ముసలమ్మ మరణము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:1940 పుస్తకాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
విస్తరణ, వికీకరణ ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
▲తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం, డా.[[కట్టమంచి రామలింగారెడ్డి]] రచించిన "ముసలమ్మ మరణం". [[కందుకూరి వీరేశలింగం పంతులు]] లాగానే, కట్టమంచి రామలింగారెడ్డి ఆంగ్ల సాహిత్యం వలన ప్రభావితుడైనాడు. [[చార్లెస్ పి. బ్రౌన్]] రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం) నుండి కథాంశాన్ని తీసుకొని, ఈ కావ్యాన్ని వ్రాశాడు.
== నేపథ్యం ==
ఇందులో కథ ఎవరో తెలుగువారి రాసి, బ్రౌన్ దొరచే ప్రచురింపబడిన ''అనంతపుర చరిత్ర'' అనే గ్రంథం నుండి స్వీకరించబడినది. అనంతపురానికి సమీపంలో బుక్కరాయ సముద్రమని ఒక ఊరున్నది. ఆఊరి చెరువుకట్టకు ''ముసలమ్మ కట్ట'' యని పేరు. అక్కడ ప్రతి యేటా ముసలమ్మను గ్రామదేవతగా పూజించుచు పొంగళ్ళు పెడుతారు. ఇదే విషయమై ఆ పల్లెలో శిలాశాసనమున్నట్లు రామలింగారెడ్డి గ్రంథ పీఠికలో రాశాడు. అనంతపురంలో నివసించిన ఆయన స్నేహితుడు నారాయణ స్వామి నాయని ద్వారా ఆ పుస్తకం చదివాడు.
== ప్రచురణ ==
సమర్థి రంగయ్య సెట్టి చెన్నపట్టణంలోని క్రైస్తవ కళాశాలకు అనుబంధంగా శ్రీమదాంధ్రభాషాభిరంజని అనే సంస్థ స్థాపించాడు. ఈ సంస్థ నిర్వహించిన పోటీలో ఇది బహుమాన కావ్యంగా ఎంపికైంది. మొదటిసారిగా 1900 లో అచ్చయ్యింది. మరల 1940లో రామలింగారెడ్డి షష్టిపూర్తి సందర్భంగా ఆంధ్ర గ్రంథాల సంఘంలో సభ్యుడైన [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] మరికొంతమంది దాతల సహకారంతో ప్రచురించాడు.
== బహుమతులు ==
*1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.
|