నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

+liMkulu
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 35:
|resting_place=తారామతి బారాదరి, హైదరాబాదు}}
 
'''డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]]''' (1933 [[మార్చి 31]] - 2011 [[జూన్ 7]]) [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నాట్య]] కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి.
 
పదవ శతాబ్దంలో [[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ''పేరిణి శివతాండవం'' నాట్యాన్ని పునరుద్ధరించాడు. ప్రబంధ నాట్య సంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్దనం''ను కూడా పునరుద్ధరించాడు.
పంక్తి 42:
 
== జీవిత విశేషాలు ==
రామకృష్ణ తల్లి దమయంతీ దేవి [[నల్గొండ జిల్లా]]<nowiki/>కు, తండ్రి రామమోహనరావు [[తూర్పు గోదావరి జిల్లా]]<nowiki/>కూ చెందినవారు. వీరు [[ఇండోనేషియా]] లోని [[బాలి]] ద్వీపానికి వలస వెళ్ళారు. రామకృష్ణ అక్కడే 1933 [[మార్చి 31]] న జన్మించాడు.<ref name=":0">{{Cite news|title=కూచిపూడి లెజెండ్ నటరాజ రామకృష్ణ పాసెస్ ఎవే|date=7 June 2007|archiveurl=https://web.archive.org/web/20190311055106/https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|archivedate=7 Mar 2011|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/kuchipudi-legend-nataraja-ramakrishna-passes-away/article2084870.ece|newspaper=ది హిందూ}}</ref> ఆయన చిన్నతనంలోనే తల్లి మరణించింది.
 
వారి కుటుంబం నాగపూరుకు వలస వచ్చేసింది. నటరాజ రామకృష్ణకు చిన్ననాటి నుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఆయన నాట్యం నేర్చుకోవడం తండ్రి ఇష్టపడలేదు. "''మా వంశం కళలను పోషించాలే గానీ కళాకారులుగా వాటిని ఆరాధించకూడదని వారి అభిప్రాయం"'' అని తన ఆత్మకథలో రామకృష్ణ రాసుకున్నాడు. తాను రచించిన ''దాక్షిణాత్యుల నాట్యకళా చరిత్ర'' పుస్తకానికి లభించిన కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నపుడు కూడా ఆయన సంతోషించలేదని కూడా రాసుకున్నాడు. <ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|last=నటరాజ|first=రామకృష్ణ|publisher=|year=1995|location=హైదరాబాదు|pages=36|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|isbn=}}</ref>
 
==నాట్య ప్రస్థానం==
పంక్తి 52:
సినిమా నటుడు [[రమణారెడ్డి (నటుడు)|తిక్కవరపు రమణారెడ్డి]] ఆహ్వానం మేరకు [[నెల్లూరు]] వెళ్ళి, అక్కడ నృత్య నికేతనం అనే నాట్య శిక్షణాలయాన్ని స్థాపించాడు. తనకు నాగపూరులో మత విద్వేషాలు పరిచయమే గానీ కుల విద్వేషాలు మాత్రం కొత్తగా ఉందని నెల్లూరులో ఉండగా అతడు వ్యాఖ్యానించాడు. అక్కడి కుల వైషమ్యాలను తట్టుకోలేక వెనక్కి పోదామని అనుకోగా, రమణారెడ్డి వారించిన మీదట ఆగాడు. రెండు సంవత్సరాలు నెల్లూరులో ఉన్న తరువాత గుంటూరు తరలి వెళ్ళాడు.<ref>{{Cite book|title=అర్ధ శతాబ్ది-ఆంధ్రనాట్యం|first=రామకృష్ణ|year=1995|location=హైదరాబాదు|pages=31,51|url=https://archive.org/details/in.ernet.dli.2015.391476/page/n68|series=ప్రథమార్ధం|last=నటరాజ|publisher=|isbn=}}</ref>
 
రామకృష్ణ [[రామప్ప దేవాలయము|రామప్ప దేవాలయం]] లోని శిల్పాల వలన ఉత్తేజితుడై, [[పేరిణి నృత్యం|పేరిణి శివతాండవ నృత్యాన్ని]] పునరుద్ధరించాడు. [[జాయపసేనాని|జాయప సేనాని]] రాసిన ''నృత్తరత్నావళి'' గ్రంథాన్ని ఇందుకు మార్గదర్శినిగా ఎంచుకున్నాడు.<ref>{{Cite book|title=గాడ్స్, హీరోస్ అండ్ దెయిర్ స్టోరీ టెల్లర్స్:ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ సౌత్ ఇండియా|last=శరవణన్|first=వి. హరి|publisher=నోషన్ ప్రెస్|year=2014|isbn=978-93-84391-49-2|location=చెన్నై|pages=|url=https://books.google.co.in/books?id=y2noBgAAQBAJ&pg=PT292&lpg=PT292&dq=%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF+%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%82&source=bl&ots=zxYwpxaGN8&sig=ACfU3U0fHSS2Izt5Fr4ebdc-Pn8VODM29w&hl=te&sa=X&ved=2ahUKEwjisf2BsfngAhWIrI8KHZv_CGU4FBDoATADegQIBxAB#v=onepage&q=%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF%20%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B0%82&f=false}}</ref>
 
ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-'' శ్రీ వేంకటేశ్వర కల్యాణం,'' [[కుమార సంభవము]], [[మేఘ సందేశం]]. [[ఉజ్జయిని]]లో ప్రదర్శింపబడిన కుమార సంభవానికి ''స్వర్ణకలశం'' లభించింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకాలలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో ''దాక్షిణాత్యుల నాట్యకళాచరిత్ర'', ''ఆంధ్రులు - నాట్యకళారీతులు'' ప్రసిద్ధ గ్రంథాలు.
పంక్తి 60:
నటరాజ రామకృష్ణ [[ఆంధ్రనాట్యం]], పేరిణి నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో ''నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం'' సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు. నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం, పేరిణీ శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి.<ref>{{cite wikisource|title=తెలుగువారి జానపద కళారూపాలు|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణ మూర్తి|year=1992|chapter=పేరెన్నికగన్న పేరిణి తాండవ నృత్యం|publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref> హైదరాబాదులోని [[తారమతి బరాదారి|తారామతి]] మందిరము'','' ప్రేమావతి మందిరాలను ఆయన బాగు చేయించాడు. తారామతి, ప్రేమావతులు [[గోల్కొండ]] నవాబు, [[కుతుబ్ షాహి]] ఆస్థాన నర్తకీమణులు.
 
రామకృష్ణ అనేకమంది [[దేవదాసి]] నృత్య కళాకారిణులను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు.
 
==పురస్కారాలు==
పంక్తి 102:
[[వర్గం:కళాసాగర్ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:కూచిపూడి నృత్య కళాకారులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు