అందరికీఅందరిక బాగా తెలుసున్న [[రామాయణం|రామాయణ గాథ]] రాముడి జననం, సీతాకళ్యాణంతో మొదలై రాముడి అరణ్యవాసం, సీతాప హరణం, [[రావణ]] సమ్హారానంతరం శ్రీ రామ పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఆ తరువాత కథ చాలా మందికి తెలిసేంతలా ప్రాచుర్యం కాలేదు. దానికి కారణం రామాయణం విషాదాంతం కావడమేమోనని పండితులు అంటుంటారు. [[రామాయణం]] రెండు భాగాలుగా ఉంది. శ్రీరామ జననం నుంచి పట్టాభిషేకం వరకు మొదటి భాగం. శ్రీ రామ పట్టాభిషేకం నుంచి నుంచి శ్రీ రామ నిర్యాణం వరకు రెండవ భాగం. ఈ రెండవ భాగాన్నే '''ఉత్తర రామాయణం''' అంటారు. ఈ ఉత్తర రామాయణాన్ని భవభూతి [[సంస్కృతం]]లో రాసాడు. ఆయన ఒక చోట కరుణ రసం ఒక్కటే రసం అని చెప్పాడు.