మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
ముఖ్యంగా శూద్రులు, మహిళల పట్ల వివక్ష పూరిత వాక్యాలు ఎవరో ఉద్దేశ పూర్వకంగా ఈ గ్రంథంలోకి చొప్పించి ప్రచురించారని చరిత్రకారులు, పండితులు నిర్ధారించారు. విలియం జోన్స్ అనువదించిన మనుధర్మ శాస్త్రం ద్వారా దేశాన్ని పరిపాలిస్తున్న అప్పటి బ్రిటీషు వారు హిందూ చట్టాన్ని రూపొందించారు. ఇది సామాన్య శకం పూర్వం 2వ శతాబ్దం నుండి, సామాన్య శకం ౩వ శతాబ్దం మధ్య కాలంలో రచించబడి ఉంటుందని అంచనా.  
 
ఆదిమానవుడు మనువు, అతను మానవాళికి ఇచ్చిన చట్టాన్ని మనుస్మృతిగా పేర్కొంటారు. ఈనాడు 80 శాతం హిందువులకు మనుధర్మ శాస్త్రం అందుబాటులో లేదని ఒక అంచనా. "అందరం పరమాత్మ అంశలమే, ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు" అనే భగవద్గీత, ఉపనిషత్తుల మూల సిద్ధాంతాలకి విరుద్ధంగా వుండటంతో, మనుస్మృతి బ్రిటీషు వారి హయాంలో జరిగిన ఒక కుట్రపూరిత ప్రణాళికగా ప్రస్తావించబడింది. అసలైన మనుధర్మ శాస్త్రం యొక్క ఆనవాళ్ళు ఈనాడు దాదాపుగా లేవు. ప్రతీ సంవత్సరం డిశంబరు 25న కొన్ని దళిత సంఘాలు, మహిళా సంఘాలు "మనుస్మృతి దహనం" పేరిట ప్రస్తుతం అందుబాటులో వున్న కాపీలని నిరసనా కార్యక్రమాలతో కాల్చి వేస్తున్నాయి.
 
== కొన్ని ముఖ్యమైన విషయాలు==
*మనువు నోటినుండి బ్రాహ్మణులు, భుజమునుండి క్షత్రియులు, తోడలనుండి వైష్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించారు.
*బ్రాహ్మణులను వేద పండితులు మరియు గురువులుగా, క్షత్రియులు పరిపాలకులుగా, వైశ్యులు వ్యాపారులు మరియు వ్యవసాయదారులుగా, శూద్రులు సేవకులుగా ఆశీర్వదించాడు మనువు.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే వేదాలు చదవడానికి, యజ్ఞోపవేతమును ధరించడానికి అర్హులు.
*స్త్రీల పేర్లు పలుకడానికి తేలికగా, చక్కటి అర్ధం వచ్చేలా ఉండాలి.
*8 సంవత్సరాల బ్రాహ్మణుడికి, 11 సంవత్సరాల క్షత్రియుడికి, 12 సంవత్సరాల వైశ్యుడుకి ఉపనయనం జరుపవలెను.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే ద్విజులు, అనగా యజ్ఞోపవీతము ధరించేవారు.
*గురువు బ్రాహ్మణుడి ప్రతిరూపము, తండ్రి ప్రజాపతి రూపము, తల్లి భూదేవి రూపము, పెద్ద సోదరుడు తన స్వరూపము.
*ద్విజులు శూద్ర స్త్రీలను భార్యగా స్వీకరిస్తే, వారు తమ కుటుంబాలను నాశనం చేసుకొందురు, తమ పిల్లలు శూద్రులగుదురు.
*స్త్రీలు తమ సోదరుల చేతను, తండ్రుల చేతను, భర్తల చేతను, మరుదుల చేతను గౌరవించబడవలెను, ఆరాధించబడవలెను.
*స్త్రీలు గౌరవింపబడిన చోట దేవుళ్ళు ఆనందించుదురు. గౌరవింపబడనిచోట ఎటువంటి కార్యాలు చేసినా ఫలితము ఉండదు.
*స్త్రీలు బాధపడిన కుటుంబము సర్వనాశనమవుతుంది. వారు సంతోషించిన కుటుంబము ఆశీర్వదింపబడుతుంది.
*పురుషులు తమ క్షేమం కోసం వస్త్రములతోను, ఆభరణములతోను, స్త్రీలను గౌరవించాలి.
*భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ఆనందించిన కుటుంబము కలకాలం వర్ధిల్లుతుంది.
*స్త్రీలు స్వతంత్రంగా, తన ఇంటిలో కూడా ఏపనీ చేయరాదు.
*స్త్రీ బాల్యంలో తల్లిదండ్రుల రక్షణలో, యవ్వనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కుమారుల రక్షణలో ఉండాలి. ఆమె ఎంత మాత్రమును స్వతంత్రంగా ఉండరాదు.
*తండ్రి, భర్త, కుమారులను వీడిన స్త్రీ కుటుంబములను నవ్వులపాలు చేస్తుంది.
*ఇంటి పనుల్లోను, గృహోపకరణాలు శుభ్రపరచుటలోను, ఆర్థిక విషయాల్లో స్త్రీ తెలివిగా, చురుకుగా ఉండాలి.
*భర్త గుణవంతుడైనా, దుర్మార్గుడైనా, భార్య తన భర్తను భగవంతుడుగానే భావించాలి.
*భర్తకు లోబడిన స్త్రీ స్వర్గములో అధికము చేయబడుతుంది.
*భర్త పట్ల బాధ్యను మరచిన స్త్రీ లోకములో అవమానింపబడి, మరణం తరువాత తోడేలు కడుపులో చేరి పలు వ్యాధులతో పీడింపబడుతుంది.
*ఆలోచనలను, మాటలను, చేతలను నియంత్రించుకొని మరణం తరువాత స్వర్గంలో భర్తతోపాటూ ఉన్న స్త్రీయే నిజమైన భార్య.
*భర్త తన భార్యను దేవుడి నుండి పొందుతాడు, తన ఇష్ట ప్రకారం పొందడు. ఆమె నమ్మకంగా ఉన్నంత వరకూ ఆమెకు సాయపడాలి.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే రెండు జన్మలు కలిగినవారు, శూద్రులు మాత్రం ఏక జన్మ కలిగినవారు, ఐదవ కులము లేదు.
*బ్రాహ్మణుడికి మరియు వైశ్య కన్య వల్ల కలిగిన కుమారుడిని అంబస్తుడు అని, శూద్ర కన్య వల్ల కలిగిన కుమారుడుని నిషాడుడు అని అంటారు.
*క్షత్రియుడికి శూద్ర కన్య వల్ల కలిగిన కుమారుడిని ఉగ్ర అని అంటారు.
*క్షత్రియుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని సూతుడు అని, వైశ్యుడుకి క్షత్రియ కన్య వల్ల కలిగిన కుమారుడుని మగధ అని, వైశ్యుడుకి బ్రాహ్మణ కన్య వల్ల కలిగిన కుమారుడుని వైదేహుడు అని అంటారు.
*బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తప్ప ఇతరులందరూ దాస్యులు.
 
== ఇంకా చదవండి ==
కాకారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా వ్రాయబడినదని అభిప్రాయ పడుతున్నారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో సమాజ వ్యవస్థ అద్భుతంగా ఉండేదంటే దానికి ఒక కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలు మనుధర్మ శాస్త్రం అనుసరించడం అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు [[బైబిల్]]లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు.<ref>http://bibleforchildren.org/PDFs/english/Noah%20and%20the%20Great%20Flood%20English.pdf</ref>. స్టార్ మా టివి లో 'అగ్నిసాక్షి ' అనే సీరియల్ మనుస్మృతి డాక్ట్రిన్ ఆధారంగా నిర్మించినదే.
 
==ఇంకా చదవండి==
*[[జలప్రళయం కధలు - ఒకటవ భాగము]]
*[[జలప్రళయం కధలు - రెండవ భాగం]]
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు