తిక్కవరపు పఠాభిరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
పఠాభి [[1919]] [[ఫిబ్రవరి 19]] న [[నెల్లూరు]]లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. [[మహాత్మా గాంధీ]] వారి ఇంటికి వచ్చినపుడు, ఆయన స్ఫూర్తితో అంతా స్వాతంత్య్ర సమరంలోకి దూకారు. [[రవీంద్రనాధ టాగూరు]] స్ఫూర్తితో పఠాభి [[శాంతి నికేతన్‌]]కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక [[కలకత్తా]] విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. [[1938]]లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు [[గూడూరు,నెల్లూరు|గూడూరు]]లో కుటుంబ వ్యాపారమైన [[అభ్రకం]] ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత [[అమెరికా]]లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ''ఫిడేలు రాగాల డజన్‌'' రచించాడు. [[తెలుగు ఆధునిక కవిత్వం]]లో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండో ప్రపంచ యుద్ధ]] సమయంలో సైన్యంలో చేరాలని [[అమెరికా]] బలవంతపెట్టింది. [[బ్రిటిషు]]వాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి [[దక్షిణ అమెరికా]], [[ఆఫ్రికా]]ల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.
 
దేశంలో అడుగుపెట్టాక [[1947]]లో స్నేహలతా పావెల్‌ అనే మహిళను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. 1925 హేడెన్లో జన్మించిన స్నేహలతా పావెల్ పూర్తిపేరు స్నేహలతా జాయిస్ పాట్రిషియా పావెల్. తల్లి లీలావతీ ఘోష్ అనే బెంగాలీ మహిళ, తండ్రి జేమ్స్ ఎబనైజర్ తంగరాజ్ పావెల్ అనే తమిళుడు. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. [[పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్]] వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోనార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామజికసామాజిక సేవ కార్యకర్త. 1947లో ఫోకస్ అనే ఆంగ్ల వారపత్రిక నెలకొల్పి 36 వారాలు వెలువడి నిలిచిపోయింది. దీనికి స్నేహలత ప్రచురణకర్తగా వ్యవహరించగా, టి.పి.ఉన్నికృష్ణన్ సంపాదక బాధ్యతలు నిర్వర్తించాడు.