అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]]లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ [[కుటుంబము]]<nowiki/>లో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. [[భీమవరం]] హైస్కూలులో చదివి, [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, [[మద్రాస్]] లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు [[దినపత్రిక]] [[మీజాన్]] సంపాదకునిగా పనిచేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. [[చిత్రకళ]]ను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
 
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల '''[[నారాయణరావు (నవల)|నారాయణరావు]]'''కు [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో '[[సముద్ర గుప్తుడు]]', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. [[విశ్వనాథ సత్యనారాయణ]] గేయ సంపుటి [[కిన్నెరసాని పాటలు]] బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
 
1922లో [[సహాయ నిరాకరణోద్యమం]]లో ఒక సంవత్సరం [[జైలు]] శిక్ష అనుభవించాడు. తన [[జైలు]] జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
"https://te.wikipedia.org/wiki/అడివి_బాపిరాజు" నుండి వెలికితీశారు