కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 47:
== యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం ==
[[దస్త్రం:KVK Ramarao-1.jpg|thumb|377x377px|నందమూరి తారక రామారావు నరసరావుపేట పట్టణం వచ్చిన సందర్బంగా ఈనాడు విలేఖరిగా కెవికె రామారావు]]
ఇంటర్మీడియట్ [[నరసరావుపేట]] పట్టణంలోని యస్.యస్.యన్.కళాశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఆటల వైపు మొగ్గు చూపాడు.ఇంతలో ఇతని తండ్రి వెంకటరత్తయ్య ఉద్యోగరీత్యా చీరాల బదిలీ అయినందున, చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చదివిన సమయంలోను అదే ఆటలనందు ఆసక్తి కొనసాగించాడు.కళాశాలలో రెండు సంవత్సరాలు క్రికెట్ టీము కెప్టెన్ గా వ్యవరించాడు.మరో వైపు నాటకాల నందు ఆసక్తి పెంపొందించుకొని, డైరెక్షన్ పరంగా నడక సాగించాడు.ఆంధ్రా యూనివర్శిటీ నుండి లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందాడు.
 
== ఉద్యోగ ఆరంగేట్రం ==
[[దస్త్రం:KVK Ramarao-4.jpg|thumb|260x260px|ఉత్తమ విలేఖరి అవార్డు అందుకున్న సందర్బంగా ఈనాడు అధినేత రామోజీరావుతో కెవికె రామారావు]]
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తాను [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరాడు. ప్రధాన వృత్తిలోకి చేరినా ఇతనికి ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,[[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అంతంతమాత్రంగా జరిగేవి. ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు పనిచేసేవాడు. అతను కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవాడు.సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని అతనుకున్న నమ్మంకంతో ఒప్పు కునేవాడు కాదు.అతనికి ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు. అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి, అతనిలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటిక పోటీలను 12 సంవత్సరాలు వరుసగా రామారావు ఆధ్వర్యంలో జరిగాయి.[[కళాశాల]]<nowiki/>లోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు దాదావు ఇతని కృషితోనే జరిగాయి.గోవాలో జరిగిన ఆల్ ఇండియా గ్రంధాలయాధికారులు కాన్ఫెరెన్స్ సందర్బంగా గ్రంధాలయాల నిర్మాణానికి కేంధ్ర ప్రభుత్వ గ్రాంటును ఇస్తున్నట్టు తెలుసుకుని,డిల్లీ వెళ్ళి 4,65000/- తీసుకువచ్చి 1979లో గ్రంధాలయ నిర్మాణం చేసిన ఘనత రామారావుదే.
 
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/కె.వి.కె.రామారావు" నుండి వెలికితీశారు