
== భౌగోళిక స్వరూపం ==
[[File:CanalRoad.jpg|thumb|కాలువ గట్లు]]
[[File:View of Banana plants at Ryali village in East Godavari district.jpg|thumb|కోనసీమలో అరటి పొలాలు]]
[[దస్త్రం:Konaseema-1.jpg|right|thumb|కోనసీమ పొలాలు]]
[[File:Kon2.jpg|thumb|కోనసీమ పొలాలు]]
తూర్పుగోదావరి జిల్లా వైశాల్యం 10,807 చదరపు కిలోమీటర్లు ఉంటుంది(4,173 మైళ్ళు). ఇది వైశాల్యంలో ఇండోనేషియా యొక్క ద్వీపంతో సమానం. ఈ జిల్లా పశ్చిమాన కొండాకోనలతో నిండి ఉటుంది. అలాగే తూర్పున మైదానాలతో నిండి ఉంటుంది. ఈ జిల్లాకు తూర్పున బంగాళాఖాతం ఉటుంది. ఈ జిల్లా కేంద్రమైన [[కాకినాడ]] సముద్రతీరాన ఉపస్థితమై ఉంది.
 
తూర్పు గోదావరి జిల్లాకు ఉత్తరాన [[విశాఖపట్నం]] జిల్లా, [[ఒడిషా]] రాష్ట్రము, తూర్పున, దక్షిణాన [[బంగాళా ఖాతము]], పశ్చిమాన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, వాయవ్యాన [[ఖమ్మం]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా జిల్లాను మూడు ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. అవి: డెల్టా, మెట్ట ప్రాంతం, కొండ ప్రాంతాలు. వివిధ ప్రాంతాల ఎత్తులు సముద్ర మట్టం నుండి 300 మీ.ల వరకు ఉన్నాయి.
 
డెల్టా ప్రాంతంలో [[కోనసీమ]], [[కాకినాడ]]లోని ప్రాంతాలు, పూర్వపు [[రామచంద్రపురం]], [[రాజమండ్రి]] తాలూకాలు ఉన్నాయి. ఈ ప్రాంతం [[వరి]] పొలాలతో, [[అరటి]], [[కొబ్బరి]], [[తమలపాకు]] తోటలతో, లెక్కలేనన్ని [[తాటి|తాడి చెట్ల]]తో కళకళ లాడుతూ ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఇసుకతో కూడిన మట్టి నేలలు డెల్టా ప్రాంతంలో కనిపిస్తాయి.
 
[[మండపేట]], [[తుని]], [[పిఠాపురం]], [[పెద్దాపురం]], [[కాకినాడ]], [[రామచంద్రాపురం]] మరియు [[రాజమండ్రి]]లలో కొన్ని ప్రాంతాలను మెట్ట ప్రాంతాలుగా పిలుస్తారు.<!-- Red loamy soil in upland and hill tracts of the district. --> [[తూర్పు కనుమలు]] సముద్ర మట్టం నుండి అంచెలంచెలుగా లేస్తూ, పూర్వపు మన్యం తాలూకాలైన [[రంపచోడవరం]], ఎల్లవరం అంతటా వ్యాపించాయి. [[గోదావరి]], పంపా, [[తాండవ నది|తాండవ]] మరియు ఏలేరులు జిల్లాలో ప్రవహిస్తున్న ప్రముఖ నదులు. పెద్దాపురం సంస్థానం ప్రసిద్ధికెక్కింది.
=== వాతావరణం ===
ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు మరియు నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ జిల్లా పశ్చిమ కొండ ప్రాంతాలలో సుమారు 140 సెంటిమీటర్లు మరియు ఉత్తర కోస్తా ప్రాంతంలో సరాసరి వర్షపాతం 100 సెంటిమీటర్లు ఉంటుంది.
ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.
 
== ఆర్ధిక స్థితి గతులు ==
[[File:Hindu Pilgrimage sites map of Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు.]]
[[File:View from Talupulamma Temple.jpg|thumb|తలుపులమ్మ లోవ, తుని]]
[[దస్త్రం:Dowleswaram barrage.JPG| right|thumb|[[ధవళేశ్వరం]] బేరేజి]]
గోదావరి డెల్టాలో అధికభాగం ఈ జిల్లాలోనే ఉన్నందున వ్యవసాయం మరియు నీటిసంబంధిత వృత్తులు(అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలో రెండు ఎరువుల కర్మాగారాలు, సహజ వాయువుతో తయారయ్యే విద్యుత్ వుత్పత్తి కేంద్రాలు మరియు చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు మరియు సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది.
 
=== వనరులు ===
తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయం ప్రధానంగా వున్న జిల్లా. అలాగే తూర్పు గోదావరి సంపన్నభరితమైన జిల్లా కూడా. రాష్ట్రంలో సంపన్నతలో మొదటి స్థానంలోనూ దేశంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది దేశంలో సమృద్ధిగా సహజ వాయువు మరియు చమురు నిలువలు విస్తారంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో చమురు మరియు సహజవాయువు నిల్వలు ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నట్లు భావించబడుతుంది.
 
=== జీవనప్రమాణం ===
2007-2008 జనాభాగణాంకాలను అనుసరించి '''అంతర్జాతీయ జనసంఖ్యా శాస్త్రశిక్షణాలయం'''(ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ) జిల్లా మొత్తంలో 38 గ్రామాలలో 1019 మంది అభిప్రాయాలను సేకరించింది. వారి పరిశోధనలో 92.5% ప్రజలు విద్యుత్తు వసతిని, 96.7% ప్రజలు మంచినీటి వసతిని, 50.4% ప్రజలు మరుగుదొడ్ల వసతిని మరియు 30.9% పక్కా గృహాల వసతి కలిగి ఉన్నట్లు తేలింది. 28.6 మంది యువతులు చట్టపరమైన 18 సంవత్సరాలకంటే ముందే వివాహం చేసుకున్నారు.
 
శెట్టబలిజ, కాపులు, రెడ్డి, కమ్మ, కొండా రెడ్డిలు అధికంగా ఉన్నఈ జిల్లాలో ఇంకా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. రాచపల్లి వంటి మెట్ట ప్రాంతాల్లో ఇంకా క్షత్రియ రాజుల జమీందారీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ జిల్లా వాసులకు ఎక్కువగా [[పశ్చిమ గోదావరి జిల్లా]] వాసులతో వివాహ సంబంధాలుంటాయి. ఈ జిల్లాలో [[రాజమండ్రి]], [[కాకినాడ]] వంటి పట్టణాలలో కొద్దిగా ఆధునికత కనిపించినా మిగిలిన మండలాల్లో చాలావరకూ గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోలిస్తే ఈ జిల్లాలో ఉన్న మహిళల్లో అక్షరాస్యత తక్కువ, ఎక్కువశాతం ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండగానే వివాహాలు జరుగుతాయి. బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతూవుంటాయి. యువతులు, స్త్రీలు ఒంటరిగా బయట తిరగడం అంతగా కనిపించరు. [[సంక్రాంతి]], [[ఉగాది]], [[వినాయక చవితి]], [[క్రిస్టమస్]] మరియూ గ్రామీణ పండుగలు వైభవంగా జరుపుకుంటారు గట్టిగా
 
== పాలనా వ్వవస్ధ. ==
 
=== జిల్లాలో రెవెన్యూ డివిజన్లు. ===
1.[[కాకినాడ]] 2.[[పెద్దాపురం]] 3.[[అమలాపురం]] 4.[[రాజమండ్రి]] 5.[[రంపచోడవరం]],6.[[రామచంద్రపురం]] 7.[[ఏటపాక|ఎటపాక.]]
 
=== జిల్లాలో నగర పాలక వ్యవస్థలు ===
 
=== 1.[[కాకినాడ (పట్టణ)]] 2. [[రాజమండ్రి (పట్టణ)]]. ===
 
=== జిల్లాలో పురపాలక వ్యవస్థలు ===
తూర్పు గోదావరి జిల్లాలో 8 పురపాలక వ్యవస్థలు ఉన్నాయి.
# [[అమలాపురం]]
# [[మండపేట]]
# [[పెద్దాపురం]]
# [[పిఠాపురం]]
# [[రామచంద్రపురం]]
# [[సామర్లకోట]]
# [[తుని]]
 
=== జిల్లాలో మండలాలు ===
పూర్వపు తాలూకాలు 19
[[మండలాలు]] 64 (62 గ్రామీణ + 2 పట్టణ)
మండల ప్రజా పరిషత్తులు 57
పంచాయితీలు 1,012
[[మునిసిపాలిటీలు]], కార్పొరేషనులు 9
పట్టణాలు 14
[[గ్రామాలు]] 1379
 
భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లాను 57 రెవిన్యూ మండలాలుగా విభజించారు<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0204000000&ptype=B&button1=Submit తూర్పు గోదావరి జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 26, 2007న సేకరించారు.</ref>. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 59 మండలాలు ఉన్నాయి.జివో నంబరు 31 ద్వారా [[రౌతులపూడి]] అనే కొత్త మండలాన్ని 44 గ్రామాలతో ఏర్పరచారు. [[శంఖవరం]] నుండి 12 గ్రామాలు, [[కోటనందూరు]] నుండి 31 గ్రామాలు, [[తుని]] నుండి ఒక గ్రామాన్ని విడదీసి ఈకొత్త మండలాన్ని ఏర్పరచారు. దీనితో మొత్తం 60 మండలాలు అయ్యాయి. [[జగ్గంపేట]], [[ముమ్మిడివరం]] గ్రామ పంచాయతీలను మున్సిపాల్టీలు గానూ, గొల్లప్రోలు, కొత్తపేట, ఏలేశ్వరం, రావులపాలెం, రాజోలు, అనపర్తి గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చబోతున్నారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం (రామాలయమున్న భద్రాచలం రెవెను గ్రామం మినహా), [[చింతూరు]], [[వరరామచంద్రపురం]], [[కూనవరం]] అనే 4 మండలాలు ఈ జిల్లాలో కలిసినవి. మొదట్లో ఈ 4 ముంపుమండలాలను [[రంపచోడవరం]] రెవెన్యు మండలంలో ఉంచినప్పటికీ, 2015లో ఎటపాక రెవెన్యు మండలం ఏర్పాటుచేయబడి, అందులోకి మార్చబడ్డాయి. ఈ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని రెవెన్యు మండలాల సంఖ్య 7కి పెరిగింది. ఏపీలో విలీనం చేసిన [[భద్రాచలం]] రూరల్ మండలాన్ని [[నెల్లిపాక]] మండల కేంద్రంగా చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగానే కాక రెవెన్యూ మండలంగా మార్చబడటంతో, ఇక నెల్లిపాక మండలానికి బదులుగా ఎటపాక మండలంగా గుర్తించబడటం జరిగింది.
 
{|
|rowspan=22 valign="center"|[[File:East Godavari district Montage.png|265px]][[దస్త్రం:Eastgodavari.jpg|265px|తూర్పు గోదావరి జిల్లా మండలాలు]]
 
|-
!సంఖ్య !!పేరు!! సంఖ్య !!పేరు!! సంఖ్య !!పేరు !! సంఖ్య !!పేరు
|-
|1 ||[[మారేడుమిల్లి]] ||21 ||[[పిఠాపురం]] ||41 ||[[కపిలేశ్వరపురం]] ||61 ||[[చింతూరు]]
|-
|2 ||[[వై.రామవరం]] ||22 ||[[కొత్తపల్లె,తూర్పుగోదావరి|కొత్తపల్లె]] ||42 ||[[ఆలమూరు(తూర్పుగోదావరిజిల్లా మండలం)|ఆలమూరు]] ||62 ||[[వరరామచంద్రపురం]]
|-
|3 ||[[అడ్డతీగల]] ||23 ||[[కాకినాడ(గ్రామీణ)|కాకినాడ (గ్రామీణ)]] ||43 ||[[ఆత్రేయపురం]] ||||
|-
|4 ||[[రాజవొమ్మంగి]] ||24 ||[[మండపేట|మండపేట (గ్రామీణ)]] ||44 ||[[రావులపాలెం]] ||||
|-
|5 ||[[కోటనందూరు]] ||25 ||[[సామర్లకోట]] ||45 ||[[పామర్రు (తూ.గో జిల్లా)|పామఱ్ఱు]] ||||
|-
|6 ||[[తుని]] ||26 ||[[రంగంపేట]] ||46 ||[[కొత్తపేట (తూర్పు గోదావరి జిల్లా)|కొత్తపేట]]
|-
|7 ||[[తొండంగి]] ||27 ||[[గండేపల్లి]] ||47 ||[[పి.గన్నవరం]]
|-
|8 ||[[గొల్లప్రోలు]] ||28 ||[[రాజానగరం]]||48 ||[[అంబాజీపేట]]
|-
|9 ||[[శంఖవరం]] ||29 ||[[రాజమండ్రి (గ్రామీణ)]] ||49 ||[[ఐనవిల్లి]]
|-
|10 ||[[ప్రత్తిపాడు (తూ.గో జిల్లా)|ప్రత్తిపాడు]] ||30 ||[[రౌతులపూడి]] ||50 ||[[ముమ్మిడివరం]]
|-
|11 ||[[ఏలేశ్వరం]] ||31 ||[[కడియం]] ||51 ||[[ఐ.పోలవరం]]
|-
|12 ||[[గంగవరం]] ||32 ||[[సఖినేటిపల్లి]] ||52 ||[[కాట్రేనికోన]]
|-
|13 ||[[రంపచోడవరం]] ||33 ||[[అనపర్తి]] ||53 ||[[ఉప్పలగుప్తం]]
|-
|14 ||[[దేవీపట్నం]] ||34 ||[[బిక్కవోలు]] ||54 ||[[అమలాపురం]]
|-
|15 ||[[సీతానగరం]] ||35 ||[[పెదపూడి]] ||55 ||[[అల్లవరం]]
|-
|16 ||[[కోరుకొండ]] ||36 ||[[కరప]] ||56 ||[[మామిడికుదురు]]
|-
|17 ||[[గోకవరం]] ||37 ||[[తాళ్ళరేవు]] ||57 ||[[రాజోలు]]
|-
|18 ||[[జగ్గంపేట]] ||38 ||[[కాజులూరు]] ||58 ||[[మలికిపురం]]
|-
|19 ||[[కిర్లంపూడి]] ||39 ||[[రామచంద్రాపురం]] ||59 ||[[ఎటపాక మండలం|ఎటపాక]]
|-
|20 ||[[పెద్దాపురం]] ||40 ||[[రాయవరం]] ||60 ||[[కూనవరం]]
|}
 
[[తెలంగాణా]] రాష్ట్ర విభజన తర్వాత Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2014 ప్రకారం తెలంగాణాలో [[ఖమ్మం జిల్లా]]కు చెందిన [[చింతూరు]] మండలం, [[వరరామచంద్రపురం]] మండలం, [[కూనవరం]] మండలం, [[భద్రాచలం]] మండలం లోని గ్రామాలు (భద్రాచలం పట్టణం తప్ప) - తూర్పుగోదావరి జిల్లాలో కలిశాయి <ref>http://www.prsindia.org/uploads/media/Telangana/AP%20Reorganisation%20%28A%29%20Bill,%202014.pdf</ref>
 
== రవాణా వ్వవస్థ ==
తూర్పు గోదావరి జిల్లా దేశం నలుమూలలకు రహదారి మరియు రైలు మార్గాలతో అనుసంధానించబడి ఉంది. [[చెన్నై]], [[కలకత్తా|కోల్‌కతా]] లను కలిపే జాతీయ రహదారి, రైల్వే లైనులు జిల్లా గుండా పోతున్నాయి. రాజమండ్రి కొవ్వూరును అనుసంధానిస్తూ అతి పెద్ద రహదారి మరియు రైలు వంతెన ఉన్నది . [[రాజమహేంద్రవరం]]కి 15 కి.మీ.ల దూరంలో ఉన్న [[మధురపూడి]] వద్ద ఒక విమానాశ్రయము ఉంటుంది. ఇది [[కాకినాడ]]కు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. [[రాజమండ్రి]] నుండి [[హైదరాబాదు]], [[చెన్నై]], [[విజయవాడ]] మొదలైన నగరాలకు వరకు ప్రతి రోజు రైలు సేవలు ఉన్నాయి. విశాఖపట్టణం విమానౌకాశ్రయం తరువాత స్థానంలో ఉన్న నౌకాశ్రయం ఈ జిల్లా కేంద్రమైన కాకినాడలో ఉంది.
 
== జనాభా లెక్కలు ==
2011 జనాభాగణాంకాలను అనుసరించి తూర్పు గోదావరి జిల్లా జనసంఖ్య 5,151,549. ఇది సంయుక్త అరబ్ ఎమిరేట్‌కు జనసంఖ్యకు 5,148,664 సమానం లేక కొలరాడో రాష్ట్ర జనాభాకు సమానం. భారతదేశంలో జనసంఖ్యలో తూర్పు గోదావరి జిల్లా 19వ స్థానంలో ఉంది. అలాగే రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. జిల్లా జనసాంద్రత 1 కిలోమీటరుకు 477. జిల్లా వైశాల్యం (1,240 చదరపు మైళ్ళు). 2001-2011 వరకు జనసాంద్రత పెరుగుదల శాతం 5.1%. జిల్లా అక్షరాస్యత 71.35%. [[2001]]లో అక్షరాస్యత 65.48%. స్త్రీ:పురుషుల నిష్పత్తి 1005:1000. 2001లో స్త్రీ:పురుషుల నిష్పత్తి 993:1000. స్త్రీల అక్షరాస్యత 74.91%. పురుషుల అక్షరాస్యత 67.82%. జాతీయ స్త్రీ :పురుష నిష్పత్తి 994:1000.
 
2001లో 6 సంవత్సరాలకంటే చిన్న పిల్లల సంఖ్య 613,490. 2011 లో 6 సంవత్సరాల సంఖ్య 492,446. మొత్తం 492,446 పిల్లలలో ఆడ పిల్లల సంఖ్య
250,086, మగ పిల్లల సంఖ్య 242,360. 2001లో ఆడపిల్లమగపిల్లల నిష్పత్తి 978:1000. 2011లో ఆడపిల్లమగపిల్లల నిష్పత్తి 969:1000. 2011లో 6 సంవత్సరాల పిల్లలు 9.56%. 2001లో 6 సంవత్సరాల పిల్లలు 12.52%.
 
'''0-6 ఏళ్ళ మధ్య వయసు గల పిల్లల జనాభా '''
{| border="1" cellpadding="1" width=500 align=center
!
!మొత్తం
!పురుషులు
!స్త్రీలు
!నిష్పత్తి
|- align=right
|గ్రామీణ: || 456003 || 231005 || 224998 || 97.4%
|- align=right
|పట్టణ: || 121418 || 60911 || 60507 || 99.3%
|- align=right
|మొత్తం: || 577421 || 291916 || 285505 || 97.8%
|}
 
== పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణలు==
{{main|తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు}}
జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 34 లక్షల మంది పైచిలుకు, 2016లో కోటీ 28 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.<ref>[http://web.archive.org/save/http://apfootfall.viswagnan.com/web/ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)</ref> జిల్లా 2016, 17 సంవత్సరాల్లో అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన జిల్లాల్లో 5వ స్థానం పొందింది.
 
# [[అంతర్వేది]]
# [[అన్నవరం]]
# [[ద్రాక్షారామం]]
# పవనగిరి గృప్ ఆఫ్ టె౦పుల్స్ ([[అడ్డతీగల]])
# [[ద్వారపూడి]]
# [[తలుపులమ్మ లోవ]]
# [[సామర్లకోట]]
# [[పిఠాపురం]]
# [[పాపి కొండలు]]
# పింజరికొండ జలపాతం అడ్డతీగల
 
== క్రీడలు ==
ఆంధ్ర ప్రదేశ్ లో చాలా వరక్కు ఆటలను మనం గమనించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ "కబాడీ". తూర్పుగొదావరి జిల్లా యొక్క క్రీడ "కో-కో".
 
== ప్రముఖవ్యక్తులు==
* [[కందుకూరి వీరేశలింగం పంతులు]]
* [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]]
* [[గంటి మోహనచంద్ర బాలయోగి]]
* [[బోయి భీమన్న]]
==ఇవి కూడా చూడండి==
* [[తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు]]
 
== బయటి లింకులు ==
{{commons category|East Godavari district}}
* [http://www.eastgodavari.nic.in తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్ సైటు]
* [http://www.aponline.gov.in/Quick%20links/apfactfile/info%20on%20districts/eastgodavari.html ఏపీ ఆన్‌లైన్‌లో తూర్పు గోదావరి గురించి]
* [http://eenadu.net/district/inner.aspx?dsname=Eastgodavari&info=eaghistory ఈనాడు జాలస్థలిలో జిల్లావివరాలు]
 
== మూలాలు ==
<references />
{{ఆంధ్ర ప్రదేశ్}}
{{గోదావరి పరీవాహకం}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు]]
[[వర్గం:కోస్తా]]