ఉమాశంకర్ జోషి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 39:
=== ఉద్యోగ జీవితం (విద్యారంగంలో) ===
[[దస్త్రం:Chunilal_Madia_and_Umashankar_Joshi.jpg|alt=|thumb|1960లో [[ముంబై]]<nowiki/>లో చునియాలాల్ మాదియాతో ఉమాశంకర్ జోషి (ఎడమవైపు)]]
1937లో జోషి [[ముంబై]]<nowiki/>లోని గోక్లిబాయ్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. ఆపై ఎం.ఎ. పట్టా సంపాదించాక ముంబైలోని సైదెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో పార్ట్-టైం లెక్చరరుగా 1939 వరకు పనిచేశాడు. గుజరాత్ వెర్నాక్యులర్ సొసైటీ (గుజరాత్ విద్యాసభ)లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ స్టడీస్ విభాగంలో ఆచార్యునిగా నియమితుడయ్యాడు. అక్కడ 1946లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకునేంతవరకూ అక్కడే పనిచేశాడు. 1953లో బొంబాయి ప్రభుత్వం అతనిని గుజరాతీ పాఠ్యపుస్తక కమిటీలో సభ్యునిగా నియమించింది. 1953లో [[గుజరాత్]]<nowiki/>లోని [[భావ్నగర్|భావ్నగర్ జిల్లా]]<nowiki/>లోని సనొసరాలో లోక్ భర్తీ శిక్షణ సంస్థ అనే విద్యా సంస్థలో సందర్శక బోధకునిగా పనిచేశాడు. 1954 జూన్ లో [[గుజరాత్ విశ్వవిద్యాలయం]]<nowiki/>లో గుజరాతీ సాహిత్య ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ విశ్వవిద్యాలయంలోనే భాషా విభాగాధిపతిగానూ బాధ్యతలు స్వీకరించాడు. 1956లో అమెరికా, బ్రిటీష్ విశ్వవిద్యాలయాల్లోని సాధారణ విద్య కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[ఇంగ్లాండు]] దేశాలకు పంపిన కమిటీలో ఇతను ఒకడు. 1964లో దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయాల స్థాపనకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన కమిటీలో జోషీ సభ్యుడు.
== మూలాలు ==
|