మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==సంక్షిప్త కథ==
శాంభవీ పురానికి రాజు కాంభోజరాజు. ఆ రాజుకు ఏడుగురు భార్యలు. దానవాది రాజకుమార్తెలు ఆరుగురు. నేత్రవాది రాజ కుమార్తె మాణిక్యాల దేవి ఏడవ భార్య. ఆమె శివభక్తురాలు. కైలాసంలోకి శని ప్రవేశించి మహారాజులను పట్టి వాళ్ళ సౌఖ్యాలను అనుభవించే వరం ఇవ్వాలని శివుడిని ప్రార్థిస్తాడు. తన భక్తుడైన, సంతానహీనుడైన కాంభోజ మహారాజును పట్టి పీడించమని చెబుతాడు. తర్వాత శివుడి మీద రాజుకు కోపం వచ్చి శివుడి విగ్రహాలు కోటలో ఉండకూడదని ఆజ్ఞాపిస్తాడు. కర్మశర్మ రూపంలో శని రాజ్యంలోకి ప్రవేశించి మహారాజుని ముప్పుతిప్పలు పెడతాడు. కర్మశర్మ వరప్రసాదంతో రాజుగారి ఆరుగురు భార్యలు అవివేకులు, అప్రయోజకులు అయిన కొడుకుల్ని కంటారు. ఏడవ భార్య మాణికాంబదేవికి పుట్టే సంతానం రాజు అవుతాడని రాజగురువు జోష్యం చెప్పడం వల్ల అసూయతో మిగిలిన భార్యలు గర్భవతిగా వున్న ఆమెను చంపే ప్రయత్నంలో అడవికి పంపిస్తారు. అడవిలో కాంభోజరాజు చిన భార్య మగ శిశువును ప్రసవిస్తుంది. ఆ శిశువే ఎదిగి సాహసోపేతుడైన శరాబందిరాజు (అక్కినేని). రాజు పశ్చాత్తాపంతో విచారగ్రస్తుడై మంచంపడతాడు. ఆయన జబ్బును నయం చేయడానికి మందులు తీసుకొని వచ్చేందుకు ఆరుగురు కుమారులు బయలుదేరతారు. సాహసకృత్యాలే ఊపిరిగా అడవిలో పెరిగిన శరాబందిరాజు తల్లితండ్రులను తిరిగి ప్రయత్నంలో రాజధానికి వచ్చి సవతి సోదరుల వల్ల అనేక అవమానాలను, హేళనలను ఎదుర్కొంటాడు. తనూ మందును వెతకటానికి బయలుదేరి కీలుగుఱ్ఱంలాంటి గుఱ్ఱాన్ని ఎక్కి ఏడు సముద్రాలు దాటి, శరాబందిరాజు, రత్నగంధి ([[శాంతకుమారి]]), యోజనగంధి ([[ఎమ్.వి.రాజమ్మ]]) ల సహాయంతో తండ్రి జబ్బును నయం చేసే మందును సంపాదిస్తాడు. అంతే కాకుండా తన సోదరులను రంగసాని ([[యస్.వరలక్ష్మి]]) చెర నుండి విడిపిస్తాడు.<ref name=":1">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/mayalokam-1945/article3267384.ece MAYALOKAM (1945) - The Hindu April 1, 2012]</ref> మందు తెచ్చి తండ్రిని ఆరోగ్యవంతున్ని చేస్తాడు. సవతి తల్లులు, వారి పరివారం శరాబంది రాజుని గుర్తించి చంప ప్రయత్నిస్తారు. శరాబందిరాజు వారిని జయిస్తాడు.
 
== నిర్మాణం ==
 
=== అభివృద్ధి ===
తన సినిమాలు ఆర్థికంగా దెబ్బతిని, ఇబ్బందులకు గురిచేస్తూండడంతో సాంఘిక చిత్రాలే తప్ప జానపద, పౌరాణిక చిత్రాలు తీసి ఎరుగని గూడవల్లి రామబ్రహ్మం తొలిసారిగా ఈ జానపద చిత్రానికి దర్శకత్వం వహించాడు. జనం నోట్లో నానిన "కాంభోజరాజు కథ" అన్న జానపద కథను తీసుకుని, త్రిపురనేని గోపీచంద్‌తో మెరుగులు దిద్దించి, దైతా గోపాలంతో సంభాషణలు, పాటలు రాయించుకుని ఈ స్క్రిప్టు తయారుచేయించాడు. రామబ్రహ్మం ప్రజామిత్ర పత్రిక సంపాదకునిగా ఉన్న రోజుల్లో చదివిన జానపద కథల పుస్తకం పేరు "మాయలోకం", అప్పట్లో ఇది సినిమాకు పేరుగా బావుంటుందన్న తన మాట గుర్తుపెట్టుకుని ఈ సినిమాకు ఆ పేరు పెట్టాడు.<ref name=":1" />
 
=== నటీనటుల ఎంపిక ===
మాయాలోకంలోసినిమాలో ముగ్గురు కథానాయికల్లో రెండు పాత్రలకు శాంతకుమారి, రాజమ్మలను మొదటే దర్శకుడు నిర్ణయించేశాడు.<ref name=":1" /> హీరో శరాబంది రాజు వేషం నిజానికంత పెద్దదేమీ కాకపోయినా ముగ్గుర్ని పెళ్ళాడటంతో ఆ వేషానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఆ వేషం అక్కినేనేఅక్కినేనితోనే వెయ్యాలనిచేయించాలని అతనిపై అభిమానం కల ఘంటసాల బలరామయ్య కోరిక.<ref name=":0">[http://www.prabhanews.com/tvtalk/article-151760 “మాయలోకం"కి 65 - ఆంధ్రప్రభ అక్టోబర్ 7, 2010]</ref> బలరామయ్య సిఫార్సు మీద దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం నాగేశ్వరరావును పిలిపించి తనకు కనీసం నమస్కారమన్నా చేయలేదనీ, తన హీరోయిన్లు శాంతకుమారి, రాజమ్మల నడుమ అర్భకుడిలా ఉన్నాడనిఉంటాడని హీరో పాత్ర ఇవ్వడానికి నిరాకరించాడు. ఈలోగా వేరే నటులను కూడా ఆ పాత్ర కోసం రామబ్రహ్మం పరిశీలించసాగాడు. చల్లపల్లి రాజా, మధుసూదనరావులు నాగేశ్వరరావు తరఫున రామబ్రహ్మంతో మాట్లాడి ఒప్పించడంతో, మేకప్ టెస్టు చేసి నాగేశ్వరరావును హీరోగా తీసుకున్నాడు.<ref>{{cite magazine|last=కుటుంబరావు|first=కొడవటిగంటి|date=నవంబరు 1952|title=అక్కినేని నాగేశ్వరరావు (స్కెచ్)|url=http://eemaata.com/em/issues/201205/1945.html|magazine=కినిమా|publisher=చందమామ పబ్లికేషన్స్|access-date=17 January 2019|location=మద్రాసు}}</ref>
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు