గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

భాష సవరణలు. పద్యాలను శ్లోకాలను తగ్గించాను. ఆకృతి సవరణ, ఒక బొమ్మ తీసివేత
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Gajendra Moksha.jpg|thumb|విష్ణుమూర్తి గజేంద్రున్ని రక్షించడం.]]
స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ [[మన్వంతరము|మనువుల]] కాలం గడిచి తామసుడు మనువుగా ఉన్న సమయంలొసమయంలో [[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వచ్చాడు అని [[శుక మహర్షి]] [[పరీక్షిత్తు]] మహారాజుకు పల్కుతాడు. అదివినిఅది విని పరీక్షిత్తు ఆ గజేంద్రుని కథను వివరంగా అడుగగచెప్పుమని అడుగగా ఆ మహర్షి '''గజేంద్ర మోక్షం''' ([[సంస్కృతం]]: गजेन्द्रमोक्षः) గాధనుగాథను వివరిస్తాడు. ఇది [[పోతన]] రచించిన [[మహాభాగవతం|భాగవతం]] లోనిది.
 
==త్రికూట పర్వత విశేషాలు==
క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం [[ఇనుము]]<nowiki/>తో, మరొకటి [[వెండి]]తో అలరారుతూండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మృగాలతో పాటు [[ఏనుగు]]లు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలముకొనేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకొన్నాయి.
 
==గజరాజు తప్పిపోవడం జల క్రీడలు ఆడడం==
అలా ఏనుగులు చేరుకొన్న ఆ సరోవరం అతి విశాలమైనది, ఆ సరోవరం నిండా వికసించిన [[కలువ]]లు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని [[మొసళ్ళు]] కూడా ఉన్నట్లు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని, జలక్రీడలు జరిపి బయటికి వచ్చిన తరువాత గజరాజు కూడా సరోవరం లోకి ప్రవేశించి నీళ్ళు తాగి, తొండం నిండా నీరు నింపి గగనవీధికి చిమ్ముతున్నాడు. అలా నీరు చిమ్ముతూ ఇంతే సరోవరంలోని కర్కాటక మీనాలు, రోదసిలోని మీన కర్కాటాకాలను చేరినట్లు కనిపించింది.
 
==కరిమకర సంగ్రామం==
ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక మొసలి ఆ గజరాజు కాలు పట్టుకొంది. పట్టు విడిపించుకొని తొండంతో దెబ్బ తీయాలని ఆ ఏనుగు చూసింది. వేంటనే ఆ మెసలి ఏనుగు ముందు కాళ్ళు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మెసలిని కుమ్మి విడిచింది. అప్పుడు ముసలి వెనుకవైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా ఆ కరి, మకరం ఒక దానిని ఒకటి కుమ్మి చీల్చుకొంటుండగా కరి బలం సన్నగిల్లుతోంది. జలమే తన నివాసస్థానం అవడం వల్ల మకరం బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గజరాజు నీరసిస్తోంది. ఈ సందర్భాన్ని పోతన తన గజేంద్ర మోక్షం కావ్యంలో ఇలా వర్ణించాడు.<blockquote>కరి దిగుచు మకరి సరసికి<br>గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్<br>గరికి మకరి మకరికి గరి<br>భర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.</blockquote>మొసలితో పోరు సాగించలేక దీనావస్థలో పడిన ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని నిశ్చయించి తనను రక్షించమంటూ సర్వేశ్వరుడైన నారాయణుడుకి ఈ విధంగా మ్రెక్కింది.<blockquote><br>కలఁ డందురు దీనులయెడఁ,<br </blockquote><blockquote>గలఁ డందురు పరమయోగి గణములపాలం<br />గలఁ డందు రన్ని దిశలను,<br </blockquote><blockquote>గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో</blockquote><br />
<blockquote>లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్<br>ఠావుల్ దప్పెను; మూర్చమూర్ఛ వచ్చె; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;<br>నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;<br>రావెరావే ఈశ్వర; కావవెకావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా;</blockquote><blockquote>
==కరి మొర విని శ్రీమహావిష్ణువు భూలోకానికి రావడం</blockquote>==
[[బొమ్మ:Gajendra moksham1.JPG|thumb|800x800px|వైకుంఠం తరలి వచ్చే చిత్రం|alt=|center]]
అలా మొరపెట్టుకొన్నప్పుడు శ్రీమహావిష్ణువు [[వైకుంఠం]]లోని మందార వనాంతరంలో ఉన్న సరోవర సమీపంలోని చంద్రకాంత వేదికపై శ్రీమహావిష్ణువు లక్ష్మీ దేవితో సరస సల్లాపాలాడుతున్న సమయంలో గజరాజు పాహి పాహి అన్న మాట చెవిని పడింది. వెంటనే ఉన్నఫళాన గజరాజు రక్షణ కోసం బయలు దేరినాడు.<blockquote>సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే<br>పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం<br>తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో<br>పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.</blockquote>అలా వెళ్తున్న నారాయణుడుని చూసి మహాలక్ష్మి తన మనస్సులొ ఈ విధంగా ఆలోచించింది. ఏ దుష్ట [[దుశ్శాసనుడు]] [[కబంధుడు|కబంధ]] హస్తాలలోనైన చిక్కుకొని [[ద్రౌపది]] దేవి వంటి ఇల్లాలు మెర పెట్టుకొంటోందా! మళ్ళి పరమ మూర్ఖుడైన [[సోమకాసురుడు]] [[చతుర్వేదాలు|వేదాలు]] దొంగిలించడానికి వచ్చాడా! అసురులు అమరావతి పైకి దండెత్తి వస్తున్నారా! [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] వంటి భక్తులను హింసించే [[హిరణ్యాక్షుడు]] మళ్ళీ బయలుదేరాడా అని సంశయించి ఆయన వెంట బయలుదేరింది.
 
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు