రాష్ట్ర రాజధానిని ఆవరించి ఉండటంతో ఈ జిల్లాలో పలు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పబడియున్నాయి. జిల్లాలోని ఉన్నత విద్యాసంస్థలలో అధికభాగం హైదరాబాదు సమీపంలో ఉన్న మండలాలలో కేంద్రీకరించబడి ఉన్నాయి. గచ్చిబౌలీలో [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]], రాజేంద్రనగర్లో [[ఎన్జీప్రొఫెసరు రంగాజయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం]], కూకట్పల్లిలో జె.ఎన్.టి.యు కళాశాల, బాచుపల్లిలో ఇంజనీరింగ్ మరియు, టెక్నాలజీ పరిశోధన సంస్థ, ఆదిభట్లలో గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల, చిలుకూరులో హైపాయింట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల, గండిపేట్లో హైటెక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల, దుండిగల్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ, కోకాపేట్లో మహాత్మాగాంధీ టెక్నాలజీ సంస్థ, గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, చేవెళ్ళలో ఇంద్రారెడ్డి స్మారక ఇంజనీరింగ్ కళాశాల, కొండాపూర్లో సంస్కృతి ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ, నాగర్గుల్లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, శేరిగూడలో శ్రీదత్తా ఇంజనీరింగ్ & సైన్స్ కళాశాల, బోగారంలో తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, కాచారంలో వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాల, కనకమామిడీలో కె.ఎస్.రాజు టెక్నాలజీ& సైన్స్ కళాశాల, ఎంకేపల్లిలో భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా 2459 ప్రాథమిక, 882 మాధ్యమిక, 1235 ఉన్నత పాఠశాలలు, 258 జూనియర్ కళాశాలలు, 73 డీగ్రీ కళాశాలలు ఉన్నాయి.