నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
| Other Political Affliations = 1983కు ముందు [[భారత జాతీయ కాంగ్రెస్]]
}}
'''నారా చంద్రబాబు నాయుడు''' (జ. [[1950]], [[ఏప్రిల్ 20]]) భారతీయ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ''' (నవ్యాంధ్ర)''' రాష్ట్రానికి 1వ ముఖ్యమంత్రి (2014-2019). విభజనకు ముందు 1994 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసాడు. 2004 నుండి 2014 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. అతను ప్రస్తుతం [[తెలుగుదేశం పార్టీ]]కి జాతీయ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు.<ref>[http://articles.economictimes.indiatimes.com/2014-05-31/news/50229115_1_legislature-party-leader-tdp-mlas-tdlp-leader "TDP to elect N Chandrababu Naidu as legislature party leader on June 4" – ''Economic Times'']. Articles.economictimes.indiatimes.com (31 May 2014). Retrieved on 7 June 2014.</ref><ref>[http://ibnlive.in.com/news/chandrababu-naidu-invites-pm-modi-to-his-swearingin-ceremony/475660-37-64.html Chandrababu Naidu invites PM Modi to his swearing-in ceremony – IBNLive]. Ibnlive.in.com (31 May 2014). Retrieved on 7 June 2014.</ref><ref>[http://indiatoday.intoday.in/story/tdp-chief-chandrababu-to-take-oath-as-andhra-cm-on-june-8/1/364133.html "TDP chief Chandrababu to take oath as Andhra CM on June 8" : Andhra Pradesh, News – ''India Today'']. Indiatoday.intoday.in (28 May 2014). Retrieved on 7 June 2014.</ref><ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/naidu-to-take-oath-at-mangalagiri/article6072616.ece Naidu to take oath at Mangalagiri]. The Hindu (2 June 2014). Retrieved on 7 June 2014.</ref> అతను ఇండియా టుడే నుండి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్", టైమ్స్ ఆసియా నుండి "సౌత్ అసియన్ ఆఫ్ ద యియర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు పొందాడు. <ref name="articles.cnn.com">{{cite news|url=http://articles.cnn.com/1999-12-30/world/9912_30_sd_1_andhra-pradesh-reforms-indias?_s=PM:ASIANOW|title=South Asian of the Year: Chandrababu Naidu|last=Ghosh|first=Aparisim|date=31 December 1999|publisher=TIME Asia|accessdate=16 January 2012}}</ref><ref name="Outlook">[http://www.outlookindia.com/article.aspx?223957 This Is What We Paid For]. www.outlookindia.com (20 May 2004). Retrieved on 16 January 2012.</ref><ref name="ia.rediff.com">[http://ia.rediff.com/money/2004/may/12spec.htm Naidu, India's leading reformer]. Ia.rediff.com (12 May 2004). Retrieved on 16 January 2012.</ref><ref>[http://archives.dawn.com/2004/05/19/int10.htm With Naidu, Blair and Clinton have also been voted out -DAWN; 19 May 2004]. Archives.dawn.com (19 May 2004). Retrieved on 16 January 2012.</ref> అతను [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా [[భారతదేశం|భారతదేశ]] రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు.
 
== ప్రారంభ జీవితం, విద్య ==
ఈయన [[చిత్తూరు]] జిల్లాలో [[నారావారిపల్లె]] అనే చిన్న గ్రామంలో [[1950]], [[ఏప్రిల్ 20]] వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. <ref>{{cite web|url=http://www.ndtv.com/elections/article/election-2014/chandrababu-naidu-back-in-the-reckoning-with-some-help-from-narendra-modi-509962|title=Chandrababu Naidu: back in the reckoning, with some help from Narendra Modi|accessdate=17 April 2014|publisher=NDTV|author=Devesh Kumar}}</ref><ref>[http://articles.economictimes.indiatimes.com/2004-03-05/news/27380540_1_film-studios-kammas-tdp Economic times]. Articles.economictimes.indiatimes.com (5 March 2004). Retrieved on 7 June 2014.</ref> అతని తండ్రి ఎన్.ఖర్జూరనాయుడు వ్యవసాయదారుడు, తల్లి గృహిణి.<ref name="Rediff">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 2016-06-18.</ref> తన స్వంత గ్రామంలో పాఠశాల లేనందున ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన [[శేషాపురం]]కు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం [[చంద్రగిరి]] లోని జిల్లాపరిషత్తు [[పాఠశాల]]<nowiki/>లో చేరి 9వ తరగతిని పూర్తిచేశాడు.<ref name="rediff.com">[http://www.rediff.com/election/1999/sep/23naidu.htm Rediff On The NeT: The Rediff Election Profile/Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu]. Rediff.com (23 September 1999). Retrieved on 16 January 2012.</ref> ఉన్నత చదువుల నిమిత్తం [[తిరుపతి]]కి వెళ్ళి అచట 10వ తరగతి పూర్తిచేసి, [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] నుండి [[ఆర్థిక శాస్త్రం]]లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. అతను 1972లో బి.ఎ. చేసాడు.
 
== ప్రారంభ రాజకీయ జీవితం ==
పంక్తి 57:
1984లో ఎన్టీఆర్‌ గుండె చికిత్స కోసం [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]<nowiki/>కు వెళ్లినప్పుడు [[నాదెండ్ల భాస్కరరావు]] [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌]]<nowiki/>తో చేతులు కలిపి కొంత మంది శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొన్నారు. ఈ ఉపద్రవాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు రంగప్రవేశం చేశాడు. 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన [[రాంలాల్|రాంలాల్ని]] కలిసి పార్టీలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి [[ఇందిరా గాంధీ]]<nowiki/>లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ అతనికి అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబునాయుడు తెలుగు దేశంపార్టీ శాసన సభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. తన అల్లుడు చేసిన యుక్తికి ఆకర్షితుడైన రామారావు, చంద్రబాబునాయుడుని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చాడు. భాస్కరరావు తిరుగుబాటు యత్నం తరువాత చంద్రబాబు తెలుగు దేశం పార్టీలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేసాడు. 1989 ఎన్నికలలో పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినంత మెజారిటీ లేక పోవడంతో, ప్రతిపక్ష హోదాతో శాసన సభలో అడుగుపెట్టనని ఎన్టీఆర్ ప్రకటించడంతో, నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు.
 
[[1994]] ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో ఎన్‌.టి.ఆర్ భార్య [[లక్ష్మీ పార్వతి]] జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామపై తిరుగుబాటు చేసాడు. తెలుగు దేశం శాసన సభ్యుల మద్దతును కూడగట్టుకొని ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించి అతను 1995 సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. 160 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించడంతో ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. <ref>{{Cite web|url=https://m.dailyhunt.in/news/india/telugu/janammanam+telugu-epaper-janamtel/vaishraay+hotal+raajakiyaalaku+teratisina+chandrabaabu-newsid-83758384|title=వైశ్రాయ్ హోటల్ రాజకీయాలకు తెరతీసిన చంద్రబాబు?}}</ref>
=== శాసనసభ్యుడు, 1989–1994 ===
1989 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు కుప్పం శాసన సభ నియోజకవర్గంలో పోటీచేసి 50,098 ఓట్లు సాధించి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref name="HT">{{cite web|url=http://www.hindustantimes.com/news-feed/archives/chandrababu-naidu/article1-12769.aspx|title=Chandrababu Naidu|accessdate=3 April 2004|publisher=Hindustan Times}}</ref> కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉన్నాడు. <ref>{{cite web|url=http://ibnlive.in.com/news/chandrababu-naidu-a-desperate-fight-for-survival-in-a-divided-state/463237-62-127.html|title=Chandrababu Naidu: A desperate fight for survival in a divided state|accessdate=7 April 2014|publisher=CNN-IBN}}</ref> 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ' ప్రతిజ్ఞ ' చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాలా బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది.<ref name="HT" />
== {{anchor|ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా}}ముఖ్యమంత్రిగా (1995–2004) ==
[[దస్త్రం:Chandrababu_with_Clinton.jpg|alt=Dark-haired man giving gifts to grey-haired man|thumb|2000 లో బిల్ క్లింటన్ ను ఆహ్వానిస్తున్న నాయుడు]]1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకు 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. అతను ఆహార సబ్సిడీలను తగ్గించి, విద్యుత్ సుంకాలను పెంచాడు.<ref name="news.bbc.co.uk">[http://news.bbc.co.uk/2/hi/south_asia/468037.stm South Asia | Surprise performance in Andhra Pradesh]. BBC News (7 October 1999). Retrieved on 16 January 2012.</ref> [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] అధ్యక్షుడు [[బిల్ క్లింటన్]], [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డం]] ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ లు హైదరాబాదు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడును కలిసారు. <ref name="Outlook2" /> అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్‌ ఘోష్, " కేవలం ఐదు సంవత్సరాలలో, అతను గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, భారత దేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చాడు." అని తెలిపాడు.<ref name="articles.cnn.com2" /> ఆ పత్రిక అతనిని "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా అభివర్ణించింది. <ref>[http://www.time.com/time/world/article/0,8599,2053726,00.html Andhra's Vote Is a Test for Reform]. TIME (13 September 1999). Retrieved on 16 January 2012.</ref>
=== విజన్ 2020 ===
భవిష్యత్తు అవసరాలు, సమస్యలు ముందే గుర్తించి తాను "విజన్ 2020" పేరుతో ఈ ప్రణాళికను రూపొందించాడు. దీనిని యు.ఎస్. కన్సల్టెంట్ మికిన్సీ అండ్ కంపెనీతో కలసి కొన్ని ప్రతిపాదనలు చేసాడు.<ref name="Outlook4" />[[దస్త్రం:Mr.Naidu_with_students..jpg|alt=Middle-aged man listening to two younger men|thumb|ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విద్యార్థులతో చర్చిస్తున్న దృశ్యం.]]
పంక్తి 72:
1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, దశాబ్దాల తరబడి కార్యాలయాలకు పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల వద్దకు పంపి ప్రజల వద్దకే పాలనను 1995 నవంబరు 1న ప్రారంభించాడు. ఆర్థిక అసమానతలు లేని ఆరోగ్యకరమైన, ఆనంద దాయకమైన అభ్యుదయాంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కర్తవ్యంగా ఎంచుకొని 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని రూపొందించాడు. అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు రూపొందించి అమలు చేశాడు. కేతికాభివృద్ధిని అర్ధం చేసుకొని 1998లో హైటెక్‌ సిటీని ప్రారంభించి, అనతి కాలంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయిలో గుర్తింపును తెచ్చారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటి ఒక అంతర్జాతీయ సంచలనం. రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో 1998 సెప్టెంబర్‌ 10న ‘పచ్చదనం–-పరిశుభ్రత’ కార్యక్రమంలో దాదాపు 9.36 కోట్ల మొక్కలు నాటారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటు చేసాడు. బీసీలకు 33% స్థానిక సంస్థల రిజర్వేషన్లు చిత్తశుద్థితో చేపట్టారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542393|title=నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం}}</ref>
=== జాతీయ రాజకీయాలపై ప్రభావం ===
1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధానమంత్రులను ఎంపిక చేసిన ‘కింగ్‌ మేకర్‌’గా మారాడు. కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించాడు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్‌, [[భారతీయ జనతా పార్టీ|బీజేపీ]]<nowiki/>లు లేని తృతీయ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి దీనికి మద్దతు ఇచ్చేలా [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌ పార్టీ]]<nowiki/>ని ఒప్పించాడు. ఇందులో భాగంగా [[హెచ్.డి.దేవెగౌడ|దేవెగౌడ]] ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్‌ పట్టుపట్టడంతో, తదుపరి ప్రధానిగా [[ఐ.కె.గుజ్రాల్|ఐకే గుజ్రాల్‌]] ఎంపికలో చంద్రబాబు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్‌గా చంద్రబాబు బాగా శ్రమించాడు. ఆ రెండుసార్లూ చంద్రబాబునే ప్రధానిని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించాయి. కానీ సొంత బలం లేకుండా మరెవరి మద్దతుతోనే పదవి తీసుకొంటే ఎక్కువ కాలం ఉండలేమని గుర్తించి సున్నితంగా నిరాకరించాడు. <ref name="chandra">{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542551|title=జాతీయ రాజకీయాలపై బాబు ప్రభావం దేవెగౌడ, గుజ్రాల్‌ ఎంపికలో కీలకపాత్ర}}</ref>
== {{anchor|1999 election victory}}1999 ఎన్నికల విజయం ==
1999లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీచేసింది. 29 ఎంపీ సీట్లు సాధించి బీజేపీకి మద్దతిచ్చింది. 1999 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లను పొందింది. కేంద్రంలో బి.జె.పి అధ్వర్యలోని ఎన్.డి.ఎ సంకీర్ణ ప్రభుత్వంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీయేకి 2004 వరకూ చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఉన్నాడు. అతను ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణస్వీకారం చేశాడు. 2000 ఏప్రిల్‌-అక్టోబరు మధ్య "నీరు-మీరు" కార్యక్రమాన్ని మొదలు పెట్టి భూగర్భ నీటి మట్టం పెంపుదలకు పాటుపడ్డారు. రైతు బజార్ల ఆవిర్భావం రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం.
పంక్తి 81:
రాష్ట్రపతిగా దళితవర్గానికి చెందిన [[కె.ఆర్. నారాయణన్|నారాయణన్‌]] ఎంపికకు చంద్రబాబు చొరవ తీసుకొన్నాడు. ఆయన తర్వాత ముస్లిం వర్గానికి చెందిన వారికి రాష్ట్రపతి పదవిని ఇవ్వాలని వాజపేయి భావించాడు. ఆ సమయంలో శాస్త్రవేత్తగా ఉన్న [[ఏ.పి.జె. అబ్దుల్ కలామ్|అబ్దుల్‌ కలాం]] పేరును చంద్రబాబే ప్రతిపాదించాడు. శాస్త్రవేత్తలు రాష్ట్రపతి అయితే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కలాంకు నచ్చచెప్పి ఒప్పించాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా చేసిన కృష్ణకాంత్‌ను ఉపరాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించాడు<ref name="chandra"/>.
=== 2003 హత్యా ప్రయత్నం ===
[[2003]] అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో [[అలిపిరి]] వద్ద [[నక్సలైట్లు]] క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు. <ref>[http://www.hindu.com/thehindu/fline/fl2021/stories/20031024004001800.htm A blast and its shock]. Hindu.com. Retrieved on 24 August 2010.</ref> ఈ సంఘటనలో రాష్ట్ర సమాచారశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, తెలుగుదేశం శాసనసభ్యుడు సి.హెచ్ కృష్ణమూర్తి, కారు డ్రైవరు శ్రీనివాసరాజు లకు కూడా గాయాలైనాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ బాంబుదాడి కేసులో 2014లో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/three-persons-jailed-for-four-years-in-alipiri-attack-case-170325|title='అలిపిరి’ ఘటన కేసులో ముగ్గురికి శిక్ష}}</ref>
== {{anchor|2004 elections failure}}2004 ఎన్నికలలో ఓటమి ==
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ రెండు సార్లు వరుసగా ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 2004లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. రాష్ట్ర శాసన సభలో 294 స్థానాలకు గాను 47 సీట్లను మాత్రమే పొందింది. 42 లోక్‌సభ స్థానాలకు 5 స్థానాలలో మాత్రమే గెలుచుకుంది. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం శాసన సభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనాడు.<ref>{{cite news|url=http://in.rediff.com/election/2004/may/11ap7.htm|title=Naidu wins by a Huge Margin|date=20 May 2004|publisher=[[Rediff]]|accessdate=20 May 2004}}</ref> కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షనాయకునిగా తన సేవలనందించాడు.
పంక్తి 87:
చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశంపార్టీ, ఇతర పార్టీలైన [[భారతీయ జనతా పార్టీ]], [[జనసేన పార్టీ]] లతో కలసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు పోటీ చేసింది. ఈ ఎన్నికలలో 175 స్థానాలకు 102 స్థానాలను కైవసం చేసుకుంది.<ref>{{cite news|url=http://deccan-journal.com/content/election-results-2014-chandrababu-naidu%E2%80%99s-tdp-sweeps-andhra-102-seats-out-175|title=Election results 2014: Chandrababu Naidu’s TDP sweeps Andhra with 102 seats out of 175|work=deccan-journal.com}}</ref> ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంకు తొమ్మిదేళ్ళపాటు [[ముఖ్యమంత్రి]]గా పనిచేసిన చంద్రబాబు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభాజనాంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ''' (నవ్యాంధ్ర)''' కు మొట్టమొదటి [[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 జూన్‌ 8న [[గుంటూరు]] సమీపంలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాడు.<ref>[https://web.archive.org/web/20140714011154/http://deccan-journal.com/content/cbn-take-oath-june-8th CBN to take oath on June 8th]. ''Deccan Journal''</ref>
 
ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. రైతులు చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 32వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణంకోసం ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఒక రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ ప్రాంతం నుంచే పాలించుకోవాలనే ఉద్దేశంతో రికార్డు సమయంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు. లోటు బడ్జెట్‌లో ఉన్నా కూడా రెండెంకెల వృద్ధి రేటును సాధించగలిగాడు. అనుబంధ రంగాలలో 22% వృద్ధి సాధించి, నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాడు. బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ తీసుకొచ్చాడు. నవ్యాంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో మూడో అగ్రగామి రాష్ట్రంగా 2029 నాటికి దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా రూపొందించాలన్నదే చంద్రబాబు సంకల్పం. <ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=542393|title=నవ్యాంధ్ర ఆత్మవిశ్వాసం -|website=www.andhrajyothy.com|access-date=2018-06-01}}</ref>
== హెరిటేజ్ ఫుడ్స్ ==
1992లో హెరిటేజ్ గ్రూపును చంద్రబాబునాయుడు స్థాపించాడు. ప్రస్తుతం ఈ సంస్థను నారా బ్రాహ్మణి నిర్వహిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హెరిటేజ్‌ ఫుడ్స్‌. తాజాగా ఉత్తర భారతదేశంలోనూ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌కు సంబంధించిన పాలు, పాల పదార్థాలను సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి ఢిల్లీలో ఆవిష్కరించింది. <ref>{{Cite web|url=http://telugutimes.net/home/article/72/1581/heritage-foods-enters-north-india|title=ఉత్తర భారతానికి హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణ}}</ref>
== సూర్యోదయ రాష్ట్రం ==
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి [[తెలంగాణ]] రాష్ట్రం విభజన చెందిన తరువాత, '''నవ్యాంధ్ర కు''' ప్రజాభీష్టం మేరకు ప్రజా రాజధానిగా [[అమరావతి (రాష్ట్ర రాజధాని)|అమరావతి]]<nowiki/>ని ప్రకటించాడు. హైదరాబాదు వలె కాకుండా <ref>https://economictimes.indiatimes.com/news/politics-and-nation/how-andhra-pradesh-plans-to-make-its-new-capital-amaravati-a-world-class-city/articleshow/58767503.cms</ref> <ref>http://www.thehindu.com/opinion/op-ed/telangana-rising-amaravathi/article7271810.ece</ref> అమరావతి నగరాన్ని రాజధానిగాను, విశాఖపట్నం నగరాన్ని ఐ.టి.సెజ్ - ప్రత్యేక ఆర్థిక జోన్ తో ఐ.టి.హబ్ <ref>https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/Vizag-set-to-become-IT-hub-of-new-state/articleshow/36405634.cms</ref> గా విస్తరించి అభివృద్ధిని వికేంద్రీకరించాడు. అభివృద్ధిలో భాగంగా అతను "ఏ.పి క్లౌడ్ ఇనిషియేటివ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. డిజిటల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసాడు.<ref>http://www.thehindubusinessline.com/news/national/ap-cloud-initiative-launched/article8948616.ece</ref> <ref>http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/Naidu-to-launch-Cloud-Initiative-on-Aug.-5/article14518284.ece</ref>
 
== అమరావతి శంకుస్థాపన ==
పంక్తి 104:
* ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అత్యధిక కాలం పరిపక్షనాయకునిగా సేవలు.<ref>[http://timesofap.com/politics/chandrababu-s-chance-to-equal-nd-tiwari-s-record.html Chandrababu's chance to equal ND Tiwari's record] {{webarchive|url=https://web.archive.org/web/20131203012034/http://timesofap.com/politics/chandrababu-s-chance-to-equal-nd-tiwari-s-record.html|date=3 December 2013}}. timesofap.com. 31 July 2013</ref>
* ఇండియా టుడే ద్వారానిర్వహించిన ఓటుంగులో ఐ.టి. ఇండియన్ ఆఫ్ దమిలీనియంగా ఎంపిక.<ref>{{cite news|url=http://expressindia.indianexpress.com/fe/daily/20000110/fco10083.html|title=Naidu voted IT Indian of the millennium|date=10 January 2000|newspaper=The Indian Express|accessdate=18 May 2013}}</ref>
* టైం మ్యాగజైన్ ద్వారా "సౌత్ ఆసియన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు. <ref>[http://edition.cnn.com/ASIANOW/time/asiabuzz/9912/30/sd/]</ref>
* ఎకనమిక్స్ టైమ్స్ నుండి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద యియర్"గా గుర్తింపు.
* "సి.ఇ.ఒ ఆఫ్ ఆంధ్రప్రదేశ్"గా ఆయనను పిలుస్తారు.
పంక్తి 149:
[[వర్గం:చిత్తూరు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2014)]]