గోదావరి రైలు స్టేషను రాజమండ్రికిరాజమహేంద్రవరం కి మొట్టమెదటి రైల్వే స్టేషను. మెదటి రైలు వంతెన [[కొవ్వూరు రైల్వే స్టేషను|కొవ్వూరు]] నుండి బయలు చేరి గోదావరి స్టేషను వద్ద ముగుస్తుంది. ఈ రైలు వంతెన పై చివరి సారి 1996లో కోరమండలం ఎక్స్ప్రెస్ ని నడిపి ఈ రైలు వంతెనని మూసి వేసి రైల్వేశాఖ రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చింది. మూడవ రైలు నిర్మాణం జరిగాక గోదావరి రైలుస్టేషను కొద్దిగా గోకవరం బస్టాండు వైపు ప్రక్కకు జరపబడింది. 2003 పుష్కరాల సమయంలో ఈ స్టేషను ఆధునీకరించబడింది. ఈ స్టేషను మీదుగా [[కొవ్వూరు]] నుండి ఉత్తరం వైపు రాజమండ్రి వచ్చే ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ బండ్లు వెళ్తాయి కాని ప్యాసింజర్ బండ్లు మాత్రమే నిలుస్తాయి. రాజమండ్రిరాజమహేంద్రవరం నుండి దక్షిణం వైపు కొవ్వూరు, విజయవాడ వెళ్ళే ప్యాసైంజర్ బండ్లు మాత్రమే వెళ్తాయి మరియు ఆగుతాయి. విజయవాడ వైపు వెళ్ళే ఎక్స్ప్రెస్ బండ్లు రెండవ రైలు వంతెన (రైలు రోడ్డు వంతెన) మీదుగా వెళ్తాయి.