కుమారభీమారామం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB వాడి "జయశంకర్ జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను., typos fixed: ె → ే , ) → )
పంక్తి 44:
 
==చరిత్ర==
[[సామర్లకోట]] లోని భీమేశ్వరాలయాన్ని [[తూర్పు చాళుక్యులు|చాళుక్య రాజయిన]] [[భీముడు]] నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకెఅందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.
 
ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. [[ఆలయం]] నిర్మాణం చాలా చక్కని [[శిల్ప కళలు|శిల్ప కళ]] కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి [[శివలింగం]] తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన [[కాకతీయులు]] ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు [[బాలాత్రిపురసుందరి]]. [[శివుడు]] కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన [[శాసనాలు]]న్నాయి.
పంక్తి 55:
ఈ దేవాలయ నిర్మాణం పంచారామాలలో ఒక్కటైన [[ద్రాక్షారామం]]లోని భీమేశ్వరాలయాన్ని పోలివుండును.అక్కడిలానే ఈ దేవాలయం చుట్టు రెండు ఎత్తయిన రెండు ప్రాకారాలను కలిగివున్నది.ప్రాకారాపు [[గోడలు]] ఇసుక రాయి (సsand stone) చే కట్టబడినవి. వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగుదిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి. ప్రదాన ప్రవేశ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు.గుడిలోని స్థంబాల మీద అప్సర బొమ్మలు చెక్కబడివున్నవి. చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమరరామ పేరుమీదుగా ఇక్కడి శివున్ని కుమరరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది<ref>http://www.templesindia.org/index.php?option=com_content&view=article&id=119:sri-chalukya-kumararama-sri-bhimeswaraswamy-vari-temple-samarlkota-&catid=35:temples-in-andhra-pradesh&Itemid=62</ref>
=== ఉత్సవాలు పూజలు ===
ఇక (చైత్రమాసము) (చైత్ర) [[వైశాఖి|వైశాఖ]] మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. [[మహాశివరాత్రి|శివరాత్రి]]<nowiki/>కి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలాత్రిపురసుందరికి [[వైభవం]]<nowiki/>గా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక [[కార్తీక మాసం]]లో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ [[భక్తులు]] పునీతులవుతుంటారు.
 
== ప్రయాణ వసతులు ==
"https://te.wikipedia.org/wiki/కుమారభీమారామం" నుండి వెలికితీశారు