రామన్నపేట్ (యాదాద్రి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 36:
రామన్నపేట్ నగరంలో మన్సిఫ్ కోర్టుతో సహా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలతోఅన్ని ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉంది. 
 
** సాగునీటి వనరులు **
 
రామన్నపేట మండలం లో ప్రధాన సాగునీటి వనరు అయిన ఆసిఫ్ నహార్ కాలువ పారుతున్నది. ఈ కాల్వను నాటి నిజాం నవాబులు 1904 సంవత్సరంలో వలిగొండ మండలం నెమలి కాల్వ గ్రామం వద్ద మూసి నది కాల్వ పై ఆనకట్ట కట్టి కాలువను తవ్వించారు. ఈ కాలువ నీరు మొదటగా మండలంలోని ఇంద్రపాలానగరం పెద్ద చెరువు లోకి వెళ్లి అక్కడి నుండి లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నేముల, దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ, ఏన్నారం గ్రామాల చెరువులను, కుంటలను నింపుతూ ప్రవహిస్తోంది. పల్లివాడ గ్రామం వద్ద మూసీ నదిపై ఆనకట్ట కట్ట నుండి వరద కాలువ ద్వారా బాచుప్పల, సూరారం, కుంకుడుపాముల, బి తుర్కపల్లి గ్రామాల మీదుగా శాలిగౌరారం ప్రాజెక్ట్ లోనికి ఈ నీరు ప్రవహిస్తోంది. ఈ కాలువల ద్వారా సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 
 
* లక్ష్మాపురం ఏటీ కాలువ ద్వారా 1890 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ కాలువ శోభనాద్రిపురం గ్రామంలోని మూసీ నది కత్వా నుండి ప్రవహిస్తూ మునిపంపుల చెరువులో కలుస్తుంది. ప్రస్తుతం ఈ కాలువ శిథిలావస్థలో ఉంది.
పంక్తి 46:
ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి, పాతరాచ కాల్వల నిర్మాణం పూర్తి అయితే మండలంలోని వెల్లంకి, సిరిపురం, రామన్నపేట, కోమ్మాయిగూడెం, జనంపల్లి, ఇస్కిల్ల, ఉత్తటూరు, కక్కిరేణి గ్రామాలలోని సుమారు 8వేల నుండి 10వేల ఎకరాల వరకు సాగు నీరు అందే అవకాశం ఉంది.  ప్రస్తుతం ఈ కాల్వలో మన పనులు సాగుతున్నయి.
 
* కాలేశ్వరం కాల్వ...
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి నీరు మండలానికి రానున్నాయి. ఈ మేరకు కు అధికారులు కాలువ తవ్వకం కోసం భూ సేకరణ పనులు ముమ్మరం చేశారు. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే మండలంలో మరి కొన్ని వేల ఎకరాలకు సాగు నీరుతో పాటు త్రాగునీరు అందనుంది.