కోటప్ప కొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
ప్రముఖ శైవక్షేత్రంమైన [[కోటప్పకొండ]] త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో కొలువుతీరిన మేధా దక్షిణామూర్తి పాదాల చెంత ప్రతి సంవత్సరమూ వేలమంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం జరుగుతుంది. విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా భావించి, కోటప్పకొండను అక్షరాభ్యాస కేంద్రంగా రూపొందించారు. పర్వదినాలు అక్షరాభ్యాసానికి అనువైనవి. ముఖ్యంగా విజయదశమీ, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు, శ్రీపంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటంవల్ల ఆ దేవతల ఆశీస్సులూ అనుగ్రహమూ లభించి, విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని నమ్మకం. అదేవిధంగా, ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే వాళ్లు విద్యావంతులవుతారని నమ్మకం. మాఘమాసం ప్రకృతి వికాసానికి, సరస్వతి మనోవికాసానికి సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారమవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభసూచిక అవుతుంది. అజ్ఞానం అనే మంచుతో గడ్డకట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింపజేయటమే వసంత పంచమి అంత‌రార్థం. కాబట్టి, వసంతపంచమి రాగానే పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు.అందుకే చిన్నారులకు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు. ఆ వయస్సు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుని, మనస్సులో నిలుపుకొనే శక్తి చిన్నారికి లభిస్తుంది.
 
{{వ్యాఖ్య|'''మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ <br /> పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత: శుచి:'''<br /><br /> }}
పూర్వేహ్ని సమయం కృత్యాతత్రాహ్న సంయత: శుచి:'''
 
ఈ మంత్రాన్ని పఠిస్తూ.. సరస్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. సరస్వతీదేవి ప్రతిమ ముందు పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు ఉంచి షోడవోపచారాలతో మాతను పూజించాలి. తల్లికి తెల్లని పూలు, సుగంధ ద్రవ్యాలను రంగరించిన చందనంతో, తెలుపు వస్త్రాలతో అమ్మవారిని పూజించాలి. అందుకే అక్షరాభ్యాసం చేయించుకొనే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి అమ్మవారి రూపు, కంకణములు, ప్రసాదం పంపిణీ చేసి పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దిస్తారు. ఈ సందర్భంగా గణపతి పూజ, మేథా దక్షణామూర్తి, సరస్వతి పూజలు, గణపతి హోమం, మేథా దక్షణామూర్తి హోమం జరిపి, అక్షరాభ్యాసం చేయించే పిల్లవాడిని తండ్రి తొడమీద కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః సిద్ధం నమః’ అనే అక్షరాలను కుమారుడుచేత రాయిస్తాడు. విద్యాధి దేవత సరస్వతి అయినా, జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ‘నమశ్శివాయ’ అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్నిచోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. రాష్ట్ర విభజన అనంతరం బాసర తరహాలో కోటప్పకొండను అక్షరాభ్యాస కేంద్రంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రకటించారు.
"https://te.wikipedia.org/wiki/కోటప్ప_కొండ" నుండి వెలికితీశారు