కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 108:
===ఫ్రెంచి పాలన ===
బానిసత్వం, బానిస దాడి అనుభవిస్తున్నప్పటికీ ఐవరీ కోస్టు పొరుగున ఉన్న ఘనాతో పోలిస్తే ఐవరీ కోస్టు బానిస వాణిజ్యంతో తక్కువగా బాధపడింది. ఐరోపా బానిస, వ్యాపార నౌకలు తీరంలోని ఇతర ప్రాంతాలను ఇష్టపడ్డారు. 1482 లో పోర్చుగీసు వారు మొట్టమొదటిసారిగా పశ్చిమాఫ్రికా దేశాల సముద్రతీరానికి చేరడంతో పశ్చిమాఫ్రికాలో మొట్టమొదటి ఐరోపా అన్వేషణ ప్రారంభం అయింది. 17 వ శతాబ్దం మధ్యలో సెయింట్ లూయిసు సెనగలులో మొట్టమొదటి పశ్చిమ ఆఫ్రికన్ ఫ్రెంచి స్థావరాన్ని స్థాపించపడు. అదే సమయంలో డచి వారు ఫ్రెంచికి డాకరు లోని గోరీ ద్వీపం హక్కును ఫ్రెంచికి వదిలారు. 1637 లో అస్సినిలోని గోల్డు కోస్టు (ఇప్పుడు ఘనా) సరిహద్దు వద్ద ఒక ఫ్రెంచి మిషను స్థాపించబడింది. ఈ సమయంలో స్థానికంగా బానిసత్వ ఆచరణను అణిచివేసారు. అలాగే వారి వ్యాపారులకు బానిసలను అందజేయడాన్ని నిషేధించారు.
అయితే అస్సినీ మనుగడ ప్రమాదకరంగా ఉంది. 19 వ శతాబ్దం మధ్యకాలం వరకు ఐవరీ కోస్టులో ఫ్రెంచి స్థిరమైన పాలన స్థాపించలేదు. 1843-4లో ఫ్రెంచి అడ్మిరలు లూయిసు ఎడౌర్డు బోయెటు-విలౌమెజు గ్రాండు బస్సం, అస్సినీ ప్రాంతాల రాజులతో ఒప్పందాల మీద సంతకం చేసి వారి భూభాగాలను ఒక ఫ్రెంచి సంరక్షక భూభాగంగా చేసారు. ఫ్రెంచి అన్వేషకులు, మిషనరీలు, వాణిజ్య కంపెనీలు, సైనికులు క్రమంగా ఫ్రెంచి ప్రాంతాన్ని లోగాను ప్రాంతం నుండి స్వదేశీ ప్రాంతాల పరిధిలో విస్తరించారు. 1915 వరకు పసిఫికేషను సాధించబడలేదు.
ఐరోపా ఆసక్తి తీరం నుండి లోపలి భూభాగంలోకి (ప్రత్యేకంగా సెనెగల్, నైజర్ల మధ్య రెండు గొప్ప నదులు ప్రవాహిత ప్రాంతాలలో) విస్తరించింది. 19 వ శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్రికా ఫ్రెంచి అన్వేషణ ప్రారంభమైంది. కానీ ఇది ప్రభుత్వ విధానానికంటే వ్యక్తిగత చొరవపై ఆధారపడుతూ నిదానంగా జరిగింది. 1840 వ దశకంలో ఫ్రెంచి స్థానిక పశ్చిమ ఆఫ్రికా నాయకులతో పలు వరుస ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫ్రెంచి వారు గినియా గల్ఫు వెంట బలవర్థకమైన పోస్టులను నిర్మించి వాటిని శాశ్వత వ్యాపార కేంద్రాలుగా చేయడానికి వీలు కల్పించారు.
[[File:Aouabou-Traité-1892.jpg|thumb|ఫ్రెంచి వెస్టర్ను ఆఫ్రికా లూయిసు-గుస్తావే బింగరు 1892 లో ఫెమింక్కో నాయకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత నిజ్జీ-కోమో రీజియన్లో, ఐవరీ కోస్టు]]
ఐవరీ కోస్టులో మొదటి పోస్టులుగా అసినిలో ఒకటి, గ్రాండు బస్సంలో (ఇది కాలనీ మొదటి రాజధానిగా మారింది) మరొకటి స్థాపించబడింది. పోస్టుల లోపల ఫ్రెంచి సార్వభౌమాధికారం కొరకు స్థానిక నాయకులతో ఒప్పందాలు జరిగాయి. ఫ్రెంచి పోస్టులలో విశేషవాణిజ్యాధికారం పొంది బదులుగా స్థానిక నాయకులకు వార్షికంగా రుసుము చెల్లించింది.
చెల్లించటానికి బదులుగా వ్యాపార అధికారములు కొరకు. ఈ ఒప్పందం పూర్తిగా ఫ్రెంచ్కు సంతృప్తికరంగా లేదు, ఎందుకంటే ట్రేడ్ పరిమితం చేయబడింది మరియు ఒప్పంద బాధ్యతలపై అపార్థాలు తరచుగా తలెత్తాయి. ఒప్పంద షరతులలో తరచుగా సంభవించిన అపార్ధాలు, పరిమితమైన వాణిజ్యం కారణంగా అసంతృప్తి ఉన్నప్పటికీ వాణిజ్యాన్ని విస్తరించాలన్న ఆశతో ఫ్రెంచి ప్రభుత్వం ఈ ఒప్పందాలను కొనసాగించింది.
బ్రిటిషు వారితో సమానంగా గినియా గల్ఫు తీరంలో తమప్రభావం పెరగడానికి కూడా ఈ ప్రాంతంలోని ఉనికిని నిర్వహించాలని ఫ్రాన్సు కోరుకుంది. ఫ్రెంచి నావికా స్థావరాలను ఫ్రెంచి-వాణిజ్య వ్యాపారులను ఉంచటానికి, వారి స్థావరాలపై దాడులను అడ్డుకోవడానికి అంతర్గత క్రమబద్ధమైన పసిఫికేషన్ను ప్రారంభించటానికి ఫ్రెంచి నౌకాదళ స్థావరాలను నిర్మించింది. 1890 లలో గాంబియాతో (అధికంగా మండిన్కా గిరిజనులకు వ్యతిరేకంగా) సుదీర్ఘ యుద్ధానంతరం వారు దీనిని సాధించారు. అయినప్పటికీ 1917 వరకు బౌలె, ఇతర తూర్పు తెగలు దాడులు కొనసాగాయి.{{Citation needed|date=July 2008}}
1871 లో ఫ్రాంకో-పర్షియా యుద్ధంలో ఫ్రాన్సు ఓటమి తరువాత ఫ్రెంచి భూభాగాలైన అల్సాస్-లోరైనులను జర్మనీ విలీనం చేసుకుంది. ఫ్రెంచి ప్రభుత్వం దాని వలసవాద లక్ష్యాలను విడిచిపెట్టి పశ్చిమ ఆఫ్రికా ట్రేడింగు పోస్టుల నుండి సైనిక దళాలను ఉపసంహరించుకుంది. వాణిజ్య పోస్టులను స్థానికంగా నివసిస్తున్న వ్యాపారుల సంరక్షణకు వదిలింది. ఐవరీ కోస్టు లోని గ్రాండు బస్సం వద్ద ఉన్న వాణిజ్య కోస్టు మార్సెయిలు, ఆర్థరు వెర్డియరు సంరక్షణలో మిగిలిపోయింది. 1878 లో ఐవరీ కోస్టు ఎస్టాబ్లిష్మెంటు స్థావరానికి ఆయన పేరు పెట్టారు.<ref name="Library of Congress">{{cite web |url=http://lcweb2.loc.gov/cgi-bin/query2/r?frd/cstdy:@field(DOCID+ci0014) |title=Ivory Coast – Arrival of the Europeans|website=Library of Congress Country Studies|publisher=Library of Congress |accessdate=11 April 2009|date=November 1988}}</ref>
1886 లో సమర్థవంతమైన ఆక్రమణ వాదనతో ఫ్రాన్సు దాని పశ్చిమ ఆఫ్రికా తీరప్రాంత వాణిజ్య పోస్టుల ప్రత్యక్ష నియంత్రణను సాధించింది. అంతర్గత భాగంలో వేగవంతమైన అంవేషణ కార్యక్రమం ప్రారంభించింది. 1887 లో లెఫ్టినెంటు లూయిసు గుస్తావే బింగరు ఐవరీ కోస్ట్ అంతర్గత భాగాలకు రెండు సంవత్సరాల ప్రయాణాన్ని సాగించాడు. ప్రయాణం ముగింపులో ఆయన ఐవరీ కోస్టులో ఫ్రెంచి సంరక్షక సంస్థలను స్థాపించడానికి నాలుగు ఒప్పందాలను ముగించాడు. అంతేకాక 1887 లో వెర్డియరు ప్రతినిధి మార్సెలు ట్రెయిచు-లాప్లిను, ఐర్లాండు కోస్టులో నైజరు నది ముఖద్వారంలో ప్రధాన జలాల నుండి ఫ్రెంచి ప్రభావాన్ని విస్తరించే ఐదు అదనపు ఒప్పందాల చర్చలు జరిపాడు.
===ఫ్రెంచి పాలన యుగం===
|