గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
}}
 
'''గరికిపాటి నరసింహారావు''' తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వందలాదివేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
==జీవిత విశేషాలు==
నరసింహారావు [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పెంటపాడు]] మండలం [[బోడపాడు (పెంటపాడు)|బోడపాడు]] అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు [[1958]], [[సెప్టెంబర్ 14]]వ తేదీకి సరియైన [[విలంబి]] నామ సంవత్సరం [[భాద్రపద శుద్ధ పాడ్యమి]]నాడు జన్మించాడు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]]<nowiki/>లో స్థిరపడ్డారు.
పంక్తి 58:
# ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో '''నవజీవన వేదం'''
# ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో '''రఘువంశం'''
# భక్తి టి.వి.లో '''ఆంధ్ర మహాభారతం:''' 1818 ఎపిసోడ్లు
# భక్తి టి.వి.లో '''తరతరాల తెలుగు పద్యం'''
# దూరదర్శన్ సప్తగిరిలో '''మంచికుటుంబం'''