'''దండమూడి సుమతీ రామమోహనరావు''' [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] పురస్కారానికి ఎంపికైన [[మృదంగం|మృదంగ]] వాద్య కళాకారిణివిద్వాంసురాలు. నిడుమోలు రాఘవయ్య, వెంకటరత్నం దంపతులకు జన్మించారు. సుమతీ గారు [[నాద బ్రాహ్మణులు|నాద బ్రాహ్మణ]] కుటుంభానికి చెందినవారు. చిన్ననాటి నుండే తండ్రి రాఘవయ్య వద్ద [[మృదంగం]] నేర్చుకుని పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు. విజయవాడ ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో దండమూడి రామమోహనరావు వద్ద మృదంగ విద్యనభ్యసించారు. [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] వంటి అనేక మంది ప్రముఖులకు వాద్య సహకారం అందించారు. ఆకాశవాణిలో ఏ' గ్రేడ్ కళాకారిణి. భర్త [[దండమూడి రామమోహనరావు]]. ''మృదంగ శిరోమణి'', ''మృదంగ మహారాణి'', ''నాదభగీరథ'', ''మృదంగ లయ విద్యాసాగర'' బిరుదులతో ఆమెను అనేక సంస్థలు సన్మానించాయి. మద్రాసు సంగీత అకాడమీ 1974, 80, 85 సంవత్సరాలలో ఉత్తమశ్రేణి వాద్యకళాకారిణిగా ఎంపికచేశారు. 1988లో విజయవాడ నగరపాలకసంస్థ కళా సత్కారాల్లో భాగంగా ఆమెను సన్మానించారు.