చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 109:
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి దేవాలయం;- ఈ ఆలయం చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న కొమరవల్లిపాడులో ఉంది.
 
ఆలయ చరిత్ర:- క్రీ.శ. 1712 లో చిలకలూరిపేట జమీందారయిన శ్రీ రాజమానూరి వేంకటకృష్ణరాయణం బహద్దూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. చిలకలూరిపేట ప్రక్కనే ఉన్న [[పసుమర్రు]] గ్రామంలో ఒక మహమ్మదీయుని ఇంటిలో కాకరపాదు త్రవ్వుచుండగా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి విగ్రహం లభించినది. రాజా వారు, ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ నిమిత్తం చంఘిజ్ ఖాన్ పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డునగల కొమరవల్లిపాడుకు రాగానే విగ్రహం కదలలేదట. ఆ రాత్రి స్వామివారు జమీందారుగారికి కలలో సాక్షాత్కరించి, అక్కడనే ప్రతిష్ఠించమని కోరగా, అదే విధంగా దైవానుసారం, జమీందారు గారు [[కొమరవల్లిపాడు]] లోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర కథనం. 18-10-1918 నాడు ఇక్కడ పెద్ద రథశాల నిర్మించారు. స్వామివారు వామాంకమున లక్స్మీదేవిని కూర్చుండబెట్టుకొని నేత్రపర్వంగా భక్తుల అభీష్టాలు నెరవేర్చుచున్నారని ప్రతీతి.
 
శ్రీ భూనిళా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి పంచాహ్నిక మహోత్సవాలు, 2014,మే-10 నుండి 17 వరకు నిర్వహించెదరు. [1]
"https://te.wikipedia.org/wiki/చిలకలూరిపేట" నుండి వెలికితీశారు