'''మాసూమా బేగం''' ([[అక్టోబరు 7]], [[1901]] - [[మార్చి 2]], [[1990]]) సుప్రసిద్ధ సంఘ సేవకురాలు. సమైక్య [[ఆంధ్రప్రదేశ్]] రాష్టంలో తొలి మహిళా మంత్రి. దేశంలో మంత్రి పదవిని అధిష్టించిన తొలి ముస్లిం మహిళ కూడా ఈమెనే! హైదరాబాదీ అయిన మాసూమా బేగం చిన్నప్పట్నుంచే సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా [[సరోజినీ నాయుడు|సరోజనీనాయుడి]]తో పరిచయం ఏర్పడింది. 1928లో [[బొంబాయి]]లో తొలిసారిగా నిర్వహించిన అఖిల భారత మహిళా సదస్సులో పాల్గొన్నారు. [[హైదరాబాద్ రాష్ట్రం]]లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. [[బూర్గుల రామకృష్ణారావు]] ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు విలీనం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో [[పత్తర్గట్టి, హైదరాబాదు|పత్తర్గట్టి]] నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1960 జనవరిలో రెండో ముఖ్యమంత్రి [[దామోదరం సంజీవయ్య]] ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు.