రాజనాల కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
TrinadhReddyT (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 6:
| caption =
| birthname = రాజనాల కాళేశ్వరరావు నాయుడు
| birthdate =
| birthplace = [[నెల్లూరు]] [[ఆంధ్రప్రదేశ్]]
| deathdate =
| deathplace = [[చెన్నై]], [[తమిళనాడు]]
| othername = రాజనాల
| yearsactive =
పంక్తి 15:
| partner =
| parents =
| residence = [[హైదరాబాదు]], [[
| website =
| notable role =
పంక్తి 35:
''[[రాజనాల]] ఇంటి పేరు గల ఇతర వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ [[రాజనాల]] చూడండి.''
[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు జిల్లా]] [[కావలి]] కి చెందిన రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య (రాజనాల కాళేశ్వరరావు). ఇంటర్ చదువుతూనే 1948లో నెల్లూరులో స్నేహితుడు లక్ష్మీకుమార్ రెడ్డితో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే నాటక సంస్థను ప్రారంభించారు. మొదటగా నెల్లూరు టౌన్హాలులో [[ఆచార్య ఆత్రేయ]] ‘ఎవరు దొంగ’ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం చూసిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ శాఖలోని అవినీతిని బట్టబయలు చేశావంటూ రాజనాలపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆ తరువాత ‘ప్రగతి’ అనే నాటకాన్ని ప్రదర్శించగా కోపగించిన కలెక్టర్ రాజనాలను సస్పెండ్ చేశారు. ఆ తరువాత ఉద్యోగం వచ్చినా ఇష్టంగా చేసేవారు కాదు. 1951లో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్రెడ్డి నుంచి మద్రాసుకు పిలుపువచ్చింది. అప్పటికే లక్ష్మీకుమార్రెడ్డి ప్రముఖ నిర్మాత హెచ్ఎం రెడ్డి వద్ద పని చేస్తున్నారు. వారు తీసే ‘ప్రతిజ్ఞ’ సినిమాకు విలన్గా రాజనాలను ఎంపికచేశారు. నెలకు రూ.200/– జీతానికి హెచ్ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. 1953లో విడుదలైన ఆ సినిమా విజయవంతమై అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. పాతికేళ్ల వయసులోనే ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఎన్టీఆర్కు మామగా ముసలి జమీందారు పాత్రలో నటించారు. అప్పటినుంచి ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్’ అనే హాలివుడ్ సినిమాలో నటించి, హాలివుడ్లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు. 25 ఏళ్లపాటు విలన్గా, హాస్యనటుడుగా తారాజువ్వలా వెలుగొందారు.
దాదాపు 45ఏళ్ళు అత్యంత వైభవంగా బతికిన రాజనాల చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 1979లో భార్య మరణించడంతో ఆయన వైభవం తగ్గుతూ వచ్చింది. ‘భీమాంజనేయ’ అనే భక్తి, సంగీత ప్రాధాన్య సినిమా సొంతంగా నిర్మించాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. 1984లో ఆయన కుమారుడు కులవర్ధన్ మూర్ఛవ్యాధితో మృతి చెందగా, మరో కుమారుడు కాళీచరణ్ బొంబాయి వెళ్లి అదృశ్యమయ్యారు. దీంతో 1991లో మద్రాసులో ఉన్న వన్నీ అమ్మేసి మిత్రులు, అభిమానుల సహాయంతో హైదరా బాద్ అమీర్పేట రూబీ అపార్టుమెంట్లో ఒక చిన్న గదిని కొనుగోలు చేసి తన రెండవ భార్యతో కాపురం పెట్టారు. 1995లో ‘తెలుగు వీర లేవర’ అనే సినిమాలో నటించారు. హీరో కృష్ణతో కలిసి అరకులో షూటింగ్లో ఉండగా కాలికి దెబ్బ తగిలింది. ఇన్ఫెక్షన్ కావడంతో 1995 డిసెంబరులో కాలు తీసేశారు. అభిమానుల సహాయంతో చివరి రోజుల్లో జ్యోతిష్యం, అష్టసాముద్రికం చెప్పుకుని జీవించారు. సైగల్, ఎం.ఎస్.రామారావు లాగా అద్భుతంగా పాటలు పాడేవారు. 1928 జనవరి 3న జన్మించిన రాజనాల 1998 మే 21న హైదరాబాద్లో మృతి చెందారు.(ఈతకోట సుబ్బారావు ఆంధ్రజ్యోతి 3.1.2018)
- ఇలా ఎన్నో పాత్రలలో ప్రతినాయకుడిగా నటించాడు. జీవితము చివరి రోజులలో [[మధుమేహం]] వ్యాధితో బాధపడుతూ మరణించాడు.
{{colbegin}}
|