కాణిపాకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 128:
ఈ పుణ్యక్షేత్రం [[చెయ్యేరు|బాహుధా]] నది ఉత్తరపు ఒడ్డున, [[తిరుపతి]]-[[బెంగళూరు]] [[జాతీయ రహదారి]]పై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ [[జనమేజయుడు]] కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.<ref>[http://books.google.com/books?id=pmEUAAAAYAAJ&pg=PA155&lpg=PA155&dq=kanipakkam#v=onepage&q=kanipakkam&f=false Lists of the antiquarian remains in the presidency of Madras]</ref> ఈ [[ఆలయం]]<nowiki/>లోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది.
==పేరు వెనుక చరిత్ర==
''కాణి'' అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, ''పారకం'' అంటే [[నీళ్లు]] పొలంలోకి పారటం అని అర్ధం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు [[మూగ]] మరొకరికి [[చెవుడు]]. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ''ఏతాం''లతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి [[రక్తం]] కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన [[స్వయంభువుడు]] అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ [[కొబ్బరి]] నీరు ఒక [[ఎకరం]] పావు దూరం చిన్న [[కాలువ]]<nowiki/>లా ప్రవహించింది. దీన్ని ''కాణిపరకం'' అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను ''కాణిపాకం''గా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి [[విగ్రహము|విగ్రహం]] నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క [[బావి]] కూడా వున్నది దానిలో స్వామి వారి [[వాహనము]] [[ఎలుక]] ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
 
==గణాంకాలు==
*జనాభా (2011) - మొత్తం 4,960 - పురుషుల 2,500 - స్త్రీల 2,460- గృహాల సంఖ్య 1,267
"https://te.wikipedia.org/wiki/కాణిపాకం" నుండి వెలికితీశారు