మూగ నోము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
'''మూగ నోము''' అక్కినేని నాగేశ్వర్రావు, జమున, ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలలో నటించగా ఎవియం సంస్థ నిర్మించి 1969 లో విడుదలైన సినిమా. ''కళత్తూర్ కన్నమ్మ'' అనే తమిళ సినిమా ఈ సినిమాకు మాతృక. తమిళ సినిమాలో చిన్నపిల్లవాడిగా కమల్ హాసన్ నటించాడు. కథ అంతా గోపీ అనే పిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ''తల్లివి నీవే తండ్రివి నీవే'' అనే పాట ప్రేక్షకాదరణ పొందింది.
== కథ ==
పెద్ద జమీందారు, దివాన్ బహద్దూర్ రాజగోపాలరావు (యస్వీ రంగారావు) జమిలో వ్యవసాయం చేసే రైతు సోమయ్య (నాగయ్య), కూతురు గౌరి (జమున). జమీందారు పుత్రుడు వేణుగోపాల్ (అక్కినేని) ఇంగ్లండులో చదివి ఇండియా వస్తాడు. అనుకోకుండా రైలులో కలిసిన గౌరితో తనొక ఎలక్ట్రిక్ ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు. ఊరికి వచ్చిన తరువాత అతడు జమీందారని తెలిసి దూరం కావాలనుకుంటుంది గౌరి. కాని తను మనసారా ప్రేమించానని ఆమెకు చెప్పి ఒప్పించి, ఊరి గుడిలో తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. తరువాత తండ్రి చెప్పిన పనిమీద సింగపూర్ వెళ్తాడు. గౌరిని వేణు వివాహం చేసుకున్నాడని తెలుసుకుంటాడు జమీందారు. ఆమె గర్భవతి అని కూడా తెలుస్తుంది. దాంతో ఆమెను, ఆమె తండ్రిని ఊరువిడిచి వెళ్ళమంటాడు. వేణుతో వివాహం సంగతి ఎవరికీ తెలియనీయవద్దని ఆమెచే ప్రమాణం చేయించుకుంటాడు. ఆ ప్రకారం ఊరు వదిలి వెళ్లిన గౌరి ఒక మగపిల్లవాడిని ప్రసవిస్తుంది. అయితే ఆమె తండ్రి, ఆ పిల్లాడిని రామాపురం అనాధాశ్రమంలో వదిలిపెట్టి, బాబు మరణించాడని గౌరికి చెబుతాడు. ఆమె బాధతో కుమిలిపోతుంది. సింగపూరు నుంచి వచ్చిన వేణు గౌరికోసం వెతికి, ఆమె జాడ తెలియక తాగుడు వ్యసనానికి బానిసవుతాడు. పట్నంలో ఒక నర్తకి (విజయలలిత) ఇంట్లో ఆమెను చూసి ఆమె శీలం గురించి నిందిస్తాడు. తరువాత గౌరి రామాపురం స్కూల్లో టీచర్‌గా చేరటం, అక్కడ ఆమె కొడుకు గోపి (బేబీ బ్రహ్మజీ) ఓ అనాధగా పరిచయమై ఆమెకు చేరువకావటం జరుగుతుంది. స్కూలు వార్షికోత్సవంలో గౌరిని ఊరు తీసుకెళ్తాడు. షావుకారు (రంగయ్య) రాజనాల, తన కూతురు రజని (వెన్నిరాడై నిర్మల)తో వేణుకు వివాహం చేయాలనుకొని పెద్ద జమిందారును ఒప్పిస్తాడు. గోపీ బలవంతంతో వేణు ఈ పెళ్లికి అంగీకరిస్తాడు. సోమయ్య వలన గోపియే తన కుమారుడని తెలిసి గౌరి అక్కడకు వస్తుంది. ఆమెను ద్వేషిస్తూ వేణు నిందిస్తాడు. గోపి తన కొడుకని చెప్పిన గౌరిని మరింతగా వేణు అవమానంగా మాట్లాడినా గౌరి ఏం మాట్లాడదు. అదే సమయంలో ఆస్తి మొత్తం పెళ్లికిముందే రాసిమ్మని కోరిన షావుకారు, అతని కుమార్తె నైజం గ్రహిస్తాడు జమిందారు. వెంటనే గౌరి తన కోడలని, గోపి తన మనవడని ప్రకటించటంతో ఆమె మూగనోము సమాప్తమై, అందరూ ఆనందించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
అక్కినేని నాగేశ్వరరావు ఒక జమీందారు (ఎస్వీ రంగారావు) కొడుకు. జమున అదే ఊళ్ళో ఒక సామాన్య వ్యవసాయదారుడి (చిత్తూరు నాగయ్య) కూతురు. జమీందారు సహాయంతో చిత్తూరు నాగయ్య తన కూతురును పట్టణంలో ఉంచి చదివిస్తాడు. ఆమె చదువు పూర్తి చేసుకుని పట్టణం నుంచి తిరిగి వస్తుండగా నాగేశ్వరరావు పరిచయమవుతాడు. ఆమెతో తాను జమీనులో పనిచేసే ఎలక్ట్రీషియనుగా పరిచయం చేసుకుంటాడు. వారిరువురి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఆమెకు కొద్ది రోజులకు అతను జమీందారు కొడుకని తెలుస్తుంది. ఆమెకు నమ్మకం కలిగించడానికి జమీందారుకు తెలియకుండా గుడిలో పెళ్ళి చేసుకుంటాడు.
 
కొన్ని రోజుల తర్వాత నాగేశ్వరరావు పై చదువుల కోసం విదేశాలు వెళ్ళవలసి వస్తుంది. తర్వాత జమీందారుకు తన కొడుకు జమునను పెళ్ళి చేసుకున్న సంగతి తెలుస్తుంది. ఆమెను పిలిచి తన కొడుకును మరిచిపొమ్మంటాడు. జమీందారు మీద గౌరవంతో ఆమె తన పెళ్ళి గురించి ఎక్కడా నోరెత్తనని మాట ఇస్తుంది. జమునకు ఆమె తండ్రికి జమీందారు పక్క ఊర్లో ఉండేందుకు వసతి ఏర్పాటు చేస్తాడు.
==పాటలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/మూగ_నోము_(సినిమా)" నుండి వెలికితీశారు