మర్రి చెన్నారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
== జననం ==
చెన్నారెడ్డి [[జనవరి 13]], [[1919]] న ప్రస్తుత [[వికారాబాదు జిల్లా]], వికారాబాదు తాలూకాలోని [[సిర్‌పుర]] గ్రామములో జన్మించాడు. [[పెద్దమంగళారం]]లో అని మరికొందరి కథనం. ఇతని తండ్రి మర్రి లక్ష్మారెడ్డి.చెన్నారెడ్డి 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి, విద్యార్థి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్థి, యువత, విద్యా, అక్షరాస్యత, సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు.ఇతను ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు.1942లో [[ఆంధ్ర మహాసభ (తెలంగాణ)|ఆంధ్ర మహాసభ]] ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
 
==రాజకీయ జీవితం==
గాంధీజీ పిలుపు మేరకు 1935లో ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. అది ఆయన రాజకీయ అరంగేట్రం. కార్యకర్తగా, సమావేశకర్తగా, ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఆంధ్ర విద్యార్థి కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడుగా అనేక స్థాయిల్లో పనిచేసి అనుభవాన్ని సంపాదించారు. 1938లో జైలు శిక్షను అనుభవించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/మర్రి_చెన్నారెడ్డి" నుండి వెలికితీశారు