సాలార్ ‌జంగ్ మ్యూజియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడవ అతిపెద్ద సంగ్రహాలయంగా ఉంది. వివిధ నాగరికతలు చెందిన సేకరణలు మరియు 1వ శతాబ్దం చెందిన పురాతన వస్తువులకు భారతదేశంలో ప్రసిద్ధి. [[1951]] [[డిసెంబరు 16]] న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడింది. హైదరాబాదుకు చెందిన [[నిజామ్]] పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి ఉన్నాయి. ఈ సేకరణలన్నీ దాదాపు [[మీర్ యూసుఫ్ అలీ ఖాన్]] సేకరించినవే, ఇతను [[సాలార్ జంగ్ III]]గా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ II]]" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ [[సాలార్ జంగ్ I]]"కు చెందినవి.
 
== సేకరణలు == venkata daivaghnu
సాలార్ జంగ్ కు చెందిన నగరమహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా", [[జహాంగీర్]] చురకత్తి, [[నూర్జహాను]] పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క [[ఖోరాన్|ఖురాన్]] ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.
 
ఏనుగు దంతాల కళాఖండాలు:
 
సాలార్ జంగ్ మ్యూజియం లోని ఆరవ నంబరు గ్యాలరీలో ఏనుగు దంతాల కళాఖండాలు ఉంటాయి.
 
ఏనుగు దంతాల కుర్చీలు:
 
బ్రిటీష్ పాలకులతో వీరోచితంగా పోరాటం సాగించిన టిప్పుసుల్తాన్ కు టైగర్ గా బిరుదు ఉండేది.ఆయన పటిమకు మెచ్చి ఫ్రాన్స్ 16 వ లూయి చక్రవర్తి నాలుగు ఏనుగుదంతాల కుర్చీలను బహూకరించాడు.ఆ కుర్చీల కాళ్ళ చివరిలో పులి పాదాల మాదిరిగా ఉంటాయి. చేతులు పెట్టుకునే స్టాండ్ భాగంలో ఏనుగు దంతంతో పులి తల బొమ్మల మాదిరిగా మలిచారు.వీటిని మ్యూజియానికి తెప్పించడానికి మూడో సాలార్ జంగ్ కృషి చేశారు.1949 లో ఆయన చనిపోయిన అనంతరం ఇవి మ్యూజియానికి చేరాయి.
 
ఏనుగు దంతాలతో అల్లిన చాప:
 
ఏనుగు దంతాల నుండి నార మాదిరిగా పోగులు తీసి అల్లి దానిని చాపలాగా చేసిన ఆకృతిని ఇక్కడ గ్యాలరీలో చూడవచ్చును.దీనిని 19 వ శతాబ్దంలో వారణాసి సమీప రాజ సంస్థానంలోని రాంపూర్ లో దీనిని రూపొందించారు.