కటికితల రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు సమీక్షించండి మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
జస్టిస్ [[కటికితల రామస్వామి]] హైకోర్టులోను,సుప్రీం కోర్టు లోను న్యాయాధిపతిగా పనిచేశారు.వీరు పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన [[భట్లమగుటూరు]] లో 13.7.1932 న మంగమ్మ, చిట్టయ్య లకు జన్మించారు. మార్టేరులో పదో తరగతి ,భీమవరంలో డిగ్రీ .ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ లా చదివారు.రామస్వామి గారు కొన్ని సాహసోపేతమైన తీర్పులు వెలువరించారు.ఉద్యోగనియామకాలు ఏవైనా ఉద్యోగ ప్రకటన ఇచ్చాకనే చెయ్యాలని,అసైన్ మెంట్ భూములకు కూడా భూసేకరణలో ప్రైవేటు యజమానులలాగా నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులు ఇచ్చారు.ఏళ్ల తరబడి కేసులను సాగదీయకుండా త్వరితగతిన తీర్పులను వెలువరించేవారని ఖ్యాతి పొందారు. కేబీఆర్‌ పార్కు ప్రజలదని తీర్పు వెలువరించి ఆ భూమిని కాపాడారు.ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు.ఆయనది నిక్కచ్చిగా ఉండే తత్వం.1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 1997లో పదవీవిరమణ చేశారు.1997-2003 వరకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడిగా ఉన్నారు .భార్య శ్యామలదేవి 1998లో మరణించారు. కుమారుడు శ్రీనివాస్‌ దిల్లీలోఐఏఎస్‌ అధికారి.పెద్దకుమార్తె జ్యోతి, అల్లుడు శ్రీనివాసన్‌ న్యూయార్క్‌లో, చిన్నకుమార్తె డా.జయ, అల్లుడు శ్రీనివాస్‌రాజు కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉంటున్నారు. జ్యోత్స్న ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రజలకు సేవలు చేసేవారు.6.3.2019 న రామస్వామి గారు కన్నుమూశారు.
 
==మూలాలు==
*http://www.newstime.in/2019/03/07/former-judge-supreme-court-justice-ramaswamy-passed-away/
"https://te.wikipedia.org/wiki/కటికితల_రామస్వామి" నుండి వెలికితీశారు