వెల్చేరు నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
→వృత్తి, వ్యక్తిగత జీవితం: ఏకవచనం చేర్పు |
||
పంక్తి 36:
== వృత్తి, వ్యక్తిగత జీవితం ==
ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఎ., ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎం.ఎ. పూర్తిచేసిన అనంతరం వెల్చేరు నారాయణరావు 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో డిప్లొమా అందుకున్నాడు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కామన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. 1974లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై చేసిన పరిశోధనకు గాను పి.హెచ్.డి. పట్టా అందుకున్నాకా విస్కామన్సిన్ విశ్వవిద్యాలయంలోనే 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 1981లో అసోసియేట్ ప్రొఫెసర్ గా అనంతరం 1987లో ఆచార్యునిగా పదోన్నతి
== సాహిత్య విమర్శ, పరిశోధన ==
వెల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శారంగంలో తనదైన స్థానాన్ని
ఈ గ్రంథంలోని విషయ విస్తరణ 20వ శతాబ్దిలోని కవిత్వ విప్లవాలపై ఎక్కువ ఆధారపడిందన్న ప్రముఖ విమర్శకులు కె.వి.ఎస్.రామారావు తదనంతర పరిశోధనల్లో ఆ లోపం పూరిస్తూ పూర్వసాహిత్యాన్ని నారాయణరావు కొత్త కోణంలో పరామర్శించాడు అన్నాడు. ఈ కోణంలో నారాయణరావు గ్రంథాలను విశ్లేషిస్తూ కె.వి.ఎస్.రామారావు ''శ్రీనాథుడి గురించిన పరిశోధన, పురాణ దశ నుంచి ప్రబంధ దశకి జరిగిన పరిణామక్రమంలో, ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించటం. చాటుపద్యాల గురించిన పరిశీలనలు, ప్రబంధ దశకి పట్టుగొమ్మలైన పండితబృందాలు కవిత్వాస్వాదనని ఒక అద్భుతమైన వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాయో, ప్రబంధ కవితా విప్లవాన్ని ఎలా నిలబెట్టాయో చూపిస్తాయి. కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం మీద జరిగిన పరిశోధనలు బహుశా ప్రబంధ విప్లవానికి ఒక ముఖ్య కారణం అప్పటి సమాజంలో ఊపిరిపోసుకుంటున్న “ఆధునికతా” భావనలు కావొచ్చునని ప్రతిపాదిస్తాయి. నాయకరాజుల కాలంనాటి కవిత్వం గురించిన శోధనలు ప్రబంధ సాహిత్యం అంతా ఒకే మూస లోది కాదని, దానిలోనూ అనేక “చిరువిప్లవాలు” ఉండొచ్చునని చూపే ప్రయత్నంగా చూడొచ్చు. ఇలా, స్థూల వర్గీకరణతో ప్రారంభమైన నారా సుదీర్ఘ ప్రయాణం ఒక్కో స్థూలాంశాన్ని దాని సూక్ష్మ విభాగాలుగా విడదీసి ఒక్కో సూక్ష్మాంశానికున్న ప్రత్యేకతల్ని గుర్తిస్తూ, అది దాని స్థూల మాతృకలోని ఇతర సూక్ష్మాంశాలతో ఎలా సంబంధితమైందో వివరించే నిరంతరాయ ప్రయత్నాల సముదాయంగా '' నారాయణరావు సాహిత్యాన్ని
ప్రతీ రచనకు నిర్దుష్టమైన రచయిత, ఒకే శుద్ధమైన పాఠం ఉంటుందని భావిస్తూ చేస్తున్న పరిశోధనల మూలాలను నారాయణరావు
=== ఆసక్తికరమైన కొన్ని పరిశోధనాంశాలు ===
* నాయకరాజుల కాలాన్ని ఆనాటి శృంగార కావ్యాల కారణంగా తెలుగు సాహిత్య విమర్శకులు "క్షీణయుగం"గా ముద్రవేశారు. బ్రిటీష్ కాలంలో ఆనాటి కావ్యాలపై నిషేధం కూడా విధించాడు. ఈ నేపథ్యంలో నారాయణరావు "సింబల్స్ ఆఫ్ సబ్స్టెన్స్" గ్రంథంలో అటువంటి కాలాన్ని ఎంచుకుని చేసిన పరిశోధనల్లో ఆనాటి సాహిత్యం భూ కేంద్రక వ్యవస్థ నుంచి ధన కేంద్రక వ్యవస్థగా మారుతున్న క్రమంలో తయారైన కొత్త విలువల ఫలితంగా
* గురజాడ అప్పారావు [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకాన్ని ప్రధానస్రవంతిలోని సాహిత్య విమర్శకులు కుళ్లిపోయిన సమాజాన్ని, సమాజాన్ని బాగుజేయడానికి వచ్చిన సంస్కరణల్నీ చిత్రించినట్టుగా విశ్లేషించాడు. నారాయణరావు ఈ ధోరణికి పూర్తి భిన్నంగా నారాయణ రావు గారి విశ్లేషణ ప్రకారం అప్పారావు గారి దృష్టి భిన్నమైంది. ఆయన ఈ నాటకంలో చిత్రించిన సమాజం కుళ్లిపోయింది కాదు, చక్కగా హాయిగా వున్నది. అంతేకాదు, ‘ఆధునిక’మైంది కూడ. ఈ ఆధునికత వలససంస్కృతి వల్ల కలిగిన ఆధునికత కాదు, అంతకుముందు ఎప్పటినుంచో వస్తూ వున్న ఆధునికత. ఇందులో మనుషులు సంప్రదాయాల భారంతో కుంగిపోతున్నవారు కారు, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా, తమకు ఏం కావాలో దాన్ని ఎలా సాధించుకోవాలో స్పష్టంగా తెలుసుకుని ఆచరిస్తున్న వాళ్లు. అప్పారావు గారు చిత్రించిన ‘కన్యాశుల్కం’లో ఈ రెండురకాల ఆధునికతల మధ్య సంఘర్షణని చూస్తాం. వలససంస్కృతి ఆధునికతకి ప్రతినిథిగా సౌజన్యారావు పంతులు నిలబడితే, పరిణామ ఆధునికతని మధురవాణిలో స్పష్టంగా చూస్తాం. అవసరాన్ని బట్టి అటూ ఇటూ దూకే గోడమీది పిల్లిగా గిరీశం నిలబడతాడు. దాదాపుగా మిగిలిన అన్ని పాత్రలు కూడ ఆ సంధికాలానికి అనుగుణంగా పరిణమిస్తున్నవే, జీవనప్రయాణం చేస్తున్నవే. వలససంస్కృతి మీద ఇలాటి ఎదురుదాడి చేసిన రచయితలు ఆ కాలంలో అప్పారావు గారు తప్ప మరొకరు లేరు. భారతదేశంలోనే కాదు, ప్రపంచసాహిత్యంలో ఎక్కడా ఇలా జరగలేదని నారాయణ రావు గారి సిద్ధాంతం. ఇలా ఎన్నో కొత్తకోణాల్ని ఆవిష్కరించి, నారాయణ రావు గారీ గ్రంథంలో కన్యాశుల్కం మీద ఆసక్తికరమైన, ఆలోచనాకారకమైన వివేచనని చేశారు.<ref>[http://pustakam.net/?p=11817] Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India పుస్తకం గురించి కె.వి.ఎస్.రామారావు సమీక్ష</ref><ref>[http://eemaata.com/em/issues/200709/1146.html] Girls for Sale: Kanyasulkam, a Play from Colonial India పుస్తకం గురించి "కన్యాశుల్కం మళ్లీ ఎందుకు చదవాలంటే" శీర్షికన వేలూరి వెంకటేశ్వరరావు సమీక్ష</ref>
* పింగళి సూరన సొంతంగా అల్లి, కావ్యజగత్తుకూ వాస్తవ జగత్తుకూ అద్భుతమైన సంబంధాన్ని ప్రతిపాదించిన కావ్యం "కళాపూర్ణోదయం". నారాయణరావు "ద సౌండ్ ఆఫ్ ద కిస్"గా కళాపూర్ణోదయం అనువదించి మిగిలిన రచనలమల్లేనే దీన్లో కూడ లోతైన విశ్లేషణలతో, అనిదంపూర్వమైన ఆలోచనల్తో కూడిన ఒక పరిశోధనా వ్యాసాన్ని జతచేశారు. కూలంకషంగా పరిశోధించిన నారాయణ రావు, షుల్మన్ గార్లు కళాపూర్ణోదయాన్ని దక్షిణాసియాలో వచ్చిన తొలి నవలగా నిరూపిస్తారీ The sound of the kiss అన్న గ్రంథంలో. ఒక నవలకుండవలసిన లక్షణాలు స్పష్టంగా ఇందులో ఉన్నట్టు
== అనువాదకునిగా ==
|