ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి వర్గం:చరిత్ర చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
++ప్రవేశిక, నేపథ్యంలో ఉన్న అనవసరమైన పాఠ్యం తొలగింపు |
||
పంక్తి 1:
[[బ్రిటిషు]] పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ బ్రిటిషు పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. [[పొట్టి శ్రీరాములు]] ఆమరణ దీక్షతో ఉచ్ఛస్థాయికి చేరిన ఈ ఉద్యమం ఆయన మరణం తర్వాతనే సఫలీకృతమైంది. 1950 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
==నేపథ్యం==
మద్రాసు ప్రెసిడెన్సీలో [[శ్రీకాకుళం]], [[విశాఖపట్నం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[అనంతపురం]], [[కడప]], [[కర్నూలు]] జిల్లాలుండేవి. ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా
▲మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్థిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్థికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – '''విశాలాంధ్ర''' - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది.
==అంకురార్పణ==
మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా [[1912]] మేలో [[నిడదవోలు]]లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని
నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం [[1913]] [[మే 20]]న గుంటూరు జిల్లా [[బాపట్ల]]లో సమగ్ర '''ఆంధ్ర మహాసభ'''ను నిర్వహించారు. ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంత సుముఖత చూపలేదు. తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.
ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. రెండవ ఆంధ్ర మహాసభ [[1914]]లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు. [[కాకినాడ]]లో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]], [[కొండా వెంకటప్పయ్య]] కలిసి భారత రాష్ట్రాల
==కాంగ్రెసుకు చేరిన ఉద్యమం==
Line 32 ⟶ 23:
''The redistribution of provincial areas on a language basis wherever... and to the extent possible, especially where the people speaking a distinct language and sufficiently large in number desire such a change''
==ఆంధ్రుల్లో అనైక్యత==
Line 38 ⟶ 29:
అయితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి రాలేదు. అభివృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్ర మరింత వెనకబడి పోతుందనే ఉద్దేశంతో, తమకూ ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలనే ప్రతిపాదనను [[1924]]లో రాయలసీమ నాయకులు లేవదీసారు.
ఈ అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ,
[[1939]]లో [[కృష్ణా జిల్లా]] [[కొండపల్లి]]లో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది.
Line 68 ⟶ 59:
ఈ సమయంలో [[1952]] [[అక్టోబర్ 19]]న [[పొట్టి శ్రీరాములు]] అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు.. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 [[డిసెంబర్ 15]]న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు '''అమరజీవి''' అయ్యాడు. ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్సభలో 1952 [[డిసెంబర్ 19]]న ప్రకటించాడు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి [[1953]] [[అక్టోబర్ 1]]న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్.ఎస్ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.
|